తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం! అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన స్మారకం.అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా, తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా దీన్ని తీర్చి దిద్దారు. ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితలం మీద నిరంతరం 365 రోజులు ప్రజ్వరిల్లే అమరుల జ్యోతి వరకూ ప్రతిదీ ప్రత్యేకమే. అమరుల త్యాగ ఫలమే తెలంగాణ. వారి స్మరణకు సముచితంగా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో తెలంగాణ అమర వీరుల స్మారకం రూపుదిద్దుకున్నది.
ఒకప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భావానికి కేంద్ర బిందువైన జలదృశ్యం నేడు అమరుల స్మారక కేంద్రానికి నిలయమైంది. టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని జీర్ణిం చుకోలేని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు జలదృశ్యం కార్యా లయాన్ని తొలిగించిన విష యం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రదేశంలో అమరజ్యోతి నిర్మి తమవ్వడం గొప్ప విషయం. సాగరహారం, మిలియన్ మా ర్చ్ సందర్భంలోనూ అనేక మంది ఉద్యమకారులు ఈ ప్ర దేశంలోనే పోలీసుల లాఠీ దెబ్బలకు గురయ్యారు. ఎక్క డైతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదో అక్కడే అమర జ్యోతిని నిటారుగా నిలబెట్టడమంటే ఇది కదా ఆత్మ గౌరవ పతాకకు ప్రతీక.
3 ఎకరాల 29 గుంటల స్థలంలో కలకాలం నిలిచేలా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో అపురూపమైన స్మారకాన్ని అందుబాటులోకి తెచ్చారు. సాధారణ స్మారక స్థూపాలు, ప్రతిమలకు భిన్నంగా, వైవిధ్యమైన తరహాలో ఈ చిహ్నం చరిత్రకు ఎక్కేలా నిర్మించారు. ప్రవేశం మొదలు నిష్క్రమణ వరకూ ఆద్యంతం అమరుల త్యాగాల నుంచి ప్రేరణ పొందేలా ఏర్పాట్లు చేశారు.
అదే సమయంలో సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలకు, సేద తీరడం మొదలు భోజనం దాకా గరిష్ట మౌలిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్ సందర్శనాత్మక ప్రదేశంగా అమరుల స్మారక చిహ్నం సగర్వంగా, సమున్నతంగా చరిత్ర ఉన్నంత కాలం చెక్కు చెదరకుండా నిలబడుతుంది. రాష్ట్ర సాధన కోసం తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన అమ రులను తలుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించకూడదన్న లక్ష్యంతో అమరవీరుల జ్ఞాపకార్థం అద్భుత రీతిలో అమరుల జ్యోతిని ఏర్పాటు చేశారు. నిత్యం ప్రజ్వలించే జ్యోతి అమరుల త్యాగాలను నిరంతరం గుర్తు చేయడంతోపాటు మన లక్ష్యాలను సైతం గుర్తు చేసేలా తీర్చిదిద్దారు. ఇంత గొప్పగా అమర వీరుల స్మృతి చిహ్న నిర్మాణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వా రిని కలకాలం స్మరించుకునేలా ప్రపంచంలోనే స్టెయిన్ లెస్ స్టీల్తో అతిపెద్ద అమర జ్యోతి ఏర్పాటు చేయడమనేది అరు దైన విషయం. Chief Minister KCR తిరుగులేని నిబద్ధతకు ఇది మరో నిదర్శనం.తెలంగాణ ఉద్యమకారుల గుండె ఉప్పొంగే అపురూప సందర్భమిది.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్య మ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నా యి. సాగు, తాగు నీరు సహా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఏ లక్ష్యం కోసమైతే ఉద్యమకారులు తమ ప్రాణాలు బలిపెట్టారో వారి కలలు ఒక్కొక్కటిగా సాకారమవుతున్న సందర్భం. పరాయి పాలనలో ఎండిబీటలు బారిన నేలలు కాళేశ్వర జలాలతో ప్రాణం పోసుకొని కనుచూపు మేర పచ్చని పంటలతో విరాజిల్లుతున్నవి. రైతు కేంద్రంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. కేవలం పదేండ్ల కాలంలోనే అభి వృద్ధిని కొంత పుంతలు తొక్కించారు కేసీఆర్.
తాజాగా గొప్పదైన అమర వీరుల స్మారకం మన కండ్ల ముందు సాక్షాత్కరించడం సీఎం కేసీఆర్ పట్టుదల, పవిత్ర సంకల్పానికి తార్కాణం.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్ )