‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్ వచ్చినా, తమిళనాడు వెళ్లినా సీఎంలు స్వాగతం పలికేందుకు రారు. అందుకే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఎలాగూ రాదని నేనే ఆమె ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత ఆమె పోయారు అది వేరే విషయం. అంతకుముందు పంజాబ్ వెళ్తే స్వాగతం పలికే మాట దేవుడెరుగు. దారిలోనే రైతులు వెంటపడి వెనక్కి పంపించారు. ఎందుకో తెలుసా? మూఢనమ్మకం. నా ముఖం చూస్తే శని చుట్టుకుంటుందనే మూఢ నమ్మకం.
-కొర్రాయి
ప్రధాని చెవిలో లవంగం ఏదో చెప్పాడు. ప్రధాని లవంగంను కోపంగా చూస్తూ టేలంగణ కాదా? నేను ప్రధానిని, నువ్వు ఆఫ్ట్రాల్ లవంగానివి. హిందీలో మీ రాష్ట్రం పేరు ఇలానే పిలుస్తామని గద్దించాడు.
మెరికా వెళ్లి ‘అబ్ కీ బార్ ట్రంప్ కీ సర్కార్’ అని గట్టిగా ప్రచారం చేశా. నా చెలిమి వల్లే ట్రంప్కి శని పట్టుకుందని అమెరికాలో ప్రచారం. అమెరికాలో కూడా మూఢనమ్మకం చాలా బలంగా ఉన్నది. అంతెందుకు చైనా అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదిగింది కదా? ఆ మధ్య చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మన దేశం వచ్చినప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగాం కదా! అంతే! కరోనా తర్వాత ప్రపంచం చైనాను ఏకాకిని చేసింది. అమెరికానే మించి పోతుందనుకున్న చైనా ఈ రోజు సమస్యలతో సతమతమవుతున్నది. అంతేకాదు జిన్పింగ్కు వ్యతిరేకంగా చైనాలో బలమైన వ్యతిరేకత పెరుగుతున్నదని, ఆయన ఒంటరి వాడవుతున్నాడని తెలుస్తున్నది కూడా. నన్ను కలిశాకే చైనాకు, జిన్పింగ్కు ఇలా అయిందని అక్కడ మూఢ నమ్మకం. ఓసారి పిలవకపోయినా పాకిస్థాన్ వెళ్లి ఆ దేశాధ్యక్షుడిని కలిశాను. తర్వాత ఎన్నికల్లో ఓడి పోయాడు. నా ముఖం చూస్తే అంతే సంగతులనేది మూఢ నమ్మకమే కానీ నిజం కాదు.
నా ముఖం చూసి ఎంతో పైకివచ్చిన వాళ్ళున్నారు. అమిత్ షా గుజరాత్లో అల్లర్లకు కారణమని లోపలేశారు, రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు. అలాంటి షా ఈరోజు దేశానికే హోంమంత్రి అయ్యాడంటే దానికి కారణం షా రోజూ నా ముఖం చూడటమే. నేను ప్రధాని కాకముందు అదానీ పేరు ఎప్పుడైనా విన్నారా? మొన్నమొన్నటి వరకు అదానీ అంటే అద్వానీ అనుకునేవారు. నేను రాగానే అద్వానీని ఇంటిదారి పట్టించాను. ఆయన సంగతి ఒడిసిన ముచ్చట కానీ.. అదానీ పేరు దేశంలోనేకాదు, ప్రపంచంలో మార్మోగిపోతోంది. 50 వేల కోట్ల అప్పు బ్యాంకులకు కట్టలేక చేతులెత్తేసిన వ్యక్తి ఈ రోజు ఆసియాలోనే 5వ సంపన్నుడయ్యాడంటే కారణం మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకోవడమే. శతాబ్దాల నుంచి వ్యాపారాలు చేస్తున్న టాటాలు, బిర్లాలను వెనక్కి నెట్టి అదానీ ముందుకువచ్చారంటే ఎవరు కారణం నేను కాదా? విమానాశ్రయాలు, పోర్ట్లు, విద్యుత్, ఆయిల్, సిమెంట్ అదీ ఇదీ అని కాదు, అన్నీ అదానీ మయమయ్యాయి అంటే కారణం నేనే కదా! నా ముఖం చూశాకే కదా అదానీకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది.
