తెలంగాణ సిద్ధించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుందని ఎందరో పిచ్చి కూతలు కూశారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కనుక కరెంట్ సమస్య కూడా ఏర్పడి ప్రజలు తిరగబడుతారని బెదిరింపులకు దిగారు. కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే అపర భగీరథుని ముందు చూపుతో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందుతున్నది. కనురెప్ప కొట్టినంత సేపు కూడా కరెంట్ పోకుండా నిరంతరాయంగా పరిశ్రమలకు, గృహ అవసరాలకు సరఫరా జరుగుతున్నది. ఇది తెలంగాణ సాధించిన మొట్ట మొదటి ఘనత. చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయవచ్చుననడానికి తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం. తొమ్మిదేండ్లలో తెలంగాణ అద్భుతంగా పురోగమించింది.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉన్నది. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ స్పష్టం చేసింది.
స్వస్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. అంటే సాగునీటి ల భ్యత పెరిగిందని అర్థం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్లోఉన్న సా గునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గం టల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి సాధ్యమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వై ద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రం గాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్ధి చెందింది. తెలంగాణ అభివృద్ధిని కరో నా కూడా నిరోధించలేకపోయింది. కరోనా కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రా ష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. విద్యు త్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగం లో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లో నూ మంచి అభివృద్ధి నమోదైంది. ప్రతి జిల్లా లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తుందనడానికి అభివృద్ధి సూచికలే నిదర్శనం.
అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది మన ప్రభు త్వం. ఒకప్పుడు కరువు కోరల్లో చిక్కుకు న్న తెలంగాణ నేడు దేశానికి ధాన్యాగారంగా మారింది. తెలంగాణను పట్టి పీడించిన తాగునీటి సమస్య, నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య తీరింది. పది జిల్లాలున్న తెలంగాణను మొత్తం 33 జిల్లాలు చేసి పాలనను ప్రజల వద్దకు తీసుకువచ్చారు. ధరణితో భూ రికార్డుల ప్రక్షాళన వల్ల వివాదాలు తగ్గిపోయి, భూ ములకు భద్రత లభిస్తున్నది. విద్య, వై ద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా ని లుస్తున్నది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకి, అలుగులు పారుతున్నవి.
కాళేశ్వరం, మిషన్ కాకతీయ మూలంగా చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి నీరు పైకి ఉబికి వస్తున్నది. నాటి తెలంగాణ గ్రామీణ ప్రాం తాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల నుంచి మండలానికి డబుల్ రోడ్డు, మండలం నుంచి జిల్లా కేంద్రానికి నాలు గు వరుసల రోడ్లతో రవాణా అత్యంత సక్రమం గా, అనుకూలంగా మారింది. బస్తీ దవఖానలు. అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నత స్థాయికి పెంచారు. ఉచితంగా ల్యాబ్ టెస్టులు, డయాగ్నిస్టిక్ సెంటర్లు ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడి కార్పొరేట్ దవాఖానాల దోపిడి నుంచి విముక్తి చెందుతున్నారు.
కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. హరితహారం ద్వారా రోడ్ల వెంట చెట్లు నాటడం వల్ల చల్లటి వాతావరణంలో ఆకుపచ్చని చెట్ల మధ్య ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా కొనసాగుతున్నది. అటవీ సంపద గణనీయంగా పెరుగుతున్నది. తద్వారా వాతావరణ సమతుల్యత పెరిగింది. ఒకప్పుడు ఎండిన చెట్లతో ముళ్ల కంపలతో ఉండే తెలంగాణ ఆకుపచ్చని తెలంగాణగా విరాజిల్లుతున్నది. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు, ఆట స్థలాలు, మురికి కాలువలు, చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్లు, వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ,అండర్ పాసులు ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందనటంలో సందేహం లేదు. ఇప్పుడు అత్యంత మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు పలు కాలనీలలో దర్శనమిస్తున్నాయి.
దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు ద్వారా ప్రజలకు అన్నం పెడుతున్న రైతులను ఆదుకుంటున్న మహనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దళిత బంధు , ఇతర పథకాల ద్వారా ఇతర కులస్తులను కూడా అక్కున చేర్చుకుని వారి జీవన గమనానికి పూల బాటలు వేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని మతాలు కులాల అణగారి న వర్గాలు, వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పథకాల ద్వారా చేయూత నందిస్తున్నది మన తెలంగాణ ప్రభు త్వం. అన్ని కులాల వారికి హైదరాబాదులో ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధిరేటు 11శాతం కంటే ఎక్కువగా ఉన్నది. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ స్పష్టం చేసింది.
జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగా ణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో వస్త్ర పరిశ్రమ లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఇక ఫార్మా రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఎదిగింది. దేశ ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉన్నది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని, సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదరాబాద్ భారీగా వృద్ధి చెందుతున్నది. ఐటీ రంగంలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. హైదరాబాదులో ఐటీ కంపెనీల స్థాపనకు అనువైనదిగా నిలుస్తున్నది.
వ్యవసాయ, అనుబంధ రంగా ల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతిని సాధిస్తున్నది. జాతీయ స్థాయిలో ఇది 6.6 శాతం మాత్రమే ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ జీఎస్డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానం లో ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శా తం ఉండగా ఏడేండ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానం లో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో ప్రస్తు తం మూడో స్థానంలో ఉన్నది.
వ్యాసకర్త : సింగరేణి రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
దండంరాజు
రాంచందర్ రావు 98495 92958