కొంతమంది మిత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ను గమ్మత్తుగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ఎవ్వరికీ అందుబాటులో ఉండరు అని, అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేవారని.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజల సమస్యలు వినరు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు అందుబాటులో ఉండేవారు.. ఇవ్వన్నీ నిజమే కావచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలు నేరుగా సీఎంను కలిసే అవకాశం ఉండేది నిజమే. కానీ, నాకు బాగా గుర్తు, మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదో నాకు తెల్వదు. ఆ సమయంలో సీఎంను కలిసిన సామాన్యులు ఆయనకు చెప్పిన సమస్యలేంటో మీకు తెలుసా? ఆ రోజుల్లో 200, 250 రూపాయల పింఛన్ ఇస్తే, ఆ డబ్బులు కూడా రాకపోయేవి. పింఛన్ కోసం ఐప్లె చేసుకుంటే ఐప్లె కూడా కాక పోయేది. వాటికి కూడా లంచాలు అడిగే వారు. ఆ విషయాలపై వినతిపత్రాలు ఇచ్చి, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేయటం కోసం ప్రజలు సీఎం ను కలిసేవారు.
రెండోది ఆ కాలంలో రైతులకు విపరీతమైన కరెంటు సమస్య ఉండేది. కరెంటు వస్తే కరెంటు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కొత్త వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఇంజినీర్లకు లంచాలు ఇచ్చేంతవరకు వచ్చేవి కావు, వాటి కోసం రైతులు తలా ఇన్ని పైసలు వేసుకుని వారికి ఇచ్చేవారు. అలాంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయటం కోసం రైతులు వెళ్లేవారు.
ఇక మంచినీళ్ల సమస్యలు, నీళ్ల కోసం ఆడవాళ్లు బిందెలు పట్టుకొని బాయిల దగ్గరికి కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు తెచ్చుకునేవారు. అలాగే ఒకవేళ అందుబాటులో కొళాయిలు ఉంటే వాటి ముందు వందల కొద్ది మహిళలు బిందెలు పట్టుకొని ఉండేవారు. ఆ కుళాయిల నుంచి మంచినీళ్లు వచ్చేవి కాదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసేవారు. ఇలాంటివే చాలా ఉండేవి. అయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నాయి చెప్పండి?
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తున్నది. సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. వారిని వ్యక్తిగతంగా కలవకపోయినా అధికారులతోటి ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ల ద్వారా ప్రజలకు దగ్గర అవుతూనే ఉన్నారు. ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ గమనించకుండా విష ప్రచారం చేయడం సరైంది కాదు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కమీషన్ల పార్టీ. ఇది అందరికీ తెలిసిందే. 60 ఏండ్ల పాలనలో ఏం చేసిందో అందరికీ తెలుసు. చాలామంది 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనను 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చటం సరికాదు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో జరిగింది. ఆ లెక్కలు ఒకసారి చూడండి.ఆలోచించి ఓటు వేయండి, ఆవేశంతో కాదు.
-సురేందర్ తాళ్ళపల్లి
9849799893