ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది. మొత్తం 119 సీట్లకు పోటీ చేస్తామని ఆమె ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ముగ్గురే (షర్మిల, విజయమ్మ, అనిల్ కుమా ర్) అభ్యర్థులు దొరికారు. మరి మిగతా 116 మంది అభ్యర్థులు ఎక్కడున్నారు? అందుకేనేమో అభ్యర్థులను వెతుక్కోడానికి ఎన్నికల కమిషన్ ‘బైనాక్యులర్’ గుర్తు కేటాయించినట్టు ఉన్నది.
మంత్రి దొరికిందోచ్!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనంటే నేను సీఎం ను అని ఓ అరడజను మంది నాయకులు పోటీ పడు తుండగా, ఎట్టకేలకూ ఒక్క మంత్రి మాత్రం దొరి కారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో తాను మంత్రిని అవు తానని కొండా సురేఖ ప్రకటించింది. అందరూ సీఎం క్యాండేట్లమని చెప్తుండగా, మీరేంటి? మంత్రి పదవితో సరిపెట్టుకుంటున్నారనడిగితే, దానికైతే పోటీ ఉండదని నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి.
మైండ్ గేమ్
ఇంకా ఎన్నికల నోటిఫికేషనే జారీ కాలేదు. కాం గ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించలేదు. కానీ పార్టీలో అప్పుడే సీఎం అభ్యర్థుల మధ్య ముసలం పుట్టింది. ఒక వైపు సీఎం అభ్యర్థిని ఎన్నికైన సభ్యులు, అధిష్టానం నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి చెప్తూనే, మరోవైపు ఢిల్లీ వెళ్లి అక్కడ దర్గాపై చాదర్ కప్పి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక వస్తానని మొక్కి వచ్చారు. తాను సీఎం అయ్యాక ఏయే ఫైళ్ల మీద సంతకం పెట్టేది ప్రకటిస్తున్నారు. ఈ విషయం సీఎం రేసులో ఉన్న ఇతర నేతల వద్ద ప్రస్తావిస్తే, రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారంటున్నారు.
కాక రేగాలె
బీజేపీ రెండో జాబితా ప్రకటించగానే పార్టీలో లొల్లి పుట్టాలి. టికెట్లు దక్కనివారు ఆఫీసుకు వచ్చి పెద్ద ఎత్తున గొడవకు దిగాలి. అవకాశం ఉంటే నగరంలో అక్కడక్కడా మా దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి, పర్వాలేదు. ఇది బీజేపీ రాష్ట్ర ముఖ్య నేత ఒకరు తన సన్నిహితులకు ఇచ్చిన స్కెచ్గా ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇవన్నీ చేస్తే గానీ జనంలో మన పార్టీకి క్రేజీ తగ్గలేదని, జాతీయ నేతలకు కూడా మనం బాగా కష్టపడుతున్నట్టు సంకేతాలు పంపినట్టవుతుందన్నది సదరు నేత అంచనా అంట.