ఇంక దాచేదేముంది? రైతుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో, చిత్తశుద్ధి ఏమిటో, వారి అవగాహన ఏమిటో రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు, ఈ పథకం మీద ఆపార్టీ నాయకులు కూసిన కూతలతో తేలిపోయింది. రైతుల పట్ల వారి ప్రేమ ఏమిటో బట్టబయలైంది. ఆ మాటకొస్తే ఇదొక్కటే కాదు, రైతులకోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటి మీద ఆ పార్టీ జరుపుతున్న దాడి దాని రైతు వ్యతిరేక నైజాన్ని తేలతెల్లం చేస్తూనే ఉన్నాయి.
Rythu Bandhu | మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు. ప్రాజెక్టులు కడితే కేసులువేసి అడ్డం పడ్డారు. 24 గంటల కరెంటు అవసరమే లేదు.. మూడు గంటలు చాలన్నారు. ధరణిని ఎత్తేస్తామన్నారు. ఆఖరుకు తెలంగాణ రైతుకు జీవగంజి పోసిన రైతుబంధు పంపిణీని ఈసీకి ఫిర్యాదు చేసి ఆపాలని చూశారు. ఈ పథకం దండుగ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు అంటున్నాడు. ప్రభుత్వానిది దుబారా అంటున్నాడు. ప్రజలు పన్నులరూపంలోచెల్లించే విలువైన ప్రజాధనాన్ని పంచిపెట్టి వృధా చేస్తున్నా
రని రంకెలు వేస్తున్నాడు. ఇక పీసీసీ అధ్యక్షుడైతే ఏకంగా ఈ డబ్బుతో రైతులు తాగితందనాలాడుతున్నారని విషం చిమ్ముతున్నాడు. కానీ ఈ నాయకులకు తెలియాల్సింది ఏమంటే రైతుబంధు దండుగ కాదు..దుబారా అంతకన్నా కాదు. కాంగ్రెస్ నాయకులు అన్నట్టు ఈ పథకం వృథా కాలేదు. ఇది రైతును నిలబెట్టింది. తెలంగాణ వ్యవసాయరంగాన్ని స్థిరీకరించింది. 2018లో ప్రవేశపెట్టిన నాటినుంచి ఇప్పటిదాక.. ఐదేండ్లలో 25 లక్షల ఎకరాలకు పైగా పడావు భూములను సాగులోకి తెచ్చింది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు కలుపుకుంటే 44లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చింది.
అందుకే ఇవాళ గ్రామాల్లో ఎక్కడా అంగుళం భూమి ఖాళీగా కనిపించడం లేదు. ఇది రైతుబంధు తెచ్చిన మార్పు!
రాష్ట్రంలో వ్యవసాయరంగ ముఖచిత్రాన్నే మార్చేసిన పథకం రైతుబంధు. అప్పు చేస్తే తప్ప సాగు ప్రారంభించలేని తెలంగాణ సాగుబడి చరిత్రను ఇది తిరగరాసింది. సీజన్కు ముందే బ్యాంకులో జమ అయ్యే రైతుబంధు డబ్బు, సాగుకు ఒక శుభ ప్రారంభాన్ని ఇచ్చింది. చినుకు పడగానే భూమి దున్నే రైతుకు ప్రారంభ విఘ్నం లేకుండా చేసింది. పెట్టే పెట్టుబడికి వచ్చే రాబడికీ పొంతన లేక అల్లాడిపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. ఒక ఉద్యోగికి నెల తిరిగేసరికి జీతం వచ్చినట్టు.. వ్యవసాయదారు అనే ఉద్యోగానికి సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం అందించే అడ్వా న్స్ జీతమే ఈ రైతుబంధు. అప్పుతో ప్రారంభమై అప్పులతో ముగిసే తెలంగాణ వ్యవసాయానికి రైతుబంధు ఒక కొత్త దిశను చూపించింది. తెలంగాణ రైతుల్లో ఒక ఫీల్గుడ్ వాతావరణాన్ని కల్పించి వ్యవసాయ స్థిరీకరణకు బాటలు వేసింది.
