మనుషులు పుడతారు, మరణిస్తారు. కానీ, కొందరే మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ రెండవ కోవకే చెందినవారే కుసుమ జగదీశ్. ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ఆయన ఎప్పుడూ జనం ఆకాంక్షల వైపే అడుగులు వేశారు. నాటి ఓరుగల్లు జిల్లా ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో కుసుమ సులోచన-ఆదినారాయణ దంపతులకు జగదీశ్ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు బాల్యం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణా లున్నాయి. అందుకే యువ తరాన్ని కూడగట్టి చిన్న వయసులోనే ‘విశ్వభారతి యువజన సంఘాన్ని’ ఏర్పాటుచేశారు. మూఢనమ్మకాలు, మద్య పానం, ధూమపానం లాంటి సాంఘిక దురాచారాలపై ప్రజలను చైతన్యపరి చారు. జగదీశ్ ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే విప్లవోద్యమానికి ఆకర్షితు డయ్యారు. ఆయన అనేక నిర్బంధాలను ఎదు ర్కొన్నారు. తర్వాత తెలంగాణ జనసభ వేదికగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించ డానికి ములుగు ప్రాంతానికి వచ్చిన సందర్భంగా, జగదీశ్ పోరాట పటిమ గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష, చురుకుదనం కలిగిన జగదీశ్ సేవలు ఉద్యమానికి అవసరమని భావించి, ఆయనను తన వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి జగదీశ్ పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో ఆందోళన చేస్తున్న తరుణంలో తన వీపంతా కాలి పోయినా వెనుకంజ వేయకుండా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన ఘనత జగదీశ్కే దక్కింది.
ఉద్యమం మొదలు స్వరాష్ట్రం సిద్ధించేదాకా కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ నికార్సయిన ఉద్యమ నాయకుడిగా ఎదిగారు జగదీశ్! మడమ తిప్పని ఆ పోరాటపటిమే, అతడిని తిరుగులేని నాయకుడిని చేసింది. ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. కాలక్రమంలో జిల్లా అధ్యక్ష పదవి కూడా వరించింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని, చేపట్టిన పదవికి వన్నె తెస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ అనతికాలంలోనే అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ములుగును దేశంలోనే రెండవ ఉత్తమ జిల్లా పరిషత్గా నిలిపి ఢిల్లీ వేదికగా అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్థానం సాఫీగా సాగుతున్న కాలంలోనే విధి వింత నాటకం ఆడింది. బ్రెయిన్ స్ట్రోక్తో జగదీశ్ ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారు. జగదీశ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన అంతిమయాత్రకు హాజరైన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, పార్టీ శ్రేణులు, ప్రజలు కన్నీరు పెట్టారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య జగదీశ్ అంతిమయాత్ర సాగింది.
జగదీశ్ అకాలమరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబానికి కేసీఆర్ దన్నుగా నిలిచారు. కోటి యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రక టించి సహృదయాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జగదీశ్ తల్లిదండ్రులు, పిల్లలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్నందించింది. జగదీశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిన తీరు ప్రతీ కార్యకర్తకు ఎంతో భరోసా కల్పిం చింది. పార్టీ అంటే రాజకీయం మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆదుకొని మానవత్వాన్ని చాటడమూ అని నిరూపించింది. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే దృఢమైన సంకేతాన్ని పంపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నాయకులు, కేయూ)
-కొనుకటి ప్రశాంత్
80084 92700