ప్రకృతి పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషి అంతర్జాతీయ మన్ననలు పొందు తున్నది. పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపుదలలో చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉండటం విశేషం. ఈ విధంగా తెలంగాణ ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం కేసీఆర్దే.
ఆరోగ్యకర, ఆహ్లాద భరితమైన వాతావరణంలో జీవనం సాగాలంటే స్వచ్ఛమైన ప్రాణవాయువు, నీరు, ఆహారం అతి ముఖ్యం. నేల, పంటలు, వర్షాలు, జంతు వులు, వన్యప్రాణులు ఇవన్నీ మన జీవనానికి ఆధారం. సమస్త ప్రాణులు ప్రకృతి ఒడిలోనే జీవనం సాగిస్తాయి. ఓజోన్ పొర క్షీణత, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు, ఉష్ణోగ్రత పెరుగుదల తదితర సమస్యలకు పరిష్కారం అడవుల పెంపకమే. దీనిలో వన్యప్రాణుల సంరక్షణ కూడా అంతర్భాగం. జీవ వైవిధ్యంతోనే సకల ప్రాణుల మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యత తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరితహారం’ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా 2015 నుంచి 2022 వరకు 243 కోట్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారు. దీంతో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రకటించడం ముదావహం.
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు దల కోసం గ్రామ పంచాయతీల పరిధిలో ఏటా వేలాది మొక్కలు నాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలను సంరక్షించుకోవటాన్ని తప్పనిసరి చేస్తూ, ఆ బాధ్యత స్థానిక నేతలు, అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, కార్యాలయాల సుందరీకరణ, పాఠశాలలు-కళాశాలల్లో హరితవనాలు, పల్లె ప్రకృతి వనాలతో హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ. పచ్చదనం పెంపుదల కోసం ప్రత్యేకంగా హరితనిధిని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం కారణంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి, 9.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవుల పునరుజ్జీవనం ఉట్టిపడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీర్గా పేరుగాంచింది. కవ్వా ల్ పులుల అభయారణ్యంగా అభివృద్ధి చెందింది. చిరుత పులులు, జింకలు, దుప్పిలు, కుందేళ్ళు, పక్షులు, వన్యప్రాణుల సంరక్షణ నిలయంగా ‘జన్నారం వైల్డ్ లైఫ్ సాంక్చువరి’ అభివృద్ధి చెందింది. కుంటాల, పొచ్చెర, బోగత జలపాతాలు, ప్రాణహిత, లక్నవరం, నిజాంసాగర్, కాళేశ్వరం.. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు, నదులపై ప్రాజెక్టులు చూడచక్కని ప్రదేశాలుగా మారాయి. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని చేపట్టడం ముదావహం. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ వ్యక్తులను భాగస్వాములను చేసి ప్రకృతి పరిరక్షణను ఒక ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రధాని సైతం కొనియాడేలా చేసి, దేశంలోనే తెలంగాణ ప్రత్యేకతను చాటారు.
ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలంగాణ కీర్తిని కొనియాడుతూ దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాలని సూచిం చారు. పచ్చదనం అభివృద్ధిలో తెలంగాణ నెలకొల్పుతు న్న రికార్డులను బ్రేక్ చేయటానికి ఇతర రాష్ర్టాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా కొత్త రాష్ట్రం తెలంగాణను అన్ని రంగాలతోపాటు ప్రకృతి పరిరక్షణలోనూ దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జేజేలు.
-సయ్యద్ జబీ, 99493 03079