దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ పనితీరు వల్ల, ప్రధాని మోదీ హయాంలో దేశంలో ఏడు లక్షల 84 వేల 841 రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మోదీ పాలన చేపట్టిన నాటినుంచి దేశంలో రోజుకు సగటున 270 కంపెనీలకు తాళా లు పడుతున్నాయి. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం లో భాగమైన ‘పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ’ నివేదిక బయటపెట్టింది. అదే సమయంలో తెలం గాణలో మాత్రం కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి.
తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతో పాటు సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలు ఎంతగానో దోహదం చేశాయి. కేసీఆర్ పాలనలో కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్ ద్వారా ఐటీ, అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టా యి. ఈ పెట్టుబడులు మన రాష్ర్టానికి తీసుకురావడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఇవే కాకుండా మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చా యి. పారిశ్రామిక కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
కరోనా సంక్షోభం నుంచి బయటపడి రెండేండ్లు అవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం మాత్రం పుంజుకోవటం లేదు. 2021 అక్టోబర్తో పోలిస్తే 2022 అక్టోబర్ లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ నాలుగు శాతానికి పడిపోయింది. 2011 నుంచి 2020ల మధ్య గడచిన పదేండ్లలో ఐఐటీ సూచిక ప్రకారం వార్షిక పెరుగుదల సగటున 3.2 శాతంగా ఉన్నది. ఇది గత సంవత్సరాలతో పోల్చితే చాలా తక్కువ. ఇటీవల కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు చాలా కుంటుపడింది. దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ ఆర్థిక విధానాలేనని ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం.
దేశంలో పారిశ్రామిక రంగం కుదేలవుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల పరిశ్రమల్లో స్థాపిత సామర్థ్యంలో 20 శాతం మాత్రమే ఉత్పత్తులు జరిగేవి. నేడు 24 గంటల విద్యుత్తుతో పుష్కలమైన కరెంటు ఉండడంతో మూడు షిఫ్టుల్లో పనులు జరిగి 100 శాతం ఉత్పత్తులు జరుగుతున్నాయి. కొత్త పరిశ్రమ లు రావడమే కాకుండా పారిశ్రామిక రం గానికి కొత్త వెలుగులు తెచ్చి ఇతర దేశాలకు గడువులోగా ఎగుమతులు చేయ గలుగుతున్నాం. తద్వారా కార్మికులకు చేతినిండా పని దొరకడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూ డా మెరుగుపడుతున్నాయి. అంతేకాకుం డా రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 22.50 లక్షల మందికి ప్రత్యక్షం గా ఉపాధినిస్తున్న అతిపెద్ద రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే.
దేశంలో పారిశ్రామిక మందగమనానికి ఆదాయ పంపిణీలో పెరుగుతున్న అసమానత, చిన్న, మధ్యతరగతి తయారీ సంస్థల నిర్వీర్యం, ఎగుమతుల క్షీణత, దిగుమతుల పెరుగుదల, పేద, మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి రోజురోజుకు క్షీణించడం ముఖ్య కారణం.
కేంద్రం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలు మందగించడంతో ఎంతోమంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. 2020 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల సంఖ్య సుమారు 40 లక్షలు ఉంటే అందులో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీలే. అంటే ప్రతి వెయ్యిమంది జనాభాకు 16 మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు.
ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలకు బదులుగా 6.9 లక్షల ఖాళీలు మాత్రమే భర్తీ చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో 22.50 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు చేయూతనిచ్చింది.
2016 లో నోట్ల రద్దు కూడా పారిశ్రామిక రంగం బలహీనపడడానికి కారణం. నోట్ల రద్దుతో చిన్న, మధ్య తరగతి వ్యాపారులు నష్టపోయారు. మరోవైపు జీఎస్టీ కూ డా దేశాన్ని నష్టపరిచింది. ప్రధాని మోదీ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం మేకిన్ ఇండియా అంటూ అట్టహాసంగా ప్రకటించినా, తన లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారు. అదే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం, యువతీ, యువకుల ఉపాధి కోసం, పారిశ్రామిక అభివృద్ధికోసం టీఎస్ ఐపాస్ పాలసీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది.
కేంద్రంలోని ప్రభుత్వాన్ని నడిపించడానికి రూ.లక్షల కోట్ల విలువైన జాతి సంపదను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తూ, దేశాన్ని పేదరికంలోకి నేడుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం, అవలంబిస్తూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణకు తీసుకువస్తున్నారు. టీఎస్ ఐపాస్, రాష్ట్రం లోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.