వినూత్న ఆలోచన
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు వ్యవసాయాభివృద్ధికి ఎన్నో సూచనలు చేసి ఉండవచ్చు. రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, గిట్టుబాటు ధరలు, మేలైన వంగడాలు, మెరుగైన మార్కెటింగ్, ఎరువుల సబ్సిడీలు వగైరా..ఆలోచనలు చెప్పి ఉండవచ్చు. కానీ ఇవేవీ రైతులకు పూర్తిగా ఉపశమనం కల్పించలేదు. రుణమాఫీ వంటి పథకాలు వచ్చినా రైతు దశ మారలేదు. ఎందుకంటే రైతు అసలు సమ స్య రుణభారం. మన దేశంలో వ్యవసాయ ప్రక్రియ ప్రారంభమే అప్పులతో మొదలవుతున్నది. సాగు ప్రక్రి య అంతా అప్పులమయమే. పంట అమ్మేనాటికి ఈ అప్పులు కుప్పలై, వాటి మీద వడ్డీలు, పాత బాకీలు అన్నీ కలగలిసి దిగుబడి-రాబడి మధ్య సమతూకం తప్పుతున్నది.
ఈ కారణంగానే ఎన్నిసార్లు రుణమాఫీ చేసినా రైతు పరిస్థితి మెరుగు పడలేదు. అందుకే కేసీఆర్ సమస్య మూలాల్లోకి వెళ్లారు. రైతులపై రుణభారం సాగు ప్రారంభదశలో పడుతుంటే, రుణమాఫీ సాగు పూర్తయ్యాక వస్తున్నది. అంటే సమస్య ప్రారంభంలోనే ఉంది. పరిష్కారం చివర్లో జరుగుతున్నది. అందుకే కేసీఆర్ ప్రారంభదశలోనే పంట పెట్టుబడి ఇచ్చి రైతులు రుణాలకోసం వెళ్లే అవసరం లేకుండా చేశారు. ఇది రైతుల్లో ఆర్థిక ధీమాను పెంచింది. దాని ప్రభావం ఇవాళ రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తిలో కనబడుతున్నది.
అనేక ప్రశంసలు
ఎవరూ ఆలోచించని రీతిలో సమస్య మూలాల్లోకి కేసీఆర్ వెళ్లారు కాబట్టే రైతుబంధుకు విశేష ప్రశంసలు వచ్చాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర దీన్ని ఫాలో అయ్యాయి. కేంద్రం కూడా ప్రధానమం త్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఇదే పథకాన్ని ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు భారీగా ప్రయోజనం కలిగించే 20 వినూత్న పథకాల్లో ఒకటిగా రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ గుర్తించింది. రోమ్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో రైతుబంధు గురించి వివరిస్తూ ప్రత్యేక డాష్బోర్డు ఏర్పాటు చేసింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇలాంటి పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు.
గాంధేయవాది, పద్మభూషన్ అవార్డు గ్రహీత అన్నా హజారే నిస్పృహలో కూరుకుపోయిన రైతాంగాన్ని కేసీఆర్ రైతుబంధుతో ఉద్ధరించి అన్ని రాష్ర్టాలకు మార్గదర్శకుడయ్యాడని మెచ్చుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిపిన వీడియోకాన్షరెన్స్లో రైతుబంధు పథకాన్ని ప్రస్తావించి దీనివల్ల రైతులకు బాగా ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా లోక్సభలో అన్నారు. రైతునాయకుడు, పంజాబ్ స్పీకర్ కుల్తార్సింగ్ సాంధ్వాన్ రైతుబంధును ప్రస్తావిస్తూ రైతులకోసం ఇలా పనిచేసే ప్రభుత్వాలు ఉంటే భారత్ విశ్వగురువు అవుతుందన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యాసం రాస్తూ రైతుబంధు వంటి పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నీలాపనిందలు
ఇన్ని ప్రశంసలు ఇంత మంచి కళ్లెదురుగా కనిపిస్తు న్నా విపక్షాలకు అది కనిపించడం లేదు. దేశంలో ఎక్క డా లేని పథకాన్ని కేసీఆర్ తీసుకురావడంతో మైండ్ బ్లాకైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ పథకానికి వక్రభాష్యాలు పలికారు. పథకం ప్రధాన లక్ష్యమైన వ్యవసా య స్థిరీకరణ అంశాన్ని పక్కనబెట్టి చిన్న రైతులు, పెద్ద రైతులు అంటూ విభేదాలు రెచ్చగొట్టారు. దీనిపై నీలాపనిందలు వేశారు. సోషల్ మీడియా గ్యాంగులు దీన్ని భూస్వాముల పథకమన్నాయి. లిమిటేషన్ పెట్టాలన్నా యి. సాగుచేయని భూమికి డబ్బులిస్తున్నారన్నాయి.
