మణిపూర్ మంటలకు బీజేపీ డబులింజిన్ సర్కారు చర్యలే కారణమంటున్నారు జాతీయ, అంతర్జాతీయ పరిశీలకులు. 35 లక్షల మణిపూర్ ప్రజల్లో 54 శాతం మెయితీ హిందువులు. వీళ్లు రాజధాని ఇంఫాల్ తదితర మైదాన ప్రాంతాల్లోను; మిగిలిన కుకీ తదితర గిరిజన తెగలు, క్రైస్తవులు- అడవులు, పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దశాబ్దాలుగా పాలనాధికారం మెయితీలదే. ఉదాహరణకు 60 శాతం మంది ఎమ్మెల్యేలలో 40 మంది మెయితీలే! ఇప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్సింగ్ కూడా మెయితీ హిందువే!
‘ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేలాదిమంది గాయాల పాలయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కల్ని దాటుతున్నయి. తన అధికార సుస్థిరత కోసం మోదీ రూపొందించిన 2002 గుజరాత్ (ఫైల్స్) మాడల్నే, మణిపూర్లో బీరేంద్ర సింగ్ అనుసరిస్తున్నాడు. అందుకే మణిపూర్ మైనారిటీ కుకీ ఆదివాసీ క్రైస్తవులపై, మెజారిటీ మెయితీ హిందువుల మూక దాడులకు గేట్లు తెరిచాడు. అందువల్లనే వేలాది ఇండ్లను, వందలాది చర్చీలను కాల్చేయగలిగారు వాళ్ళు. రేప్ను గూడ మెజారిటేరియన్ ఆయుధంగా మార్చేశారు’ మణిపూర్ను అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ స్వైన్ అన్న మాటలివి.
మౌలిక వసతులు,విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మెయితీల కన్నా తామెంతో వెనుకబడి ఉన్నామన్నదే గిరిజనుల ఆవేదన. గత పాలకులు, ఆయా సంఘాలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాల వల్ల కాస్త ప్రశాంతం గా ఉంటుంది మణిపూర్. కానీ డబులింజి న్ బీజేపీ పాలనలో ‘సదరు ఒప్పందాల ప్ర కారం గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చకపోవటం, విద్య ఉద్యోగ, ఉపాధి అవకాశా లు బాగా తగ్గి, నిత్యావసరాల ధరలు భారీగా పెరగటం వలన, దేశమంతటా ఉన్నట్లే, మణిపూర్ ప్రజల్లో, బీజేపీ మద్దతుదారులై న సామాన్య మెయితీల్లోనూ అసంతృప్తి జ్వ లించిన మాట వాస్తవం. ఉదాహరణకు ఇటీవల చెలరేగిన మణిపూర్ ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం, బిష్ణుపూర జిల్లాలో బీజేపీకి చెందిన పీడబ్ల్యూడీ మంత్రి ఇంటిని తగలబెట్టడం అందుకు నిదర్శనాలంటున్నారు పరిశీలకులు!
దక్షిణ భారతాన తమ విద్వేష రాజకీయ అస్త్రం పనిచేయలేదనీ, అందుకే తమకక్కడ గేట్లు మూసుకున్నాయనీ, కర్ణాటక తీర్పుతో గ్రహించింది బీజేపీ. అందుకే ఈశాన్య భారతాన హిందువుల ఆధిక్యత గల మణిపూర్ వంటిచోట్ల, తమ విద్వేష రాజకీయానికి మరింత పదును పెట్టి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కేందుకు బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్పీ వగైరాలు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాయనీ, తత్ఫలితమే మణిపూర్ మంటలనీ విశదీకరించారు పరిశీలకులు! ఉదాహరణకు ‘నాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను మైదాన,పర్వత ప్రాంతాలవారీగా విభజించి, పరస్పర విద్వేషాన్ని రగిలించారు. దానివల్లే నేటి మెయితీ వర్సెస్ కుకీల ఘర్షణలు. నాడు కుకీలకు ఎస్టీ హోదాని చ్చి, మెయితీలకివ్వలేదు. అందుకే ఇప్పుడైనా మెయితీలకు ఎస్టీ హోదానివ్వాలి!’ అని తమ ‘ఆర్గనైజర్’ పత్రికలో రాసింది ఆరెస్సెస్! విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి ‘మిళింద పాండే’ కూడా తమ ‘హిందూవిశ్వ’ పత్రికలో అలాగే రాశారు. అదనంగా, కుకీ క్రైస్తవులు పలు హిందువు ల దేవాలయాలను విధ్వంసం చేశారని రా సి వారిలో క్రైస్తవ విద్వేషాన్ని రగిలించారు.
