డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకులు
ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం చాలా వాడివేడిగా నడుస్తున్న ది. ఇక్కడ నిజాయితీగా మాట్లాడితే ప్రస్తుత చైర్మన్ జనార్దన్ రెడ్డి పోలీస్ కైంప్లెంట్తో విషయం బయటకు వచ్చింది. ఆయన నష్ట నివారణలో భాగంగా ముందుచూపుతో ఈ అంశాన్ని విచారణ సంస్థలకు అప్పగించారు. ఇది నిజంగా హర్షణీయమే. జరిగిన సమస్య దురదృష్టమైయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరికీ అన్యాయం జరగకుండా కొన్ని పరీక్షలను రద్దు చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కల్లబొల్లి మాటలతో నిందలు వేస్తూ పిట్టల దొరలుగా ప్రవర్తిస్తున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ దొందూ దొందే. జాతీయ పార్టీలకు ప్రతినిధులుగా ఉంటూ ఏనాడు కూడా నిర్మాణాత్మకమై న ప్రతిపక్ష పాత్ర వీరు పోషించలేదు. బండి సంజ య్ అన్నా అన్నా అంటూ బుర్ర కథలు చెప్పడం తప్ప ఇప్పటికీ పరిష్కారం కానీ రాష్ట్ర విభజన సమస్యలపై ఎన్నడూ కూడా జాతీయ నాయకత్వంతో చర్చించలేదు. తెలంగాణ ప్రజల ఓట్లు అడగడానికి ముందు వారి నైతికతను ప్రశ్నించుకోవాలి. ఉత్తర భారతదేశంలో నడిపిస్తున్న బుల్డోజర్ రాజకీయాలు తెలంగాణలో నడవవు గాక నడవవు.
తెలంగాణ ఒక శక్తి కేంద్రం. జ్ఞాన విప్లవం. మునుగోడు దెబ్బతో బీజేపీకి కనువిప్పు కావాలి. ఇక మరో నాయకుడు పరాన్నజీవి. ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్ చేసి ఎదిగిన నేత. ఆయనే రవ్వంత రెడ్డి. ఈయన కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. సమస్య ఏం టంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని గుడ్డిగా వ్యతిరేకించే భావజాలమే వీరికి ఉంది కానీ కొత్త ఆలోచనలు, విధానాలు పంచుకునే బుద్ధి జ్ఞానం ఇద్దరికీ లేదు.
ఈ మధ్య రైతుబంధు పై రవ్వంత రెడ్డి మాట్లాడిన మాటలు రైతుల మనోభావాలను గాయపరిచాయి. రైతుబంధు తాగుబోతులకు ఉపయోగపడుతుందని చెప్పడం ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. ఓవైపు పెట్టుబడి సాయంగా రైతులకు వరం గా మారిన విధాన నిర్ణయమని ఐక్య రాజ్య సమితి లాంటి సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే ఈ కుళ్ళుబోతు రవ్వంత రెడ్డి తనకు తాను ఓ అజ్ఞాని అని నిరూపించుకున్నాడు. గతంలో కూ డా ప్రగతి భవన్ను కూల్చాలని ఒకరు పేల్చాలని మరొకరు పిల్లి కూతలు కూశారు. కేంద్ర ప్రభుత్వం ఓవైపు పక్షపాతం ప్రదర్శిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దక్షతలతో అడుగులు ముందుకేస్తున్నారు.
తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం గణనీయం గా పెరిగింది. ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తుంటే, కేటీఆర్ నాయకత్వంలో వేల కోట్ల పెట్టుబడులు ప్రవాహంలా ముం దుకు వస్తున్నాయి. ఫాక్స్కాన్ లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి లక్ష ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ , కేటీఆర్ల పనితీరు నిజమైన డబుల్ ఇంజ న్ సర్కార్కు నిదర్శనం కాదా? ఇప్పటికే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఎనిమిది లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాని ది. గ్రామీణ అభివృద్ధిలో ఎ న్నో అవార్డులు పొందిన రాష్ట్రం తెలంగాణ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై తపిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దళిత బంధు యావత్ దేశంలోనే ఒక పరిశోధనాంశం. యావత్ దేశ సంపదను ప్రధా ని మోదీ ఆదానీలకు పంచి పెడుతుంటే, తెలంగాణలో మాత్రం సంపద సృష్టి స్తూ ప్రజలకు పంచి పెడుతున్నారు. కేవలం పింఛన్ల రూపంలోనే నెలకు సుమారు వెయ్యి కోట్ల వరకు సంపద ఇక్కడ పంచబడుతున్నది.
కేంద్రం కోయిల పేరుతో కాకి రాగాలు తీస్తూ సప్తరుషి పేరుతో దుశ్శాసన విధానాలు తీసుకొస్తున్నది. అమృత కాలం అంటూ రైతుల నడ్డి విరుస్తున్నది. సబ్సిడీలను ఎత్తివేసి రైతులకు భారం పెంచడం ఏ అమృత కాలం అవుతుందో చెప్పాలి. అందుకే దాన్ని భారతీయ జనతా పార్టీ అని కాకుండా బిజినెస్ జనతా పార్టీ అంటారు. ఇంతటి సిగ్గుమాలిన జాతీయ వాదంతో దేశాన్ని పాలిస్తున్న నేటి పార్టీలకు విరుగుడుగా ప్రత్యామ్నాయ జాతీయ నాయకత్వంతో ముందుకు వస్తున్న మా దేశ్ కి నేత కేసీఆర్ ను నిలువరించడానికి కుట్రలు పన్నుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ కవితపై కుట్రలు చేస్తూ ఆదానీ విషయాన్ని పక్కదోవ పట్టించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో చేసిన పోరాటం యావత్ దేశానికి తాకింది. జంతర్ మంతర్లో కవిత చేసిన ఒక్క రోజు దీక్ష పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది.
మేధావులతో,ఉద్యమకారులతో, ప్రతిపక్ష నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ పురుడు పోసుకున్న భారత రాష్ట్ర సమితి పరుగులు పెడుతున్నది.
ఈనెల 26న మహారాష్ట్రలో జరగనున్న మరో బహిరంగ సభ యావద్దేశ వాసులను మెల్కొల్పనున్నది. గాంధేయ వాదానికి ప్రతీకగా నిలిచి అంబేద్కర్ తత్వానికి జీవం పోసే సంకల్పంతో ముందుకు పోతున్న మా కేసీఆర్ మాకు కావాలి. ఆయన నాయకత్వం మాకు శిరోధార్యం.
– మఠం బిక్షపతి
95424 23242
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)