ఒక్క ఎకరం కూడా సాగు కాలేదని, పట్టణాల్లో ఉన్నవాళ్లు భూమిసాగు చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారన్నారు. ఈ వాదనలు చేసేవారెవరూ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసిన వారు కాదు. పట్టణాల్లో కూర్చొని ఇలా ఉంటుంది అని ఊహించి వాదించేవారే అధికం. కానీ వాస్తవమేమంటే.. రైతుబంధు వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఊహించనంతగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారమే రైతుబంధు వల్ల దాదాపు 25 లక్షల ఎకరాల్లో అదనపు సేద్యం అవుతున్నది. పడావు భూములకు డబ్బులు తీసుకోవడమే నిజమే అయితే ఈ అదనపు సాగు ఎలా సాధ్యమైనట్టు? ఒక్కసారి గ్రామాలకు వెళ్లి చూడండి. ఎక్కడన్నా ఓ ఐదెకరాలు, పదెకరాల భూమి సాగులేకుండా పడావుగా పడి ఉన్నదా లేక సేద్యం జరుగుతున్నదా తెలుస్తుంది.
రైతులను అవమానించడమే..!
పీసీసీ అధ్యక్షుడు నోరు పారేసుకున్నట్టు రైతులు తాగి తందనాలాడడం లేదు. సోషల్ మీడియాలో కుళ్లుబోతులు ప్రచారం చేస్తున్నట్టు రైతుబంధును వృథా చేయడం లేదు. ఆ డబ్బుతో పడావు భూమిని సాగులోకి తెస్తున్నారు. బోర్లు వేయిస్తున్నారు. మోటర్లు పెడుతున్నారు. వ్యవసాయ యంత్రాలు కొంటున్నారు. ఎద్దుకు ముఖమెక్కడో ముడ్డి ఎక్కడో తెలియనోల్లు పట్టణాల్లో కూచొని కథలల్లుతూ పథకం మీద విషం చిమ్ముతున్నారు. తెలంగాణలో రైతు నిరాడంబరుడు. లక్షల పంట పండినా కష్టాన్నే నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు మారడు.
తెలంగాణ రైతు స్వభావరీత్యా నేలమీద పడ్డ నాలుగు గింజలను కూడా ఏరి సంచుల్లో వేస్తాడు. ఎవుసం కోసం వచ్చే డబ్బును తాగుడుకు తందనాలకు ఖర్చు చేసేంత మూర్ఖుడు, సోకులకు తగలేసేంత వ్యసనపరుడు కాదు. నాలుగు ముక్కలు చదివి తమకు తామే తోపులుగా భావించే వాళ్లు.. సాయంత్రం ఆరుదాటితే బార్లు, బీర్లు అంటూ ఆవురావురుమంటూ వెళ్లి అర్దరాత్రి దాటాక ఒంటిమీద బట్టలున్నాయో లేదో కూడా తెలియని స్థితిలో పడుతూ లేస్తూ కొంపకు చేరే సూడో మేధోమూకకు ఈ విషయం అర్థం కాదు.
ఎన్నో విజయగాథలు
రైతుబంధు విజయగాథలు ఇపుడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. అందులో నాగర్కర్నూలుకు చెందిన యువకుడొకరు రైతుబంధు వచ్చాక హైదరాబాద్లో చిన్నా చితకా ఉద్యోగాలు మానేసి వచ్చి వ్యవసాయం చేస్తున్నానని చెప్తున్న వీడియో పలువురిని ఆకర్షిస్తున్నది. ఈ యువకుడు ‘రైతుబంధు డబ్బులతో భూమిలో గుంటుకలు కొట్టిచ్చుకున్నం. మందులు కూడ తెప్పిచ్చుకున్నం. పెట్టుబడికి అవే సరిపోతున్నయి. దీంట్ల రెండెకరాలకు నేను 40వేలు పెట్టిన. అవి నాకు ఇపుడు ఏడు ఎకరాలకు సరిపోను రైతుబంధు డబ్బులు పడ్డయి. ఇండ్ల ఇగ పండిన పంట ఇగ నాదే. ఖర్చు పెట్టిన పైసల్ కేసీఆర్వి. ఇగ వచ్చేదంతా నా ఫ్రాఫిటే అని చెప్తుంటే రాష్ట్రంలోని రైతుల్లో వచ్చిన ఆత్మవిశ్వాసంతో కూడిన ధీమా కనిపిస్తున్నది. మార్పు కనిపిస్తున్నది.
