Gandhi Bhavan | పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పట్లో తేలేలా లేదని, బహుశా వచ్చే ఎన్నికల ఫలితాలను చూసాకే వారు నిర్ణయం తీసుకునేలా ఉన్నారని గాంధీభవన్లో జోకులు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరడం లేదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్లో చేరడం ఖాయమని భావించారు. అయితే ఆ తర్వాత ఖమ్మం సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారనే మరో ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా రాహుల్గాంధీతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అప్పుడైనా చేరుతారో లేక రాహుల్గాంధీకి రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తారేమో చూడాలి.