ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు
సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున్న కృషిఫలిస్తున్నది. తాజాగా, అమెరికా, యూకే, దావోస్ పర్యటనలతో కేటీఆర్ రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చారు. వివిధ దేశాలకు చెంది న దిగ్గజ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టడానికి, తమ కార్యకలాపాలు ప్రారంభించి, ఉత్పత్తులు చేయడానికి ముందుకురావటం గమనార్హం.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలనే ధృడ సంకల్పం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల ని సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న, అభివృద్ధి చెందుతున్న రంగాలను, భవిష్యత్లో మరింత విస్తరించేందుకు హైదరాబాద్ నగరాన్ని కేరాఫ్గా మార్చాలని భావిస్తున్నారు. పెట్టుబడులకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నారు.
ఈ పోటీ ప్రపంచంలో అన్నిదేశాలూ తమ వద్ద కే పెట్టుబడులు తీసుకుపోవాలని, పరిశ్రమలను ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తాయి. ఈ పరిస్థితు ల్లో పోటీని ఎదుర్కొని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తీసుకురావడం తేలికైన విష యం కాదు. మన ప్రభుత్వ పారదర్శక, ప్రగతిశీల విధానాలు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న రాయితీలు, అనువైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇలా అనేక సానుకూలంశాలు తెలంగాణ సొంతం. వీటన్నింటినీ వివరించి, ఒప్పించి పెట్టుబడులను రాష్ర్టానికి తీసుకురావడంలో కేటీఆర్ విజయవంతమవుతున్నారు. గత ఎనిమిదేండ్లుగా రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారుతున్నదంటే, అంతర్జాతీయ దిగ్గజ సం స్థలు వస్తున్నాయంటే అందులో కేటీఆర్ కృషి ఎంతో ఉన్నది.
అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. గూగుల్, ఫేస్బుక్, మైక్రాన్, యాపిల్, క్వాల్కమ్, ఊబెర్, సేల్స్ఫోర్స్, నోవార్టీస్ వంటి సంస్థలు హైదరాబాద్లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటుచేశాయి. కేటీఆర్ ఇటీవల చేసిన అమెరికా, యూకే, దావోస్ పర్యటనలే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ పర్యటనల్లో రాష్ర్టానికి కొత్త సంస్థలు వచ్చేందుకు ఎంవోయూలు చేసుకున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ సుమారు 35 సమావేశాల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఎడ్వెంట్ సంస్థ ఫార్మా రంగంలో రూ.1,750 కోట్లు, న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే స్లేబ్యాక్ ఫార్మా రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. అమెరికా పర్యటనలో మొత్తం రూ.7,500 కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కేటీఆర్ సఫలీకృతమయ్యారు.
అమెరికా పర్యటన అనంతరం కేటీఆర్ యూకే వెళ్లి అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. ఇంగ్లండుకు చెందిన ఫార్మా సంస్థ సన్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్.. అత్యాధునిక ఔషధ పరిశోధనా ల్యాబొరేటరీని హైదరాబాద్లో ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అమ లుచేస్తున్న పారిశ్రామిక విధానాలకు యూకేలో మంచి స్పందన వచ్చింది. టీఎస్ఐపాస్ను ఏకంగా బ్రిటన్ వాణిజ్య మంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసించారు. ఈ పర్యటనలోనే హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయనున్న ఫార్మా యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం లండన్లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజీతో ఒప్పందం కుదుర్చుకొన్నది.
ఇటీవలే దావోస్లో జరిగిన కీలకమైన ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. దావోస్కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రభుత్వ పెద్దలు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధు లు హాజరవుతారు. అక్కడ వివిధ సంస్థలతో మాట్లాడి కేవలం నాలుగు రోజుల్లో రూ.4,200 కోట్ల పెట్టుబడులను పెట్టేలా ఒప్పించారు. దావోస్ పర్యటనలోనే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు లూలు గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీ హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచే విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు యూని ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేటీఆర్తో చర్చల తర్వాత స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగ సంస్థ స్విస్రీ హైదరాబాద్లో తన కార్యాలయాలన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే హైదరాబాద్లో ఒక యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్కు చెందిన కీమో ఫార్మా మరో రూ.100 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఆశీర్వాద్ పైప్స్ కంపెనీ తెలంగాణలో రూ.500 కోట్లతో తయారీ కేంద్రా న్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో రైల్కోచ్ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు స్వీట్జర్లాండ్ సంస్థ స్టాడ్లర్ ప్రకటించింది. ఇందుకుగానూ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. ఇటీవలే హైదరాబాద్లో తొలి యూనిట్ ప్రారంభించిన స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా మరింత విస్తరిస్తూ, హైదరాబాద్లో రూ.500 కోట్లతో రెండో యూనిట్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ స్పైడర్ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో కొత్త యూనిట్ ప్రారంభించబోతున్నది. దక్షిణకొరియా కు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్వీడన్కు చెందిన ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ సంస్థ రూ.207 కోట్ల పెట్టుబడిని హైదరాబాద్లో పెట్టనున్నది. ఇక్కడినుంచి టీబీ టెస్ట్ కిట్లను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నది. జర్మనీకి చెందిన ఆటోమోటివ్ దిగ్గజం జెడ్ఎఫ్ హైదరాబాద్లో తన అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నది.
తెలంగాణను టెక్నాలజీ పవర్ హౌజ్గా మార్చడానికి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వర ల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్బ్రెండే ప్రశంసించటం ముదావహం. సమర్థుడికి సరైన బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కేటీఆర్ రుజువు చేస్తున్నారు.
(వ్యాసకర్త: డాక్టర్ ఎన్.యాదగిరిరావు, అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)