ఇదే కాదు.. రాష్ట్రంలో రైతుబంధు డబ్బులు అనేక బీడు భూములను సాగులోకి తెస్తున్నాయి. వాస్తవానికి కరెంటు నీళ్లు పుష్కలంగా దొరికిన నాటినుంచే గ్రామాలకు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. దండుగ అని వదిలి పెట్టిపోయిన వాళ్లు తిరిగి వచ్చి ఎవుసం చేయ డం ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగాలు చేసేవారూ గ్రామాలకు వచ్చేసి వ్యవసాయంలో దిగిన కథలెన్నో పత్రికల్లో చూశాం. ఆ పరిణామాన్ని రైతుబంధు మరిం త వేగంగా ముందుకు తీసుకుపోయింది. పెద్దపెద్ద కమతాలున్న వారు కూడా పడావు భూములు చదును చేసి నేరుగా వ్యవసాయం చేయడమో కౌలుకు ఇవ్వడమో చేస్తున్నారు తప్ప ఖాళీగా వదలివేయడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతుబంధును రైతు తీసుకుంటున్నాడా? కౌలుదారుకు ఇస్తున్నాడా అనేది వదిలేస్తే భూములను మాత్రం సేద్యంలోకి తెస్తున్నాడు. వ్యవసాయ స్థిరీకరణ అంటే ఇదే. రైతుబంధు తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. అందుకే రాష్ట్రం లో ఇపుడు 3 కోట్ల టన్నుల ధాన్యం చేతికి వచ్చింది.
ఇదే విషయాన్ని అధికారిక లెక్కలు
ధృవీకరిస్తున్నాయి. ఈ పథకం 2018 మే 10న ప్రారంభమైంది. ఆనాడు రాష్ట్రంలో ఖరీఫ్ రబీ కలిపి సాగు విస్తీర్ణం 1,18,09,085 ఎకరాలు. 2022-23 లో ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1,62,70,689 ఎకరాలకు పెరిగింది. అంటే 44,61,604 ఎకరాల అదనపు విస్తీర్ణానికి సాగు పెరిగిందన్నమాట. అంటే రాష్ట్రంలో రైతుబంధువల్ల ఉజ్జాయింపుగా 25లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చిందని అర్థమవుతున్నది. మరి సాగు చేయని భూమికి డబ్బులు, పడావు భూములకు డబ్బులు అనే సోదిలో నిజమెంతో బయటపడినట్టే కదా?
ఇదీ కాంగ్రెస్ రైతు ప్రేమ
అసలు కాంగ్రెస్ రైతులకు ఒరగబెట్టింది ఏమిటి? తెలంగాణలోని సముద్రాల్లాంటి చెరువులు ధ్వంసమైంది కాంగ్రెస్ పాలనలోనే. జలవనరుల కబ్జాలు చేసింది కాంగ్రెస్ పాలనలోనే..కరువులు, వరదలతో ఉపాధి లేక ప్రజలు ముంబై దుబాయ్ల బస్సులెక్కిందీ కాంగ్రెస్ పాలనలోనే.. అప్పులు కట్టని రైతుల ఇండ్ల దర్వాజలు పీక్కుపోయింది, కరెంటు బిల్లుల కోసం మోటార్ల ఫీజులు పీక్కుపోయింది కాంగ్రెస్ పాలనలోనే..విత్తనాలు, ఎరువుల కోసం కిలోమీటర్లకొద్దీ క్యూలైన్లు కట్టిందీ, ధాన్యం గిట్టుబాటు ధరరాక మార్కె ట్ యార్డులు యుద్ధభూములైంది ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలోనే.
