Jupally Krishna Rao | ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు. ఎక్కువ డబ్బులు పంపిన చోటనేమో తక్కువ ఓట్లు, తక్కువ డబ్బులు పంపిన చోటనేమో ఎక్కువ ఓట్లు రావడం పట్ల జూపల్లికి అనుమానం వచ్చింది. దీంతో పంచాల్సిన డబ్బులు మధ్యలో నొక్కిసిన అనుచరుల బండారం బయట పడటంతో వారు మొకం చాటేస్తున్నారట. ఈ కూపీ లాగడం ఇప్పుడు అవసరమా? దీనివల్ల తనకు నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆందోళన చెందుతున్నట్టు వినికిడి.
ఆ సంగతి చూడు ముందు
కర్మ కాకపోతే..?
బొమ్మలు పెట్టుకోక తప్పలేదు
– వెల్జాల