రంగాల్లోనూ ఉంటారు. కాలానుగుణంగా మారుతూ ఉంటారు. కానీ ఈ గిరీశాల రూపం మారినా పాత్ర లక్షణం మాత్రం మారదు. అనైతిక రాజకీయం, వికృత బురదజల్లుడు రాజకీయాలు చేసేవాళ్లంతా గిరీశం వారసత్వాన్ని కొనసాగించే పాత్రధారులుగానే ఉంటారు. గిరీశం లాంటి లక్షణాలున్న నాయకులు అందితే కాళ్లు.. అందకపోతే జట్టు పట్టుకుంటారు.
ఆధునిక నాటకకర్త గురజాడ దూరదృష్టితోనే గిరీశం పాత్రను సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో గిరీశం సోదరులు రాజకీయ రంగంలోకి విస్తృతంగా ప్రవేశించారు. ఈ గిరీశం సోదరులు ఒక్కమాట మీద నిలువరు. ఒక్కపట్టాన ఉండరు. ఒక్క పార్టీలో సరి గా ఉండరు. వేగంగా పార్టీలు మార్చేస్తుంటారు. మాట్లాడే మాటలు వింటుం టే గిరీశం పాత్ర ఇప్పటికీ ఎంత సజీవంగా ఉందో అవగతమవుతూ ఉంటుంది. ‘ఒపీనియన్ మార్చుకోనివాడు పొలిటీషియన్ కానేరడోయ్’ అన్నాడు కన్యాశుల్కం గిరీశం. ఇవాళ తెలంగాణ మీద ప్రేమ ఒలకబోస్తున్న కొందరిని చూస్తుంటే గిరీశం చెప్పిన ఆ డైలాగ్ గుర్తుకువస్తున్నది. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో అధికార పీఠాల కోసం కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అనైతిక రాజకీయం చూస్తే గిరీశం రూపం మారి వీళ్లలోకి ఎంత బలంగా ప్రవేశించాడో అర్థమవుతుంది.
ఆధునిక గిరీశాలు అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అభిప్రాయాలను మార్చేస్తుంటారు. తెలంగాణ రాజకీయ రంగంలో గిరీశాల స్వభావాలు చూస్తే ఉద్యమ సమయంలో చేసిన వికృత చేష్టలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో వీళ్లు వేస్తుండటం చూస్తే ఏమీ మారలేదు అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తుల స్వభావాలు, సారాంశాలు మారవు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ రభస చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను ఎలా తిప్పేస్తున్నారో అవగతమవుతుంది. తెలంగాణలో ఈ రచ్చ రాజకీయం చూస్తుంటే ఎంత వేగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అభిప్రాయాలను మార్చేస్తూ, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో ప్రాంతేతరులతో కలిసి అధికారపీఠాలపై ఉండి మాట్లాడిన మాటలు చూస్తే తిరిగి వీళ్ళే తెలంగాణ వచ్చాక తాము కోల్పోయిన అధికార పీఠాల కోసం మాట మార్చి మాట్లాడుతుంటే అచ్చు గుద్దినట్లు గిరీశం వ్యాఖ్యల లాగే ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణలో ఎగిసిపడుతున్న జలగంగను చూసి తట్టుకోలేక తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మగౌరవ తెలంగాణపై దాడులు చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆనాడు గోడదూకారు. ఇపుడు గోడ ఎక్కారు. ఇది ఎంతకాలం? తెలంగాణ ప్రజలు తెలివైనవాళ్లు. ఈ అత్యాధునిక గిరీశాల ప్రభావానికి లోను కారు. పాలమూరులో ఎగిసిపడే జలదృశ్యాలు చూస్తున్నప్పుడు నాడు ఉద్యమ సమయంలో ఈ గిరిశాలు చేసిన వ్యాఖ్యలు చరిత్ర మరిచిపోదు. వలస బతుకుల వలపోతల తలపోతల తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూ స్వీయ రాజకీయ అస్తిత్వంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆధునిక గిరీశాలు మాట్లాడే అబద్ధపు కూతల్ని తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది. స్వీయ రాజకీయ అస్తిత్వంతో నిలిచి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ నేడు దేశానికే మాడల్గా నిలిచింది.
‘తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే నన్ను కూడా వదిలిపెట్టకండి’ అని ఉద్యమ శిలువనెక్కి, చావు నోటిదాకా పోయి తెలంగాణను గెలిపించిన కేసీఆర్ ఇప్పుడు పాలమూరు జలప్రవాహమై జనం ముందుకొస్తున్నారు. జల విప్లవం, నీలి విప్లవం, పాడి విప్లవం, సస్య విప్లవం, హరితవిప్లవం, వైద్య విప్లవాలు తెలంగాణలో విరబూస్తున్నాయి. అవును ముమ్మాటికీ తెలంగాణ దేశానికే నమూనాగా నిలిచింది. ఈ అత్యాధునిక గిరీశాలు ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా నిలిచారు. ఈనాడు అభివృద్ధి తెలంగాణపై దాడులు చేస్తున్నారు. వీళ్లను తెలంగాణ సమాజం గుర్తెరిగి తగిన సమాధానం చెప్తుంది. ఈ గిరీశాలు అబద్దాలకోరు ఖల్ నాయకులే కాని ఎప్పటికీ నాయకులు కాలేరు. ఇది నిజం… ముమ్మాటికీ ఇది నిజం.
(వ్యాసకర్త : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్)