తెలంగాణ త్యాగధనులను గన్న తెగువగల్ల రాష్ట్రం. సమైక్య పాలనలో అడుగడుగునా తెలంగాణ అస్తిత్వాన్ని ఆగం పట్టించి చెరబట్టిన సందర్భాన్ని చూశాం. అన్ని రంగాల్లో తెలంగాణను తీవ్ర వివక్షకు గురిచేసి ఎడారిగా మార్చిన పరిస్థితులను అనుభవించాం. పల్లెలన్నీ బోసిపోయి..సాగు భూములన్నీ బీడువారి, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు దీనంగా చూసే దుస్థితి. భూ మాతను నమ్ముకున్న రైతన్నలు పంట సాగు చేయడానికి ఎన్ని బోర్లు వేసినా..చుక్కనీరు పడక ఉరితాళ్లకు వేలాడిన ఎతలు అనేకం.
వాస్తవానికి ఏ గ్రామమైనా అభివృద్ధి సాధించాలంటే చెరువులే ముఖ్యమైన ఆదరువు. చెరువులుంటే ఆ గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుంది. తెలంగాణ వచ్చాక పల్లెలన్నీ నేడు జల కిరీటాన్ని ధరించినట్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మిషన్ కాకతీయ పేరుతో తవ్వించిన చెరువుల వల్లనే అది సాధ్యమైంది. ఒకనాడు తలాపున గోదారి పారినా చుక్క నీరుకు నోచుకోని తెలంగాణ నే డు జలకళను సంతరించుకున్నది. ఒకప్పుడు చెరువు నిండిందంటే గ్రామమంతా సంబురం గా పండుగ చేసుకునేది. అటువంటి చెరువులు నేడు ప్రతి పల్లెలో కనువిందు చేస్తున్నాయి.
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. తెలంగాణలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్ధేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్ళీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.2014 లో తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015, మార్చి 12న కామారెడ్డి జి ల్లా, సదాశివనగర్లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రాం తాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో చెరువులు తవ్వించా రు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు. అన్ని చెరువులను ఎక్కువ నీటి సామర్థ్యాన్ని కలిగిఉండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తెచ్చారు.
చెరువుల పునరుద్ధరణ చేపట్టి చెరువుల లోతు పెంచడం, కట్టల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లాంటి అనేక చర్యలను ప్రభు త్వం ప్రధానంగా చేపట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదల వల్ల కొంత నష్టం జరిగినా.. ప్రతి గ్రామంలోని చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు ఉంటే.. పంటలతో పాటు పాడి పశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకు ఉపాధి కోసం చెరువుల్లో మత్స్య సంపదను సృష్టించేందుకు తెలంగాణ సారథి కేసీఆర్ చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్నిచేపట్టారు.
తెలంగాణలో ఒక్క పంట మంచిగా పండితేనే సంబురపడేది.. కానీ నేడు మండె ఎర్రటి ఎండకాలంలో కూడా నా తెలంగాణ నే ల పచ్చని పైర్లను పరుచుకొని గ్రామాల్లోకి స్వా గతం పలుకుతున్నట్లు దర్శన మిస్తున్నాయి. గొంతు తడుపుకొనేందుకు నానా కష్టాలు పడ్డ నాటి రోజుల నుంచి.. నేడు తెలంగాణ తల్లి భూగర్భంలో పుష్కలంగా నీటిని దాచుకొని రైతన్న కన్నీరు రాల్చకుండా చేస్తున్నది. నాడు ఎండిన బీళ్లతో దర్శనమిచ్చే గ్రామీణ పరిసరాలు నేడు కనుచూపు మేర పచ్చదనాన్ని పరుచుకొని స్వాగతతోరణమై విరాజిల్లుతున్నాయి.
(వ్యాసకర్త : దళిత విద్యార్థి నాయకుడు)
-సంపత్ గడ్డం
78933 03516