ఈ వేదిక మీదే మీకో ముఖ్య విషయం చెప్తున్నాను. ఆక్సిజన్ కూడా అదానీ మయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు కావలసినంత స్వచ్ఛమైన గాలి అదానీ కం పెనీ నుంచి పొందవచ్చు. నేను ఇక్కడికి వస్తుంటే సీఎం స్వాగతం పలకలేదు. ఇంకా నయం కొన్ని రాష్ర్టాల్లో నేను వెళ్లేదారిలో ప్రభుత్వ కంపెనీలు కనిపించకుండా తెరలు కడుతున్నారు. వారి పిచ్చి కానీ తెరలు కడితే కనిపించదా? మా వద్ద అన్ని కంపెనీల జాబి తా ఉన్నది. వేటినీ వదలం అన్నీ అమ్మేస్తాం.
అసలు విషయానికి వస్తే ఐఎస్బీ 20వ వార్షికోత్సవానికి నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడు నవ్వుకున్నాను. ఒక్క బిజినెస్ స్కూల్కే ఇంత గొప్పగా చెప్పుకొంటున్నారు. దీనికోసం కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతా చేస్తే విద్యార్థులు వందల్లోనే ఉంటారు. మరి మేం అధికారంలోకి వచ్చాక విప్లవం సృష్టించాం. ఎలాంటి ఖర్చులేకుండా వందల యూనివర్సిటీలు ఏర్పాటుచేశాం. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులను చేర్చుకున్నాం. టెన్త్ ఫెయిలైనవారికి కూడా యూనివర్సిటీ బాధ్యతలప్పగించాం. అదే వాట్సప్ యూనివర్సిటీ. మేం తయారు చేయించే పాఠాలు క్షణాల్లో దేశమంతా పాకిపోతాయి. అజ్ఞానం అందరికీ పంచాలనేదే వాట్సప్ యూనివర్సిటీల లక్ష్యం. టే లంగ ణ కూడా… ఒక్క నిమిషం ఉండండి మా లవంగం ఏదో చెబుతున్నాడు.
ప్రధాని చెవిలో లవంగం ఏదో చెప్పాడు. ప్రధాని లవంగంను కోపంగా చూస్తూ టేలంగణ కాదా? నేను ప్రధానిని, నువ్వు ఆఫ్ట్రాల్ లవంగానివి. హిందీలో మీ రాష్ట్రం పేరు ఇలానే పిలుస్తామని గద్దించాడు. పేరును ఏ భాషలోనైనా ఒకేలా పిలవాలని కిషన్రెడ్డి ఎవరికీ వినబడకుండా తనలో తానే గొణుక్కున్నాడు.
వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగానే జనంలోంచి కొందరు మా రాష్ర్టానికి గతంలో కేంద్రం మంజూరు చేసిన ఐటీఐఆర్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ అంటూ జాబితా చదివి మాకెందుకివ్వరు.. అన్నీ గుజరాత్కేనా? అంటూ నినాదాలు చేశారు. ‘వాళ్లు మనవాళ్లు కాదు.. పాకిస్థాన్, హిందూ, ముస్లిం తప్ప మనవాళ్లు మరో నినాదం చేయరు. వాళ్లెవరో తెలంగాణవాదులు అయి ఉంటారు. వారి డిమాండ్లు పట్టించుకోకండ’ని పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నవ్వి నిజానికి నాకు ఇతర రాష్ర్టాల వారి డిమాండ్లు చెవికి వినిపించవు. వినిపించినా ఆంధ్రకు ఇచ్చినట్టు తట్టెడు మట్టి చెంబెడు నీళ్లు తప్ప మరోటి ఇచ్చేది లేదని చెప్పి మైకు ముందుకువచ్చి ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ కాదు మీకు అంత కన్నా అద్భుతమైన కానుక ఇవ్వబోతున్నాను. అనగానే అంతా ఆసక్తిగా చూశారు.
ప్రధాని నాటకీయంగా కొంచం సేపు అన్నివైపులా చూసి ఈ సారి టేలంగణలో మా పార్టీని గెలిపిస్తే ప్రతి మనిషికి ఓ గడ్డపార ఇస్తాము. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత అని ముగించారు.
-కౌటిల్య