హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తనకు దక్కే కాంట్రాక్టుల కోసమా? ఈ ప్రశ్నలకు ఆయనే ప్రజలకు జవాబులు చెప్పాలి.
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అం టూ లేని పరిస్థితులున్నాయి. కేసీఆర్ సబ్బండవర్గాల కోసం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కులమత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారం లోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందుకోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పావుగా వాడుకుంటున్న ది. కోమటిరెడ్డి బ్రదర్స్ సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధులు గా ఉన్నారు. కానీ నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. తెలంగా ణ సాధన పోరాటంలో వీరి పాత్ర ఎంత? తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను ఇప్పటిదాకా నెరవేర్చని బీజే పీలో రాజగోపాల్రెడ్డి చేరారు. దీనివల్ల తెలంగాణకు ఏం మేలు జరుగుతుందో ఆయన చెప్పలేకపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు 16 నెలల సమయం మాత్రమే ఉన్నది. ఎమ్మెల్యే చనిపోతే లేదా అసాధారణ పరిస్థితుల వల్ల శాసనసభ్యత్వం కోల్పోతేనో సాధారణంగా ఉప ఎన్నికలు జరుగుతాయి. కానీ తన స్వార్థం కోసం కావాలని రాజీనామా చేసి ఉపఎన్నికను ఆహ్వానించడమేంటి? ఈ ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వానికి భారీ గా ఖర్చవుతుంది. దీనికి ఆయన ఏ విధంగా బాధ్యత వహిస్తారు? బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కంటే గొప్పగా ఏమై నా పనులు చేశాయా? బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నదా? అనే విషయాలను రాజగోపాల్రెడ్డి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ, దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నది. ఆ పార్టీ భావోద్వేగాలు, మతపరమైన సెంటిమెంట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదే తప్ప ఉత్పత్తికి సంబంధించిన పనులేం చేయడం లేదు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదు. మునుగోడులో బీజేపీకి ఉన్న బలం శూన్యం. ఒక్క అభివృద్ధి నమూనా పథకం, మ్యానిఫెస్టో లేకుండా టీఆర్ఎస్ను విమర్శిస్తే మునుగోడులో బీజేపీకి ఓట్లు పడుతాయా? కేసీఆర్ను ఓడించడానికే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మడమ తిప్పని పోరాటంతో మరణం అంచుల దాకా వెళ్లి వలస పాలకుల నుంచి తెలంగాణను విముక్తం చేసినందుకు కేసీఆర్ను ఓడించాలా? రైతుల ఆత్మహత్యలతో సతమతమవుతున్న తెలంగాణను దేశ ధాన్యాగారంగా మార్చినందుకు ఓడించాలా? మిషన్ భగీరథ అమలు చేసినందుకు ఓడించాలా? లేదా హైదరాబాద్ను ఐటీ, ఫార్మా హబ్గా తీర్చిదిద్దినందుకా?
రాష్ట్రం కోసం, దేశం కోసం ఏదైనా సాధించాలనే తప న ఏ రాజకీయ నాయకుడికైనా ఉండాలి. కానీ కేసీఆర్ను ఓడించడమే నా మ్యానిఫెస్టో అనుకుంటే అంతకంటే దిగజారుడు తనం ఉండదు. బీజేపీ, రాజగోపాల్రెడ్డి ఎంత డబ్బు ఖర్చుచేసినా, ఎన్ని సెంటిమెంట్లను రెచ్చగొట్టినా ప్రజా రంజకపాలన అందిస్తున్న కేసీఆర్ను ఓడించడం అసాధ్యం. టీఆర్ఎస్ పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి కేసీఆర్ సైన్యం మునుగోడులో గడపగడపకూ వెళ్లి వివరిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డికి ఉన్నది పోయి, అనుకున్నది జరగక చివరికి ‘గోడు’ తప్ప మరేం మిగలదు!
కాలువ మల్లయ్య, 91829 18567