ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుని ఆలయంలో నిర్మించిన రుషుల విగ్రహాలు ఇటీవల గాలి వానకు కూలిపోయాయి. ఆ ఫొటోలు వార్తల్లో హెడ్లైన్స్లో కనిపించాయి. సోషల్ మీడియాలోనూ వైరల య్యాయి. సరిగ్గా ఏడు నెలల క్రితం 2022 అక్టోబర్ 11 నాడు రూ.856 కోట్లతో పునరుద్ధరించి న మహాకాళేశ్వరుని ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఏడాది కూడా తిరక్కుండానే ప్రతిష్ఠాత్మకమైన మహాకాళ్ లోక్ ప్రాజెక్టుకు సంబంధించిన 7 విగ్రహాలు అలా గాలివానకు శిథిలమైపోవడం పలుప్రశ్నలకు తావిచ్చింది. ఆ మందిర పునర్నిర్మాణ పనులను గుజరాత్కు చెందిన ఒక కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చారు. అయితే ఈ సంస్థకు గతంలో అలాంటి పనులు చేసిన అనుభవం ఉందా? లేదా? దేశ ప్రధాని ప్రారంభించిన అంతటి ప్రాశస్త్యం పొందిన ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అలా నాసిరకం పనులు చేస్తే, పర్యవేక్షణా సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వం ఏం చేస్తున్నది?.. అన్న ప్రశ్నలు సామాన్యుడి మెదడును తొలచడం సాధారణమే.
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుతో పాటు, ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన నూతన సచివాలయం, ఆ పక్కనే ఆకాశాన్నంటినట్టుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మొదలైనవన్నీ…. మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలు.
మొన్నటికి మొన్న గుజరాత్లో ని మోర్బీ వంతెన కూలి, పర్యాటకులు చనిపోయిన దుర్ఘటన మరువక ముందే, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు లో అపశ్రుతులు. మోర్బీ వంతెన పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థకూ అలాంటి పనులలో పూర్వానుభవం లేదన్నది ప్ర మాదనంతరం వెలుగు చూసిన నిజం. ప్రగతి పథంలో సాగటానికి ప్రభుత్వం చేపట్టే అభివృధ్ధి పనుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ అభివృద్ధి పనులకు లభించే ఘనకీర్తి ఆయా ప్రభుత్వాల కే దక్కుతుంది. కానీ ఈ నేపథ్యంలో జరుగరాని ప్రమాదమేదైనా జరిగితే, ప్రభుత్వ మే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే విగ్రహాలు శిథిలమైన తర్వాత రూ.856 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆ మహాకాళేశ్వర ప్రాజెక్టు పనుల నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానిక ప్రజల ఆరోపణల ప్రకారం ఆ మొత్తం ప్రాజెక్టుకు రూ.200 నుంచి రూ. 250 కోట్లు కూడా ఖర్చు చేయలేదట. డబ్బులు పెద్ద మొత్తంలో చేతులు మారాయని, అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేలాలంటే విచారణ జరగాలి. కా నీ ఆరోపణలకు స్పందించి విచారణ జరిపించే దమ్ము, ధైర్యం..అక్కడి బీజేపీ ప్రభుత్వ పెద్దలకు ఉన్నదా? అన్నదే మరో పెద్ద ప్రశ్న? ఒక పుణ్యక్షేత్ర పునరుద్ధణ పనులు చేపట్టినపుడు..అవి శతాబ్దాల తరబడి ఉంటాయన్న సోయి, ఉండాలన్న నిబద్ధత& ఆయా పాలకులకు ఉండాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటా యి. వ్యక్తులు మారుతారు. ముఖ్యమంత్రులు మారుతారు. ప్రధాన మంత్రులు మారుతారు..కానీ ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు అలాగే ఉంటాయి.
తెలంగాణలో మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణాలను అందుకు ఉదాహరణగా తీసుకోండి. సిమెంట్ కాం క్రీట్ వాడలేదు. భారీ గ్రానైట్ స్లాబ్లతో అపూర్వంగా నిర్మించారు. ఈ పునర్నిర్మాణానికి 80 వేల టన్నుల రాయిని ఉపయోగించారు. ఆగమ, వాస్తు, పాంచరా త్ర ఆగమాల ఆధారంగా నిర్మాణపు పను లు జరిగాయి. అంతటి బృహత్తర ప్రాజెక్టు పనులు కేవలం నాలుగున్నర ఏండ్లలో పూర్తయ్యాయి. చారిత్రక భవనాల పునర్నిర్మాణం, ఆధ్యాత్మిక స్థలాలను పూర్వ వైభవాన్ని తలపించేట్లు పునరుద్ధరించడం, వాటిని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా నిర్మించడం సవాళ్ళతో కూడుకు న్న సంక్లిష్ట ప్రక్రియ. అది అంత మామూ లు విషయం కాదు. కళాత్మకత, ఆధ్యాత్మిక స్పృహతో పాటు అనుభవం, పరిపాలనా దక్షత కావాలి. అందుకే పుణ్యక్షేత్రా ల అభివృద్ధి, పునరుద్ధరణపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సి న అవసరం ఉంటుంది. అదంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాల డి జైనింగ్, నిర్వహణ, పర్య వేక్షణ మొదలైన వాటికి, పరులెవరు వేలెత్తి చూపలేని ప్రావీణ్యత కావాలి. అందుకు ముఖ్యంగా పా లకులకు పరిపూర్ణమైన నిబద్ధత ఉండాలి.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ము ఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్మాణాలు, కట్టడాలను నిబద్ధతతో చేపట్టారు. ఆయన చేపట్టిన పనులన్నీ కూడా భవిష్యత్ తరా లకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థా యిలో ప్రశంసలు పొందిన కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుతో పాటు, ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, హై దరాబాద్ నడిబొడ్డున నిర్మించిన నూ తన సచివాలయం, ఆ పక్కనే ఆకాశాన్నంటినట్టుగా ఉన్న డా.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మొదలైనవన్నీ….మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలు. ప్రతి తెలంగాణ వాసి గర్వపడేలా నిర్మించిన అపూర్వ కట్టడాలు. అందుకే గుజరాత్ మాడల్ కా దు..దేశానికి తెలంగాణ మాడల్ ఆదర్శనీయం.
మతాల మధ్య చి చ్చు పెట్టి, సామాన్యుల ప్రాణాలను బలిచేసి రా జకీయ లబ్ధిపొందే మోదీలాంటి వారు కాదు… ప్రజల ఆకాంక్షల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన కేసీఆర్ లాంటి నాయకత్వం కావాలి.
-ఎం.నాగ శేష కుమార్
9849486750