అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఓ ఆశ్రమంలో మహిళ అత్యాచారానికి గురైంది. ఆ ఆశ్రమ గురువు(Spiritual Leader) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. 2016 నుంచి మైనర్గా ఉన్న సమయంలోనూ ఆమె వేధింపులకు గురైంది. ఆనంద్ మఠానికి చెందిన దత్తగిరి గురు జైరాంజీ మహారాజ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని 64(2), 351(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతోందని చందూరు రైల్వే పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేశ్ మాస్కే తెలిపారు. 2014లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి జైరాంజీ మహారాజ్ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. 2016 నుంచి మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆ స్వామీజీతో ఉన్నట్లు ఆమె చెప్పింది. గురు జైరాంజీ తనను లైంగికంగా వేధించాని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.