ప్రభుత్వాలకు ‘లక్ష్యం’ లేకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రత్యేకించి రైతులు అలవికాని బాధలకు గురవుతున్నారని, రైతుల ఆత్మహత్యలు అత్యంత విషాదకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. ప్రభుత్వాలకు దృఢ నిశ్చయం ఉంటే ఈ పరిస్థితిని మార్చవచ్చని ఆయన తేల్చిచెప్పారు.
దేశంలో 18 కోట్ల 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి అందుబాటులో ఉండగా అందులో 15 కోట్ల 40 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది. 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమి వివిధ పథకాల ద్వారా నీటి వసతిని పొందుతుండగా మిగతా 8 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమిని కేవలం వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే… 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల తరి భూమిలో 3 కోట్ల 50 లక్షల హెక్టార్ల భూమికి భూగర్భ జలాలే ఆధారం. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం లేని బావులు, బోర్ల ద్వారా సాగవుతున్న భూమి అన్నమాట. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బోర్ల ద్వారా నీటిని తోడి వ్యవసాయానికి పూనుకుంటే తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ కనీస ప్రోత్సాహం, ఆర్థికావలంబన లభించడం లేదు.
దేశంలోని పెద్ద రాష్ర్టాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 6 నుంచి 7 గంటల కరెంటు మాత్రమే రైతులకు అందుతున్నది. 4 గంటలు పగటిపూట, 2 గంటల నుంచి 3 గంటలు రాత్రిపూట. మహారాష్ట్ర రైతాంగానికి వచ్చే మూడేండ్లలో పగలు 8 గంటలు కరెంటు ఇవ్వడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామని మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎంఎస్ఈడీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ సింఘాల్ ఆ మధ్యన ప్రకటించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉందనడంలో సందేహం లేదు. దీనికి తోడు బిల్లులు కట్టలేదని రైతుల కనెక్షన్లు తొలగిస్తున్నారు. 45 లక్షలకు పైబడి వ్యవసాయ పంపు సెట్లు కలిగిన మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తుకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమాంచల్ విద్యుత్ వితరణ్ నిగం లిమిటెడ్ పరిధిలోని మూడున్నర లక్షలకు పైగా పంపుసెట్లు కలిగి ఉన్న రైతులు రూ.2,600 కోట్లు బకాయి పడి ఉన్నారని కనెక్షన్లు తొలగించడం తో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనవరి, 2022 ఎన్నికల్లో రైతులకు ఉచిత విద్యుత్తు హామీనిచ్చిన అక్కడి ప్రభుత్వం ఎన్నికల అనంతరం హామీ అమలుపరచకుండా రైతులను వేధిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. యూపీ ప్రభుత్వం విద్యుత్తు రంగానికి కేటాయించిన బడ్జెట్లో వ్యవసాయరంగానికి ఇచ్చింది రూ.1,250 కోట్లు మాత్రమే. పూర్వాంచల్, పశ్చిమాంచల్, మధ్యాంచల్, కాన్పూర్ తదితర ప్రాంతాల రైతులకు కావల్సినంత కరెంటు అందించలేక అక్కడి సర్కార్ ఆపసోపాలు పడుతున్నది.
ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ విషయానికి వస్తే వ్యవసాయానికి 8 గంటల కరెంటు రెండు విడతలుగా ఇస్తున్నది. 18 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లున్న గుజరాత్లో 11 కేవీ ఫీడర్లను 153 గ్రూపులుగా విభజించి రొటేషన్ పద్ధతిలో కరెంటు సరఫరా చేస్తున్నారు. రాత్రిపూట కరెంటు వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి 18,000 గ్రామాల రైతులకు పగటిపూట కరెంటునందించడానికి 2021లో ‘కిసాన్ సూర్యోదయ యోజన’ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. కానీ ఆ కార్యక్రమం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
మధ్యప్రదేశ్లో 11 కేవీ ఫీడర్లను ఏ, బీ గ్రూపులుగా విభజించి పగలు 4 గంటలు, రాత్రిపూట 6 గంటలు వెరసి 10 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ సరిపోను కరెంటు అందక సమయానికి విత్తనాలు, ఎరువులు లభించక అక్కడి రైతాంగం తరచుగా రోడ్డెక్కుతున్నారు. మధ్యప్రదేశ్లో 5 హెచ్పీ మోటర్ వినియోగించుకునే రైతు నెలకు రూ.2,600 బిల్లు కడుతున్నాడు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభు త్వం వ్యవసాయరంగానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించడానికి సుమారు రూ.6 వేల కోట్లు వెచ్చించి సబ్స్టేషన్ల విస్తరణ, నూతన 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేపడుతున్నది. 2014 నాటికి 138 మిలియన్ యూనిట్ల రోజువారీ విద్యుత్తు వినియోగం నేడు 274 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది. ‘వాకింగ్ ఆన్ టు లెగ్స్’ అంటాడు మావో. ఒకటి వ్యవసాయరంగం, రెండోది పరిశ్రమలు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. వ్యవసాయరంగం విషయానికి వస్తే తెలంగాణ అగ్రగామిగా నిలిచి వంద మార్కులు సాధించిందనడంలో ఎవ్వరికీ అభ్యంతరం లేదు.
గుజరాత్ విషయానికి వస్తే వ్యవసాయానికి 8 గంటల కరెంటు రెండు విడతలుగా ఇస్తున్నది. 18 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లున్న గుజరాత్లో 11 కేవీ ఫీడర్లను 153 గ్రూపులుగా విభజించి రొటేషన్ పద్ధతిలో కరెంటు సరఫరా చేస్తున్నారు. రాత్రిపూట కరెంటు వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి 18,000 గ్రామాల రైతులకు పగటిపూట కరెంటునందించడానికి 2021లో ‘కిసాన్ సూర్యోదయ యోజ న’ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. కానీ ఆ కార్యక్రమం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
(వ్యాసకర్త: టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)
– తుల్జారాంసింగ్ ఠాకూర్ 78930 05313