ఏటా ఎండిన వరికంకులను అసెంబ్లీలో ప్రదర్శించిన స్వర్ణయుగం కాంగ్రెస్దే.. కరెంటు లేక పచ్చని పంటలు కండ్లముందరే మలమల మాడిపోతుంటే గుండె చెదిరిన రైతులు ఆత్మహత్యల పాలైందీ కాంగ్రెస్ పాలనలోనే..నకిలీ విత్తనాలు, కరెంటు కోతలు, వడ్డీవ్యాపారుల ఘాతుకాలు, ధాన్యం కొనుగోళ్ల గోల్మాల్, అధికారుల మామూళ్ల దందాలు.. అన్ని విధాలుగా రైతును గద్దల్లా పొడుచుకుతిన్నది కాంగ్రెస్ పాలనలోనే. ఇవాళ కాంగ్రెస్ సుద్దపూస మాటలు చెప్తున్నది. పీసీసీ అధ్యక్షుడు ఇవాళ ఈ ప్రాజెక్టు కట్టాం.. ఆ ప్రాజెక్టు కట్టాం అంటూ తాతలనాటి సంపెంగనూనె కథలు చెప్తున్నాడు. కానీ ఆయనకు తెలియనిది ఏమిటంటే అవేవీ కాంగ్రెస్ కొత్తగా పుట్టించి చేపట్టినవి కావు. స్వాతంత్య్రం రాకముందే బ్రిటిష్, నిజాం హయాంలోనే ప్రతిపాదనలు చేసినవి.
డీపీఆర్లు సిద్ధం చేసినవి. ఈనాటి నాగార్జునసాగర్ ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్టు పేరిట కోస్తానుంచి మద్రాసు దాక నీరందించే ప్రతిపాదన ఉండేది. రాయలసీమ వారు ఇవాల్టి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా ఎగువన సిద్దేశ్వరం పేరిట సీమ, తమిళనాడుకు నీరందించే ప్రాజెక్టుకు డీపీఆర్లు కూడా రూపొందించారు. ఇవాల్టి పోలవరం స్థానంలో శ్రీరామపాదసాగర్ పేరిట భద్రచలానికి దిగువన ప్రాజెక్టు ప్రతిపాదన 1870లోనే చేశారు. మద్రాసు రాష్ట్రం కేంద్రం నుంచి అనుమతులు కూడా తెచ్చుకుంది. నిజాం, మద్రాస్ రాష్ట్రంతో కలిసి తుంగభద్ర ప్రాజెక్టును స్వాతంత్య్రానికి పూర్వమే కట్టా డు. అప్పట్లో ఆసియాలోనే భారీ ప్రాజెక్టు నిజాంసాగర్ కట్టాడు.
ఇవాల్టి శ్రీరాంసాగర్కు ఎగువన మహారాష్ట్రలో గోదావరి ప్రాజెక్ట్, పాలమూరును పంటల సీమగా మార్చే అప్పర్ కృష్ణాకు రూపకల్పన చేశాడు. భాషాప్రయుక్త రాష్ర్టాల పుణ్యమా అని తుంగభద్ర మైసూర్కు పోయింది. తెలంగాణ సొమ్ముతో కట్టిన తుంగభద్ర నీటి కాల్వమీద కట్టిన ఆర్డీఎస్ నుంచి నీళ్లు బతిమాలి అడుక్కుతినే స్థితికి తెచ్చింది కాంగ్రెస్సే. గోదావరి ప్రాజెక్టు, అప్పర్ కృష్ణా మాయమైపోయా యి. సిద్దేశ్వరం పోయి శ్రీశైలం వచ్చి రాయలసీమ పాలైంది. పాత పులిచింతల స్థానంలో నందికొండకు గండి కొట్టి నాగార్జునసాగర్ వస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.
సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాజెక్టులన్నీ ‘పెండింగ్’ అనే పేరు సార్థకం చేసుకున్నాయి. 1977లో ఇందిరాగాంధీ జనగామ సభలో హామీ ఇచ్చిన శ్రీరాంసాగర్ వరద కాలువ పథకానికి ఆవిడ జీవించి ఉన్న కాలంలో పునాది కూడా పడలేదు. ఆఖరికి పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో ఒత్తిడి తెస్తే కాంగ్రెస్ పునాది వేసి వదిలేసింది. తెలంగాణ వచ్చేదాకా అది పూర్తి కానే లేదు. పాలమూరులో డజన్ల కొద్దీ ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేసి అదిగో ఇదిగో అని మోచేయి బెల్లాన్ని నాకించారు తప్ప ఒక్క ఎకరాకూ నీరు రాలేదు. పాలమూరు ప్రజలను వలసల పాలు చేసింది. నల్లగొండ జనాన్ని రాజధాని అడ్డకూలీలను చేసింది.. ఉత్తర తెలంగాణ రైతులను ముంబై దుబాయ్ల పాలు చేసింది కాంగ్రెస్ పాలకులే.
ఓసారి భూసంస్కరణల పేరు చెప్పి.. ఓసారి ప్రాజెక్టుల పేరు చెప్పి.. మరోసారి ఉచిత విద్యుత్ పేరు చెప్పి ఎన్నికల ఏరు దాటారే తప్ప ఏనాడూ ఏ అంశం మీద కాంగ్రెస్ నేతలు తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నది లేదు. ఉచిత విద్యుత్ అంశమే తీసుకోండి. ఆ వాగ్దా నం చేసేముందు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ఎం త? డిమాండ్ ఎంత? అనే ఆలోచనే చేయలేదు పోనీ వచ్చాక ఏంచేశారు? వాగ్దానాన్ని నిలుపుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ వెంటనే విద్యుత్ రంగంపై సమీక్ష చేయాల్సింది. లోటును భర్తీ చేయడానికి వెంటనే పక్కరాష్ర్టాలనుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సింది.
ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తి పెంచాల్సింది. కానీ అవేవీ చేయకుండా ఉన్న కరెంటునే సర్దేశారు. వర్షాలు లేక జలవిద్యుత్ దెబ్బకొట్టింది. అయినా కనీస ప్రత్యామ్నాయాలు చేయకుండా సినిమా చూశారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలతో అల్లాడిందంటే దానికి కాంగ్రెస్కు ముందుచూపు.. వెనకుచూపు రెండూ లేకపోవడమే కారణం. చిన్నచిన్న తాయిలాలతో కాలం గడపడమే తప్ప వ్యవసాయం మీద కాంగ్రెస్కు ఒక విజన్, ఒక కల్పన ఎప్పుడూ లేదు. సమస్యలు అర్థం చేసుకోవడం, దానికి పరిష్కారం చూపడం రెండూ ఆ పార్టీ చరిత్రలోనే లేవు. అప్పటికపుడు పిప్పరమెంట్లు చాక్లెట్లతో నెట్టుకురావడం తప్ప మరో ఆలోచన లేదు. ఇవాళ 24గంటల కరెంటు మీద, ధరణి మీద ఆఖరుకు రైతుబంధు మీద ఆ పార్టీ చేస్తున్న పనికిరాని ఆరోపణలే అందుకు ఉదాహరణ.
రైతుబంధుతో 22 ఎకరాల్లో పంటలు సాగు nఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండలనాగాపూర్ రైతు లింగారెడ్డిది ఇదే కథ. ఆయనకు గ్రామంలో 22 ఎకరాల భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు తెచ్చి పంటలు సాగు చేయలేక 22 ఎకరాల్లో 10నుంచి 15 ఎకరాలు మాత్రం పంటలు వేసేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరెంటు, నీళ్లు, రైతు రుణమాఫీ తర్వాత రైతుల జీవితాల్లో మార్పు వచ్చింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు లింగారెడ్డికి వరంగా మారింది. 22 ఎకరాలకు రైతుబంధు డబ్బు సీజన్కు ముందే పడటంతో గతంలో ఐదారు ఎకరాలు పడావు పెట్టే ఆయన ఇపుడు మొత్తం భూమిని సాగులోకి తెచ్చాడు. 22 ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేస్తున్నాడు.
రైతుబంధుతో పడావు భూమి సాగులోకి..
