సమైక్యరాష్ట్రంలో అరవై ఏండ్లు వెనుకబడ్డ తెలంగాణను పదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఇటు సంక్షేమంలో, అటు అభివృద్ధిలో జోడెద్దులుగా ఏకకాలంలో ముందుకు నడిపించుకుంటున్నాం. ప్రతి ఇంటిలో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం ’అనే రీతిలో ‘సంక్షేమం అందని ఇల్లు లేదు అభివృద్ధి జరుగని ఊరు లేదు’ పరిపాలనను గాడిలో పెట్టడానికి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం. కరెంటు, సాగునీరు, తాగునీరు సమస్యలకు పరిష్కారం చూపి పరిపాలనలో కేసీఆర్ మార్కును చూపించారు. తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపరచడానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.
సంక్షేమ పథకాల అమలు విషయంలో గత పాలకుల మా దిరిగా ఓట్ల రాజకీయం లే దు. ప్రజల ఆర్థిక, సామాజి క, జీవన స్థితిగతులు మెరుగుపరచాలన్న ఒక ఉన్నతమై న లక్ష్యం తప్ప. తెలంగాణ అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందజేయాలన్న కేసీఆర్ ఉన్నతమైన మానవీయ కో ణం ఈ సంక్షేమ పథకాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది. ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల, ప్రజ ల ఆకాంక్షల పట్ల ఉద్యమ నేతగా కేసీఆర్కు పూర్తిస్థాయి అవగాహన ఉన్నది. వారి జీవన స్థితిగతు ల్లో మార్పును తీసుకురావడానికి అనుగుణంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ముఖ్యం గా వికలాంగులకు భరోసాగా నిలుస్తున్న విధానం వికలాంగుల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వికలాంగులకు నేనున్నానంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల్లలో దివ్యాంగుల పింఛన్లకోసం ప్రభుత్వం రూ.10,310.36 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఒక్క పింఛన్లే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి అనేక అవకాశాలను ఉచితంగా వారికి అందజేయడం జరుగుతున్నది.
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో.. సంక్షేమ పథకాల లబ్ధిదారులు కేసీఆర్కు మద్దతు తెలియజేసి ఇదే ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. పదేండ్ల్ల తెలంగాణ ప్రయాణంలో దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో భరోసానిచ్చింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వికలాంగులకు రూ. 4016లు పింఛన్ అందించటం లేదు. ఏ దరఖాస్తు లేకున్నా, వికలాంగుల నుంచి ఏ విజ్ఞప్తి లేకున్నా పింఛన్ను పెంచిన చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ది. అంతేకాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పింఛన్ను ఏకంగా రూ. 6,016 లకు పెంచుతామని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడం వికలాంగులకు మరింత సంతోషాన్ని ఇచ్చే అంశం.
ఏదేమైనా ఈ పదేండ్ల్లలో దివ్యాంగుల సమాజానికే కాదు, పేద బడుగు బలహీన వర్గాలకు కుల మత భేదాలు లేకుండా సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలను అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మానవీయ కోణం దాగి ఉన్నది. ఒక గొప్ప ఆశయం దాగి ఉన్నది. ఉద్యమ నేతగా అటు ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రిగా, ఇటు తెలంగాణ అభివృద్ధిలోనూ దేశానికి స్ఫూర్తినిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడు కేసీఆర్ వెం టే ఉంటారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఈ విషయాన్ని విస్పష్టంగా మరొకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
(వాసకర్త :రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్)
– డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి 95530 86666