కేసీఆర్.. ఈ రోజు రాజకీయ నాయకత్వానికి పర్యాయపదం. పట్టు విడుపులు, మంచి చెడులు, విజ్ఞత, విచక్షణ.. సమయస్ఫూర్తి.. త్వరగా
నిర్ణయాలు తీసుకునే తత్వం.. వంటి లక్షణాలు సమపాళ్లలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అన్నిటికన్నా మించి.. నాయకుడికి తప్పకుండా ఉండాల్సిన గుణం.. నేర్చుకునే నైజం.. పుష్కలంగా ఉన్న నాయకుడు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన కార్యాచరణనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా మలచుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అసలు ఆ మాటకొస్తే తెలంగాణ సాధనే అంబేద్కర్ ఆశయం. అంబేద్కర్ చిన్న రాష్ర్టాల ఆశయం, విశ్వాసాన్నీ తెలంగాణ ఏర్పాటుకు పునాదిగా చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలనే ఆధారం చేసుకున్నారు. ఆయన తపించిన స్వపరిపాలన అం శాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. తండాలనూ పం చాయతీలుగా మార్చి వారికి నిర్ణయాధికారం ఇవ్వాలన్న అంబేద్కర్ తపనకు కార్యరూపం ఇచ్చారు. ఆ కోవలోనిదే దళితుల ఆర్థిక స్వావలంబన. దళిత బంధు పథకం..ఆ పథకం కింద ప్రతి దళిత కుటుంబాని కి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దాం తో వారు సాగుభూమిని కొనుక్కుని స్వతంత్రంగా వ్యవసాయం చేసుకోవచ్చు. పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్నీ మొదలుపెట్టుకోవచ్చనే అభ్యుదయం ముఖ్య మంత్రి కేసీఆర్ది.
దేశంలో ప్రతి ఒక్కరికి విద్య అందాలనే అంబేద్కర్ కోరికనూ నెరవేర్చారు కేసీఆర్. కేజీ టు పీజీ విధానా న్ని మొదలుపెట్టి ఈ పథకం కింద ఈ రోజు రాష్ట్రంలోని 17 శాతం దళితులకు, 12 శాతం గిరిజనులకు, 51 శాతం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. మన ఊరు.. మన బడి కింద సర్కారు బడులను పునర్నిర్మించి.. ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజల విశ్వాసా న్ని పెంచుతున్నారు. వైద్యాన్నీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి సర్కారు దవాఖానల పనితీరును మెరుగుపరిచింది.
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక నివేదికలో గడిచిన ఐదేండ్లలో తెలంగాణలో 7.3 శాతం పేదరికం తగ్గిందని తేల్చింది. కేసీఆర్ చేపడుతున్న వివిధ పథకాల నుంచి వచ్చిన ఫలితాల వల్లే ఇది సాధ్యమైంది. మాతా శిశు సంరక్షణ, పోషకాహారం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణం, బ్యాంక్ అకౌంట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నీతి ఆయోగ్ తాజా నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా రైతుబంధు, ఉచిత విద్యుత్, దళితబంధు, గొర్రెల పంపిణీ, చేనేతకు చేయూత, చేపపిల్లల పంపిణీకి తోడు డబుల్ బెడ్రూంల ఇండ్ల పంపిణీ, ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలు నిరుపేదల గౌరవప్రద జీవితానికి మార్గాలు వేస్తున్నాయి.
ప్రభుత్వరంగంలోని నాణ్యమైన విద్య, వైద్యం కూడా అందుబాటులోకి రావటంతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయింది. కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలు గ్రామీణ ఆర్థికవ్యవస్థను పూర్తి బలోపేతం చేసి, తెలంగాణలో పేదరకం తగ్గేందుకు కారణమైం ది. పేదరిక నిర్మూలనలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సత్ఫలితాలు రావటం ‘తెలంగాణ మాడల్’కు నిదర్శనం.
ఇవేనా? అంటే కేసీఆర్ వేసే ప్రతి అడుగూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతూనే ఉన్నది. స్వపరిపాలన మీద శ్రద్ధ పెట్టడమే కాదు.. నేడు రాష్ట్రంలో కనిపిస్తున్న పరిపాలన వికేంద్రీకరణ కూడా అంబేద్కర్ ఆశయాల పట్ల కేసీఆర్కున్న చిత్తశుద్ధికి తార్కాణం. జిల్లాలను పునర్విభజించి.. దానికి అనుగుణంగా పాలనావ్యవస్థ పరిధి పెంచారు. కలెక్టర్ల నియామకం పెరిగింది. ఆ వ్యవస్థ కు సపోర్ట్గా ఉండే మరెన్నో ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. అందులో
దళితులకూ అవకాశం దొరికింది.
తెలంగాణలో పాలనా ఫలాలను ప్రజలు స్వయం గా అందుకునే వాతావరణం ఏర్పడింది. రైతే రాజు అన్న నానుడి నిజమైంది కేసీఆర్ హయాంలోని తెలంగాణలోనే. రైతుకు భరోసా ఇవ్వడం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతును ఆదుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా పట్టణాలు, నగరాలకు దీటుగా పల్లెల్లోనూ జీవన ప్రమాణాలను పెంచారు. ఈ పనులన్నీ కూడా ఈ రోజు దేశంలోని ఇతర రాష్ర్టాలన్నింటికీ మార్గదర్శకాలు.
125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించగానే సరిపోతుందా? సచివాలయానికి అం బేద్కర్ పేరు పెట్టగానే బాధ్యత తీరిపోతుందా? అని ప్రశ్నించిన వారందరికీ ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలే. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉంటే.. ఆయన ఆశయాల అమలు.. సాధనలో దేశంలోనే తెలంగాణ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని అర్థం. ప్రతిపక్షాలు అనుకుంటున్నట్టు కేసీఆర్ మాట ల మనిషి కాదు.. చేతల నేత. తనపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలుపుకొనే ధీశాలి. కాబట్టే నేడు దేశమూ కేసీఆర్ దిక్కు చూస్తున్నది.. తమ నాయకుడిగా ఇతడే రావాలని..!
(వ్యాసకర్త: మాజీ ప్రధాన సమాచార కమిషనర్)
-డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
92465 26899