రైతుబంధుతో బీడు భూములు ఎలా సాగులోకి వస్తున్నాయో తెలిపే ఉదాహరణలు కోకొల్లలు. ఇందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రామయ్యపల్లె గ్రామవాసి మాడిశెట్టి రవి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ ఆయనకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో కరెంటు, నీళ్లు లేకపోవడంతో పాటు పెట్టుబడి కోసం చేతిలో డబ్బు లేకపోవడంతో సాగు చేయలేక ఈ భూమిని బీడు పెట్టాడు. వ్యవసాయం చేయలేక ఊరిని వదిలేసి కుటుంబంతో వరంగల్కు చేరి పలు రకాల పనులు చేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
ఏటా వానాకాలం, యాసంగి రెండువిడుతల్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున మాడిశెట్టి రవికి ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు వచ్చాయి. ఫలితంగా గతంలో పెట్టుబడి లేక ఏళ్లపాటు పడావు పెట్టిన భూమిని నెమ్మదిగా సాగులోకి తీసుకువచ్చాడు. ఒకటి రెండేళ్లలోనే రైతుబంధు డబ్బులతో తన మొత్తం 15 ఎకరాల్లో సాగు ప్రారంభించి ఇపుడు ఏటా రెండు పంటలు పండిస్తున్నాడు. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేస్తూనే ఈ ఏడాది అందులోనే ఎనిమిది ఎకరాల్లో ఆయిల్పామ్ వేశాడు. ఆదాయం పెరగడం వ్యవసాయం గిట్టుబాటు కావడంతో వరంగల్ నగరాన్ని వదిలేసి తొగర్రామయ్యపల్లెకి చేరుకొని ఇపుడు సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నాడు.
సొల్లుగాల్లకు ఆకు తెలీదు పోకా తెలీదు..
పెట్టుబడి కాదు.. గిట్టుబాటు ధరలు చెల్లించాలి అంటాడొకడు. అసలు పెట్టుబడి లేకుండా ధాన్యం ఉత్పత్తి ఎక్కడిది? దానికి గిట్టుబాటు ధర ఎక్కడిది? అనే జ్ఞానం లేదు. పోనీ రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదా? అంటే కేంద్రం ప్రకటించే ఎంఎస్పీ ధరలు లభిస్తున్నాయి. రైతులను వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయ కుండా ప్రభుత్వమే ఊరూరా కాంటాలు పెట్టి ధాన్యం కొంటున్నది. చివరి గింజవరకు కొంటూ వ్యాపారుల్లా దీర్ఘకాలం కాకుండా వేగంగా డబ్బు బట్వాడా చేస్తున్నది.
దళారులు వ్యాపారుల వేధింపులు ఇపుడు లేవు. అయినా పనికిరాని కొన్ని మేళాలు ఏడుపు పాటలు పాడుతూనే ఉంటాయి. సమాజానికి సరిపోని కుల మతాలనే వైరస్లను మనసులో మోసే మూకలు బురద చల్లుతూనే ఉంటాయి. రాష్ట్రంలో రైతు బాగున్నాడా? లేదా చెప్ప డానికి పెద్ద దూరం వెళ్లనక్కర లేదు. మహ బూబ్నగర్లో వేరుశెనగను ప్రభుత్వం కొం టూ ఉంటే ఆంధ్రాలోని కర్నూలు రైతులు కూ డా వచ్చి ఇక్కడ లభించే ధరకు సరుకును అ మ్ముకున్నారు. గిట్టుబాటు ఉన్నట్టా? లేనట్టా?
వేస్ట్ అంటూనే డబ్బులు తీసుకుంటున్న నాయకులు…
రైతుబంధు వేస్ట్ అని, తాగితందనాలా డుతున్నాడని అంటున్న కాంగ్రెస్ నాయకులు రైతుబంధు తీసుకోవడం లేదా? అంటే బేషుగ్గా తీసుకుంటున్నారు. ఫెళఫెళలాడే నోట్లు లెక్కపెట్టి మరీ జేబులో పెట్టు కుంటున్నారు. అందులో ఇపుడు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో సింహభాగం రైతుబంధు లబ్ధిదారులే. ఇందులో ఒకటిన్నర ఎకరాల నుంచి వందల ఎకరాలున్న కుటుంబాలు ఉన్నాయి. అందరికందరూ రైతుబంధు అందుకుంటున్నారు. రైతుబంధు ను వ్యతిరేకించేవారు దాన్ని తీసుకోవద్దు కదా? అంటే వాళ్ల దగ్గర జవాబు లేదు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంరైతుబంధు తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు..