భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించడానికి కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈడీ కేసుల పేరుతో విచారణకు పిలవడం. 2008లో తెలంగాణ (భారత జాగృతి) జాగృతిని ఏర్పాటుచేసిన సందర్భంలో కవితను తెలంగాణ ఉద్యమంలో దగ్గరినుంచి చూశాను. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను జాగృతి వేదిక ద్వారా విశ్వవ్యాప్తం చేయడంలో కవితది గొప్ప చరిత్ర. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళలను, కళాకారులను కదిలించి ఉద్యమంలో ముందు వరుసలో నిలిపిన వ్యక్తి కవిత.
రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించారామె. మనమంతా మరిచిపోయిన పూర్వీకుల బతుకమ్మ గీతాల ను సేకరించి వాటిని పుస్తకాలు, క్యాసెట్లు, సీడీల రూపంలో తిరిగి మనకందించి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘన చరిత కవితది.
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని పలకరిస్తూ అన్నివర్గాల కన్నా వికలాంగులు వెనుకబడి పోయారని గుర్తించి వారికి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు కవిత. అవసరమైన వారికి పింఛన్లు ఇప్పించి వికలాంగుల ఆత్మబంధువుగా నిలిచిపోయారు. అలాగే ప్రతి వికలాంగుడి ముఖంలో ఆనందం చూడాలన్న లక్ష్యంతో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా కవిత వారికి మోటా ర్ వెహికల్స్ను ఉచితంగా ఇచ్చారు. భారతదేశంలోని అన్ని రాష్ర్టాల కంటే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలవుతున్నదంటే అందులో కవిత చొరవ చూపడం ద్వారానే సాధ్యమైంది.
కల్వకుంట్ల కవిత మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో ఐదు శాతం రిజర్వేషన్ జీఓ అమలవుతున్నది. వికలాంగుల సంక్షేమ పథకాలను గ్రామ స్థాయి వరకు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి వికలాంగులకు ప్రత్యేక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన గొప్ప మానవతావాది కవిత. తద్వారా వారికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసేలా కృషిచేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్య, డైరెక్టర్ శైలజలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వికలాంగుల ప్రత్యేక శాఖను ఏర్పాటుచేయడంలో కవిత ప్రత్యేక కృషి చేశారు. అలాగే ప్రతి ఒక్క వికలాంగుడికి ప్రతీ సంక్షేమ పథకం అందేవిధంగా చూడాలని అధికారులకు సూచించిన గొప్ప మనసు కవితది. అదే విధంగా వికలాంగులకు లోన్లు, మోటార్ వెహికల్స్, ఇతర పరికరాలు ఇప్పించడంలో కవిత చూపించిన చొరవ మరవలేనిది. ఎంతోమంది పేదలు, వికలాంగులకు ఆకలి తీరుస్తూ దేశంలోని మహిళలందరికీ అదర్శంగా నిలుస్తున్న కవిత రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక లిక్కర్ స్కామ్లో ఇరికించాలని చూడటం సరికాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ మిగిలిన రాష్ర్టాలన్నింటికంటే ముందున్నది. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ఎదుగుదలను, ఆయన పారదర్శకత ను ఎదుర్కోలేక కవితను మద్యం కేసులో ఇరికించాలని కేంద్రం కుట్రపన్నుతున్నది. తెలంగాణ అభివృద్ధిని దేశమంతా విస్తారించాలన్న దృఢ సంకల్పంతో బయల్దేరిన కేసీఆర్ను ఏమీ చేయలేక వారి కుటుంబ సభ్యులను వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నది కేంద్రం. తద్వారా వారిని భయపెట్టి తెలంగాణకే పరిమితం చేయాలని చూడటం దుర్మార్గం. నిజానికి తెలంగాణ రాకముందే కవిత జాగృతి ద్వారా దేశదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటిది ఆమె ఎదుగుదలను అడ్డుకోవాలని చూడటం వారి తరం కాదు. కవిత మీద ఈడీ కేసులు, సీబీఐ కేసులు వేసి కేసీఆర్ ఆత్మస్థయి ర్యా న్ని దెబ్బతీయాలనే బీజేపీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారనే వాస్తవాన్ని వారు గుర్తించాలి.
గత 8 నెలలుగా కవితను రాజకీయంగా అణగదొక్కడం కోసం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఒక మహిళ అని చూడకుండా అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నది. దేశంలో ఎంతోమంది ఎన్నో అక్రమాలకు పాల్పడటం, బ్యాంకులను మోసం చేయడం, ప్రజల సొమ్ముతో దేశం వదిలి పారిపోయిన అక్రమార్కులను దేశంలోకి తీసుకురావడం కేంద్రానికి చేతకావడం లేదు. తెలంగాణ బిడ్డలు కేంద్రం విసిరే బిస్కెట్లకు లొంగిపోరనే విషయాన్ని కేంద్రం గుర్తిస్తే మంచిది.
(వ్యాసకర్త : భారత జాగృతి వికలాంగుల విభాగం, జిల్లా అధ్యక్షులు)
-డాక్టర్ లింగుదారి రాజేశ్వర్ రావు
99598 77130