తెలంగాణ అంటేనే తెగింపు.. త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం..రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అటువంటి చరిష్మా కలిగిన నాయకుడు తన పనితనంతో ఎవరిచేతనైనా జై కొట్టించగలరు. దానికి ఆయన వేసిన ప్రణాళికలు, జరుగుతున్న అభివృద్ధినే నిదర్శనం. తాజాగా గవర్నర్ తమిళిసై కేసీఆర్ను స్ట్రాంగ్ పొలిటీషన్ అంటూ ప్రశంసించారు. ఉద్యమ సమయంలోనూ అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి అందరి చేత తెలంగాణకు జై కొట్టేలా చేశారు కేసీఆర్.. అదంతా ఆయన పనితనం .. నిబద్ధతకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనతో ఉన్నా రు. ప్రతి విషయంలో సర్కారుతో తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. దీన్ని అదనుగా చేసుకొని కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా కేసీఆర్ ఎక్కడా గవర్నర్ స్థానాన్ని తక్కువ చేసింది లేదు. గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయం నుంచి సుదీర్ఘ కాలం గవర్నర్గా పనిచేసిన నరసింహన్తోనూ కేసీఆర్ ఎంతో బాధ్యతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఎవరికైనా గౌరవ మర్యాదలు ఇవ్వడంలో కేసీఆర్ చాలా నిబద్ధతగా ఉంటారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు వచ్చేలా గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు వివాద స్పదమయ్యాయి. అయినా కేసీఆర్ ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసివచ్చే వారిని కలుపుకుంటూ కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.
ప్రతి బడ్జెట్ సమావేశాల్లో సామాన్య, మధ్యతరగతి సంక్షేమానికి, రైతాంగానికి పెద్దపీట వేసేలా పథకాలకు రూపకల్పనలు చేస్తున్నారు కేసీఆర్. గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దళితబంధు, వైద్య కళాశాలలు,మన ఊరు – మన బడి లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
నేడు ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయటంతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా విరాజిల్లుతున్నది. మరోవైపు రైతాంగానికి ఏ లోటు లేకుండా కేసీఆర్ సర్కారు మొదటి నుంచి కృ షి చేస్తూనే వస్తున్నది. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి రైతు నాగలి పట్టిన గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. ఆనాటి నుంచి కేసీఆర్ రైతులకు రంది లేకుండా.. విశేష కృషి చేస్తున్నారు.
రైతు పంట పండించడానికి కావాల్సిన ప్రధానమైన వనరులు కరెంటు, నీటి సౌ కర్యం, పెట్టుబడి. వాటి కోసం ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం లాం టి బృహత్తర పథకాన్ని కేవలం మూడేండ్లలోనే పూర్తి చేశారు. అలాగే మిషన్ కాకతీయతో పూడుకుపోయిన చెరువులను తిరిగి తవ్వించారు. దీంతో చెరువులు ప్రతి ఊరి కి తలమానికంగా మారాయి. దీంతో నేడు ఆ చెరువులన్నీ జలకళతో దర్శనమిస్తున్నాయి. పెట్టుబడి కోసం రైతుబంధుతో ఎకరానికి ఏటా పదివేల సాయం అందిస్తున్నారు. దీంతో పంటల దిగుబడి పెరిగి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల తీరుకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలతో పాటు అవార్డులు ఇస్తూ సత్కరిస్తున్నది. కేంద్ర మంత్రు లు కూడా తెలంగాణ పనితీరును మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతర కరెంటుతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉద్యోగ నియామకాల విషయంలోనూ కేసీఆర్ సర్కా రు వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నది. తెలంగాణలో దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సన్నాహలు జరుగుతున్నాయి. మరోవైపు దేశానికి తెలంగాణ రోల్ మాడల్ అంటూ గవర్నర్ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పనితీరును ప్రశంసించారంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంత నిబద్ధతతో కృషి చేస్తున్నారో అర్థమవుతుంది. కేసీఆర్ ఆలోచన, ప్రణాళికలతో చేసే ప్రతి ఆలోచన ఆచరించదగ్గది.
అందుకే మొన్నటి వరకు కేసీఆర్ను, సర్కారును వ్యతిరేకిస్తూ వచ్చిన గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ దేశానికి రోల్ మాడల్గా నిలుస్తున్నదని అన్నారు. ఈ నెల 15న ఏకకాలంలో 9 వైద్య కళాశాలలకు ప్రారంభోత్సవం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ నిబద్ధ్దతకు గవర్నర్ తమిళి సై జై కొట్టారంటే అది కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ప్రత్యర్థుల చేత కూడా శభాష్ అనిపించేలా కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్లముందు కన్పిస్తున్నది. కేసీఆర్ స్ట్రాంగ్ పొలిటీషన్ అంటూ గవర్నర్ మెచ్చుకున్నది అందుకే.
భారతదేశ చరిత్రలో మరో గొప్ప ఆవిష్కరణకు మెడికల్ కాలేజీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం పదేండ్లలోనే వైద్యరంగంలో అనేక మార్పులు తెచ్చి నేడు ఒకే రోజు 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకోవడం ఓ గొప్ప చరిత్ర. ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే వైద్యవిద్య చదివే అవకాశం దగ్గర చేసిన ఘనత ఉద్యమ నాయకుడు కేసీఆర్ది. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసే గొప్ప ఆలోచన, ఆచరణరూపం దాల్చ డం గర్వించదగ్గ విషయం. ఏ ఆకాంక్షల కోసం ఉద్యమించామో నేడు ఆ ఆకాంక్షలు కండ్లముందే ఆవిష్కృతం అవుతుండటం గొప్ప విషయం. ఇటువంటి అనేక గుణాత్మక మార్పుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కేసీఆర్కు మరింత అండగా తెలంగాణ సమాజం నిలబడాల్సిన అవసరం ఉన్నది.
సంపత్ గడ్డం
78933 03516