ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పేదరికం సమస్య పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వ సర్వేల్లోనే వెల్లడైంది. ఈ సర్వేలకు విరుద్ధంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమావేశ వేదికపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతిత్వరలో భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రపంచ ఆర్థికవ్యవస్థలో 10 స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి చేర్చామని చెప్పుకొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే భారత ఆర్థికవ్యవస్థను ప్రపంచంలో అతిపెద్ద ఆర్థ్ధికవ్యవస్థగా మార్చుతానంటూ ప్రగల్భాలు పలికారు.
ప్రధాని మోదీ ఆర్థికవృద్ధిపై చేసిన వ్యా ఖ్యలు నామమాత్రపు జీడీపీని పరిగణనలోకి తీసుకొని చేశాడని తెలుస్తున్నది. ఇది ఆ ఏడాది ఉన్న ధరల ప్రకారంగా ఉత్పత్తి అంచనాను తెలుపుతుంది. నరేంద్ర మోదీ వ్యాఖ్యల ప్రకారం నామమాత్రపు జీడీపీని పరిగణనలోకి తీసుకొంటే భారత ఆర్థ్ధికవ్యవస్థ 2022లో 3.39 ట్రిలియన్ డాలర్ల్ల విలువతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థ్ధికవ్యవస్థగా ఉన్న ది. కానీ ఆర్థికవ్యవస్థను వాఖ్యానించే సమయంలో మనం స్థిర ధరలలో జీడీపీని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తా యి. స్థిరధరలలో జాతీయాదాయాన్ని లెక్కిస్తే దాన్ని వాస్తవ జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయ గణన చేస్తున్న క్రమంలో ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటాం. ఆ సంవత్సరంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఉండరాదు. ఆర్థ్ధిక మాంద్యం లేని సంవత్సరాన్ని ఎంచుకోవాలి. దీన్నే ఆధార సంవత్సరం అంటారు. ఈ ఆధార సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆర్థికవ్యవస్థలో వృద్ధి కనిపించడం సహజం.
నరేంద్ర మోదీ తన హయాంలో ఆర్థికవ్య వస్థ పరిమాణం అపరిమితంగా పెరిగిందని తెలిపాడు. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తలసరి ఆదాయం తెలుపుతుంది కానీ ఆర్థ్ధికవ్యవస్థ పరిమాణం జీవన ప్రమాణ స్థాయిని తెలుపదని ఆర్థ్ధిక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశమైన భారతదేశ తలసరి ఆదాయం జీ-20 దేశాల తలసరి ఆదాయ పట్టికలో అట్టడుగున ఉన్నది. కొనుగోలు శక్తి ఆధారంగా ఇండోనేషియా తలసరి ఆదాయం 11,466(జీఎస్ఐ), 12,410 (జీడీపీ) ఉంటే భారతదేశం తలసరి ఆదాయం 6,590(జీఎస్ఐ), 7.096 (జీడీపీ)గా ఉన్నదం టే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోదీ వ్యాఖ్యల ప్రకారంగా జీడీపీ పెరిగినట్లయితే దేశంలో నిరుద్యోగం ఎందుకు తాండవం చేస్తున్నదో తెలపాలి. మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతన ఉపాధికి పనివారల నమోదుకు డిమాండ్ కూడా అపరిమితంగా ఉన్నది.
భారతదేశంలో యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న యువతకు ఇది ప్రధాన సమస్యగా మారింది. కోట్లాది మంది భారతీయ యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అంతేకాదు భారత ఆర్థికవ్యవస్థ కూడా మందగించడం చూస్తే ఆ ప్రభావం ఉద్యోగాలపై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో ఉద్యోగుల్లోనూ ఆందోళన నెలకొన్నది.
ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకొంటున్నదని ప్రధాని చెప్తున్నారు. కానీ ఎన్డీఏ పాలనలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉంటే ప్రతి ఏడాది ఉపాధి హామీ పనికి డిమాండ్ 5.4 శాతంగా ఉంటున్నదంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతలో స్పష్టంగా కనిపిస్తున్నదని ఎంప్లాయిమెంట్ సర్వే పేర్కొంటున్నది. 15-29 ఏండ్ల మధ్య యువతలో ఈ సమస్య మరింత ఎక్కు వగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఇది ఈ మూడు త్రైమాసికాల నుంచి 23.7 శాతానికి పెరిగినట్టు తెలుస్తున్నది. ప్రతి మూడు నెలలకోసారి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఒక నివేదికను విడుదల చేస్తున్నది. దీంతో పాటు ఏడాదికోసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నిరుద్యోగంపై గణాంకాలను విడుదల చేస్తున్నది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి బీహార్లో అత్యధికంగా 49. 09 శాతం నిరుద్యోగ సమస్య ఉన్నది. కేరళలో 37 శాతం, ఒడిశాలో 35.7 శాతం, గుజరాత్లో 9.6 శాతం ఉన్నదని లెక్కలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఆర్థ్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటివల దేశంలోని ప్రముఖ ఆర్థిక వేత్తలతో జీడీపీ వృద్ధికి సంబంధించి చింతన్ శిబిర్ను నిర్వహించారు. నిజంగా వారు పేదప్రజ ల సంక్షేమాన్ని కోరుకున్నట్లయితే జీడీపీ వృద్ధి కి కాకుండా ఉపాధి అవకాశాల వృద్ధ్దికి చింతన్ శిబిర్ను నిర్వహిస్తే బాగుండేది.
ప్రస్తుత తరుణంలో మన దేశంలో చైనా, దక్షిణకొరి యా, తైవాన్, సింగపూర్ త రహాలో ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు రావాలి. చైనా లో శ్రామికుల వయసు పెరుగుతుండటంతో భారత్ సహజంగానే దానికి ప్రత్యామ్నాయం గా మారుతుంది’ అని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఎంప్లాయిమెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని, తద్వారా చైనా నుంచి ఉత్పాదక రంగంలోని బహుళజాతి సంస్థలను భారతదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తున్నది.
భారతదేశంలో నిరుద్యోగిత నిర్మాణాత్మకమైనది. అందుకే ప్రభుత్వాలు వ్యవసాయానుబంధ రంగాలపై పెట్టుబడి పెట్టాలి. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ తెలిపినట్టు హార్టికల్చర్పై పెట్టుబడి పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలలో కల్పించాలి. దీనివల్ల జనాభా బదిలీ జరగకుండా ఆర్థ్దికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది.
ఖుస్రో మాటల్లో చెప్పాలంటే అవస్థాపన సౌ కర్యాలు ఉన్నచోటికి మానవ వనరులను తరలించడం కన్నా ఎక్కువమంది నివసించే గ్రామీ ణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడం మెరుగైన పద్ధతి. అవినీతిని అరికట్టి ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు అందేవిధంగా చూడాలి. దేశంలో సమసమా జ స్థాపన జరగాలంటే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాలి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో రైతు రాజ్య స్థాపనకు ముందు కు వచ్చిన బీఆర్ఎస్కు పట్టం కడితేనే మార్పు సాధ్యం.
ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకొంటున్నదని ప్రధాని చెప్తున్నారు. కానీ ఎన్డీఏ పాలనలో దేశ వాస్తవ
జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉంటే ప్రతి ఏడాది ఉపాధి హామీ పనికి డిమాండ్ 5.4 శాతంగా ఉంటున్నదంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
(వ్యాసకర్త : బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)