దేశంలోని రాజకీయాలు విధ్వంసకరంగా మారాయి. రాజ్యాంగ, లౌకికస్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయాల్లో మత విశ్వాసాలను జొప్పించడమే దీనికి ప్రధాన కారణం. అందుకే నేడు దేశం ఆర్థిక, సామాజిక, పారిశ్రామికరంగాల్లో విఫలమైంది. ఆధునిక భారత నిర్మాణం కావాలంటే అన్ని మత గ్రంథాల కు ఉన్న సార్వభౌమాధికారాన్ని తిరస్కరించాలన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. గత ప్రపంచ విప్లవాలను, అభివృద్ధి చెందిన దేశాల చరిత్రను మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్రభు త్వ పాలనాతీరుకు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. ప్రెంచి, రష్యా, అమెరికా దేశాల్లో వచ్చిన ప్రజా విప్లవాలు, తదనంతర ఫలితాలు ఆయా దేశాల్లో అభివృద్ధికి బాటలు వేశాయి. రష్యా నేలన జార్జ్ చక్రవర్తుల నిరంకుశ పాలనలో హక్కులు, సౌకర్యాలు ప్రభువు లు, భూస్వాములకే ఉన్నాయి. రైతులు, సామాన్య ప్రజలు మాత్రం పనిచేయాలి, పన్నులు కట్టాలి. రష్యా భాష తప్ప ఇతర ప్రాంతీయ భాషలు మాట్లాడొద్దు. కార్మికులు, మహిళలు, బాల కార్మికులు, తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమ చేయాలి. జార్జ్ ప్రభువులు యుద్ధాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం రష్యా యుద్ధాన్ని కూడా వ్యాపారంగా భావించారు. కాబట్టి, లక్షలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి దేశంలోని రైతులు, పేదలు, కార్మికులందరూ ఏకమై నిరంకుశ జార్జ్ ప్రభువులను కూలదోశారు.
1492లో కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వా త ప్రెంచి వలసలు, బ్రిటిష్ ఇంగ్లాండ్ ప్రభుత్వ నిరంకుశ చట్టాలు పన్నులు మార్కెంటైల్ సిద్ధాంతం, నౌకచట్టం తెచ్చిన ఎగుమతులు, దిగుమతులు వారి నౌకలలోనే చేయాలి. 1764 స్టాంప్లు క్రయా విక్రయాలకు వారివే కొనాలి. మొలాసిస్ చట్టం, అమెరికా వలస ప్రజల డిక్లరేషన్ చట్టం, అమెరికా బోస్టస్ ప్రాంతంలో కిరాయి గుండాలు సైనికులు కలిసి ప్రజలపై దాడిచేయడం, తేయాకు పెట్టెలను సముద్రంలో పారవేయడం ఇవన్నీ కూడా అమెరికా విప్లవానికి దారితీశాయి. వలస ప్రజలు ఏకమై బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాయి. 1783లో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ, లౌకికకత్వ, సౌభ్రాతృత్వంతో అమెరికా ప్రభుత్వం ఏర్పడి జార్జ్ వాషింగ్టన్ మొదటి అధ్యక్షులయ్యారు.
1789లో ప్రెంచి విప్లవం రావడానికి మూల కారణం పాలకులు. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. మతాచార్యులు, ప్రభువులు, హక్కులున్న వర్గం, సామాన్య ప్రజలు, పనులు చేయాలి, పన్నులు కట్టాలి. ప్రెంచి రాజులు లూయి నేనే రాజ్యం నా మాటే శాసనం అని అనవసర యుద్ధాలు చేసి దేశాన్ని అప్పుల పాలు చేశాడు. చివరికి ప్రజలు తిరుగుబాటుచేసి రాజును గద్దెదించారు. ప్రెంచ్ విప్లవం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తన రాజ్యాంగంలో Separation Religion an State పొందుపరిచారు. ప్రభుత్వంలో చర్చిల పెత్తనాన్ని నిషేదించారు. ప్రభుత్వం రాజ్యం మతాన్ని ఫిల్టర్గా వాడుకోవద్దని ప్రభుత్వ కట్టడాల్లో మతాచారాలు ఉండొద్దని చర్చి తప్పించి ఇతర ఆస్తులు ఉండొద్దని 1905లో ప్రెంచ్ లాను చేయడం వల్ల ఆ దేశానికి మతాచార్యుల నుంచి పెద్ద అపాయం తప్పిపోయింది. చర్చిల ఆస్తులను రాజ్యం వశం చేసుకున్నది.
బీజేపీ మతాన్ని, స్వామీజీలను దుర్వినియోగం చేస్తుంది. బీజేపీ ప్రారంభమైందే ద్వి జాతీయ సిద్ధాంతంతో ఇతర మతాల మనుషుల పట్ల ఆచార వ్యవహారాల్లో నిలువెల్లా విషమే చిమ్ముతుంది. బీజేపీ వద్ద ఈ దేశానికి, ప్రజలకు ఉపయోగపడే ఏజెండా గాని ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి ఆలోచన, నిరుద్యోగ నిర్మూలన పథకాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేనే లేవు. నిర్మించడం రాదు, తాడో పేడో కూల్చడం, కాల్చడం విధ్వంసాలే ఆ పార్టీకి ముద్దు. అదే వారికీ ఆయువు పట్టు. దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండకుండా కులం, మతం, ప్రాంతీయ, బాష ఆచారం, వ్యవహారాల్లో ఎప్పుడూ కొట్టుకొని చస్తే వారు పండగా చేసుకుంటారు.
ఇప్పుడు బీజేపీలో సరికొత్త స్కాం ప్రారంభమైంది. దానికీ ప్రత్యేకశాఖను ఏర్పాటుచేశారు. ఆ శాఖకు మంత్రి గుజరాత్ అల్లర్ల సూత్రాధారి తడిపార్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేయడం దాని ప్రత్యేకత. అందుకు పవిత్రమైన స్థానంలో పూజింపబడుతున్న ఆయా మతాల స్వామీజీలను, బాబాలను బ్రోకర్లుగా చేసుకొని వారితో బీజేపీ పబ్బం గడుపుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది. ఇదే తతంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్వామీజీలను దళారుగా నియమించుకొని పార్టీ మారే ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల బేరం పెట్టారు. ఈ విషయంలో పోరాట బిడ్డలైన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మగౌరంతో వారి పన్నాగాన్ని బయటపెట్టి, ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడారు.
ఆంధ్ర, తెలంగాణలలో రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్న పరిపూర్ణానందస్వామి బీజేపీ అనుబంధ స్వామినే. కర్ణాటక రాజకీయాల్లో 30 ఏండ్లుగా స్వాములు, మఠాదీపతులు జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్న మఠాల స్వామీజీలకు కూడా 30 శాతం లంచం బీజేపీ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని వారు ప్రధాని మోదీకి పిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. గతంలో మతం పేరుతో ఓట్లు అడిగారని సుప్రీంకోర్టులో శివసేనపై కేసు ఫైల్ అయింది. అదికూడా ప్రజలను మభ్యపెట్టడం, లంచం ఇవ్వడం లాంటిదేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్య భారత రాజకీయాల్లో రాజ్యం, మత రాజకీయాలు కలిసి నడుస్తున్నాయి. ఇలాంటివి భారతదేశ ప్రజల భవిష్యత్తుకు ఏ విధంగాను మంచివి కావు. ఇవి మున్ముందు ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తాయి. దేశ ప్రజలే ఈ అప్రజాస్వామిక, అనైతిక రాజకీయాలకు సమాధి కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
-గురుజాడ బీరయ్య యాదవ్
91777 57440