హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోని మారుమూల ప్రాంతం పీర్జాదిగూడ. ఈ ప్రాంతం మీదుగా వరంగల్కు వెళ్లే రోడ్డు ఒక్కటే తారురోడ్డు. అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని ఇండ్లు తప్ప మరేం లేని నాటి పీర్జాదిగూడ నేడు అభివృద్ధి పథంలో సాగుతున్నది.
హై దరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తన పరిధిని దాటుకొని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా విస్తరించింది. పీర్జాదిగూడలోని ఖాళీ ప్రాంతాల న్నీ వెంచర్లుగా మారాయి. కొన్నేండ్లలోనే వెంచర్లన్నీ కాలనీలుగా మారాయి. నగరం విస్తరించడంతో పంచాయతీలన్నీ నగర పంచాయతీలుగా మారాయి. దీంతో నివాస ప్రాంతాలు రెట్టింపయ్యాయి.
కానీ, నెలలో రెండుసార్లు పంచాయతీ నల్లా నీళ్లు వస్తే అదే గొప్ప. ఏ వీధిలో చూసినా నీటి ట్యాంకర్ల వద్ద ఆడవారి గొడవలు, రోడ్లకిరువైపులా చెత్తకుప్పలు. మట్టి రోడ్లపై ఏరులా పారే డ్రైనేజీ. వీధులన్నీ అమావాస్య చీకటిని తలపించేవి. అప్పటికే కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలే ఎక్కవగా నివసించేవారు. కేసీఆర్ ఉద్యమం ఫలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పరాయి పాలనలో ఉన్న తెలంగాణ స్వయం పాలనలోకి అడుగుపెట్టింది.
కనీస వసతుల్లేని నగర పంచాయతీలను 2016లో మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ నాయకుడే పరిపాలకుడిగా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. ఇందులో భాగంగా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాలను కలిపి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది ప్రభుత్వం. ఊహించనిరీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, పురపాలక మంత్రి కేటీఆర్ అండదండ లు, మంత్రి మల్లారెడ్డి సహకారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల మద్దతుతో తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించాను. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అమలుచేసిన నూతన మున్సిపల్ యాక్ట్-2018 సంస్కరణల ఫలితంగా కనీస వసతులు లేని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నేడు సకల వసతుల కోవెలగా మారింది.
మిషన్ భగీరథ(అర్బన్)లో భాగంగా రోజు విడిచి రోజు, గడప గడపకు రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. పేద ప్రజలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ను ఇస్తున్నాం. టీఎస్బీపాస్లో భాగంగా ఆన్లైన్లోనే ఇంటి అనుమతులను జారీచేస్తున్నాం.
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 100 పార్కులను ప్రతిపాదించి ఇప్పటికే 80 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సమీకృత మార్కెట్లు, అధునాతన వైకుంఠధామాలు, ప్రకృతి వనా లు, ఓపెన్ జిమ్లు, ప్రధాన రోడ్లతో పాటు ప్రతి వీధిలో సీసీ రోడ్లు, పచ్చటి మొక్కలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వీధి కుక్కలకు ఏబీసీ సెంటర్, ప్రజలకు అందుబాటులో బస్తీ దవాఖానలు, సెట్విన్ సెంటర్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఏర్పా టుచేశాం. కోట్ల రూపాయల నిధులతో వేలాది పనులు ఈ నాలుగేండ్లలోనే పూర్తిచేసుకున్నం. ఒకప్పుడు హైదరాబాద్ మహా నగర శివా రు పల్లెగా నన్ను అక్కున చేర్చుకున్న పీర్జాదిగూడ నేడు రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా మారింది. వందల కోట్లను కేటాయించి స్థానిక సంస్థలను అభివృద్ధికి రోల్ మాడల్గా మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వంలో నేను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రథమ పౌరుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను. థ్యాంక్స్ టూ సీఎం సర్.
(వ్యాసకర్త: మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్)
-జక్క వెంకట్ రెడ్డి