అంతేకాదు, ‘మెజారిటీ మెయితీలు నివసిస్తున్న భూభాగం కన్నా ఐదారు రెట్లు ఎక్కువ భూభాగంలో మైనారిటీ’ కుకీలు నివసిస్తున్నారు. ఎస్టీ హోదా లేనందువల్లనే మెయితీలు గిరిజనుల భూముల్లోకి వెళ్లలేకపోతున్నారు. అందుకే మెయితీ హిందువులకూ ఎస్టీ హోదాను కల్పించాల’ంటూ బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా ఊదరగొడుతున్నది. ‘తమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేకున్నా, బీజేపీ రగిలించే మత విద్వేషమే బీజేపీకి బలాన్ని సమకూర్చుతుంది! అందువల్లనే ప్రపంచం ఛీ అంటు న్నా సరే, బీజేపీ మాత్రం ఎన్నికల ఏరును దాటేందుకు ‘మత విద్వేషపు మరబోటునే’ వినియోగిస్తున్నది.
సరే బీజేపీ, ఆరెస్సెస్ కోరిక మేరకు మె యితీలకు ఎస్టీ హోదా వచ్చిందే అనుకుం దాం, మైదాన ప్రాంతంలో, ఇండ్లు వాకిళ్ళే తప్ప సెంటుభూమి లేని లక్షలాది మెయితీ పేదలు, గిరిజన ప్రాంతాల్లో కనీసం ఎకరా భూమినైనాకొనగలరా?
కుబేర హిందువు లు మాత్రమే ఎస్టీ హోదాతో గిరిజన ప్రాం తంలో వందల, వేల ఎకరాలు కొనగలరు, అక్కడి ఖనిజ సంపదను సొమ్ము చేసుకోగలరు. కాబట్టి బీజేపీ, ఆరెస్సెస్ వారి ఈ ఎత్తుగడలన్నీ కేవలం కుబేర మెయితీల కోసమే గాని, కష్టజీవులైన మెయితీల కోసం కాదని స్పష్టమవుతున్నది. కానీ ఎస్టీ హోదా కోసమని రగిలించిన ఈ మారణ హోమానికి బ లవుతున్నది అమాయక మెయితీలు, బాధి త గిరిజనులేనన్నది సత్యం.ఆరెస్సెస్ అం టున్నట్టు బ్రిటిష్వారు గిరిజనులకు ఎస్టీ హోదాను ఉదారంగా ఇవ్వలేదు. నేటి బీజేపీ పాలకుల్లా, నాటి బ్రిటిష్ పాలకులు కూడా అటవీ భూముల్లోని ఖనిజాలను కొల్లగొట్టేందుకు అడ్డుగా ఉన్న గిరిజనులను పారదోలుతుంటే అల్లూరి సీతారామరాజు వంటి వీరుల నాయకత్వాన గిరిజన తెగలన్నీ సమీకృతమై, ఎన్నో బలిదానాలతో, ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కు ఎస్టీ హోదా. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఆవిష్కరించి, ఆయన త్యాగాలను ప్రశంసించిన మోదీకి, బీజేపీకి తెలియని చరిత్రా ఇది ?
ఈ మంటలు మణిపూర్తోనే ఆగక, సరిహద్దు రాష్ర్టాలన్నింటికీ అంటుకోవచ్చు. శత్రుదేశాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. మొన్న ప్రగతిశీల ప్రజాసంఘాలు ‘కర్ణాటకా మేలుకో’అంటూ ఆ రాష్ట్రమంత టా పర్యటించి మత విద్వేష రాజకీయాన్నక్కడ మట్టికరిపించారు. వారి మార్గదర్శకత్వంలో, పార్టీలకతీతంగా ప్రగతిశీల ప్రజాసంఘాల మేధావులు, కవులు, కళాకారులందరూ, మణిపూర్ మంటలనే కాదు… ‘మేలుకో భారతదేశమా’ అంటూ ఆసేతు హిమాచల పర్యంతం పర్యటిస్తూ ‘మత వి ద్వేష రాజకీయ మంటల్ని’ ఆర్పేసి, మన దేశాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. మేధావులారా మేల్కోండి.
పాతూరి
వేంకటేశ్వరరావు