ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో మాత్రమే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే కమ్యూనిస్టులు ఈ మధ్య పెద్ద పార్టీల తరహాలో గర్జనలకు కూడా సమాయత్తమవుతున్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత స్వరం పెంచిన కమ్యూనిస్టులు ఎన్నికలకు ఇంకా ఐదు, ఆరు నెలల వ్యవధి ఉన్నప్పటికీ దేశంలో మరే సమస్య లేదన్నట్టు నిత్యం పొత్తుల జపమే చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందగానే ఇక తమ దోస్తీ ఆ పార్టీతోనే ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. త్వరలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల గర్జన నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించారు. అది ఎన్నికల గర్జన కాకపోవచ్చు… సీట్ల గర్జన అనబోయి పొరపాటున ఎన్నికల గర్జన అని ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
– వెల్జాల