‘ఇండియన్ విజన్ ఆఫ్ పొలిటికల్ థింకింగ్’ గా పేరుగాంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారతీయ రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన శక్తి. తన ఆలోచన విధానం, పరిపాలన వ్యవహారాలు, రాజకీయ సంకల్పం, ఆర్థిక విధానం, సామాజిక సమానత్వం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ఇంజినీరింగ్ రూపకల్పన మిగిలిన అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఆధునిక పారిశ్రామిక రంగానికి బాటలు వేసి ముందుచూపు వ్యవహారశైలితో నడవడికను రూపొందించే గొప్ప నాయకుడు కేసీఆర్! నూతన సంక్షేమ పథకాలన్నింటికో రూపశిల్పి సీఎం కేసీఆర్. అందుకే మూడోసారి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
భారత రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులకు తన వ్యూహం ఏ మాత్రం అర్థం కాకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శించే ఏకైక నాయకుడు కేసీఆర్. బహుశా ప్రపంచంలో ఇంతటి అరుదైన రాజకీయ నాయకుడు ఉండరంటే అతిశయోశయోక్తి కాదు. సమాజంలో ఎంతటి వ్యక్తినైనా తన వాగ్దాటితో మెప్పించగల నాయకుడు కేసీఆర్. ఎంతటి జఠిలమైన సమస్యనైనా ఒక నిర్ణయంతో పరిష్కరించగల రాజకీయ చాణక్యుడు కేసీఆర్. అందుకే ఆధునిక రాజకీయ నాయ కుల్లో ఆయనకు ఆయనే సాటి.
కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఒకరిని మించి ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. బీజేపీ హిందుత్వ విధానాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ముందుకు పోతున్నది. కానీ బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి నినాదంతో ముందుకుపోతున్నది. తెలంగాణను సాధించిన పార్టీగా, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో గౌరవం ఉన్నది.
గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు, అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ప్రజల్లో కేసీఆర్కు ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. రెండు పర్యాయాలు అధికారాన్ని చేపట్టి సుస్థిర పాలనను అందించిన నాయకుడిగా కేసీఆర్ ప్రజల మన్ననలు పొందారు. సాధ్యం కాదనుకున్న అనేక పనులను చేసిన ఘనత కేసీఆర్ది.
కేసీఆర్ రాజకీయ వ్యవహార శైలి ఎదుటి వ్యక్తి అందుకునేంత ఈజీ గా ఉండదు. అందుకే ఆయనను ఆధునిక చాణక్యుడిగా అభివర్ణి స్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను ము ఖ్యంగా 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళల పింఛన్, వికలాంగుల పింఛన్, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటివి గతంలో అమలులో లేని పథకాలు. అంతేకాకుండా ఎడారిగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక రిజర్వాయర్లు నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. తాజాగా కరువు నేల, వలసల నేలగా పిలవబడే పాలమూరు, రంగా రెడ్డి జిల్లాలకు సాగు నీరు, తాగునీరు అందించాలనే సంకల్పంతో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇటివలే ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటికే రిజర్వాయర్ల ద్వారా పాలమూరు కరువును తీర్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేస్తే రెండు జిల్లాల్లోనూ జలవనరులు పెరిగి కరువు మటు మాయమవు తుందనడంతో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసి 300 సంవత్సరాలు పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన 4వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టడంలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. మిషన్ కా కతీయతో చెరువుల పూడిక తీయించి వాటిని నీటి చెలిమెలుగా మార్చి న ఘనత కేసీఆర్ది. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఈ పథకాలను దేశమంతా విస్తరించడం కోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో రైతు రాజ్య స్థాపనకోసం భారత రాష్ట్ర సమితితో ముందుకు పోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ను ఎదుర్కోవడం తెలంగాణలో మిగిలిన పార్టీలకు అంత సులువేం కాదు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ముందుకు తీసుకుపోతున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం గతంలో కరువు కాటకాలతో నిండి ఉండేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలలో దర్శనమిస్తున్నది.
తెలంగాణ వ్యవసాయమంతా మెట్ట ప్రాంతంలోనే సాగవుతుంది. దీనికి ప్రధానంగా కరెంటు తప్పనిసరి. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు కరెంటు మోటర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వీరికి 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని కలలుగన్న స్వయాన రైతు అ యినా కేసీఆర్ ఆ కలను నిజం చేశారు. గ్రామీణ ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి గ్రామీణ కుటీర పరిశ్రమలను, పునరుద్ధరించడానికి కులాలవారీగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.
లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేపట్టిన రైతు బాంధవుడు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం సుస్థిర రాజకీయ పరిపాలన దక్షుడు కేసీఆర్. తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చేసి, స్థిర పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే గొప్ప నాయకుడు కేసీఆర్ మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మనమందరం కోరుకుందాం.
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610