‘ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం’ ఎప్పటికీ బాగుపడదనే నానుడి ఉన్నది. అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి సంక్షేమం కోసం పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో రైతు గోసలు అన్నీ ఇన్నీ కావు. కరెంటు కష్టాలు, విత్తనాల కొరత, పెట్టుబడి ఇబ్బందులు, సాగునీరు లేకపోవడం వంటి అనేక సమస్యలు అన్నదాతలను ఆత్మహత్యలవైపు పురిగొల్పాయి. కానీ నేడు ఎవుసం సంబురమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సాగునీటి కోసం మిషన్ కాకతీయతో చెరువులు తవ్వించి భూగర్బజలాల అభివృద్ధికి కృషి చేశారు.
తెలంగాణ నేడు పుట్లకొద్ది ధా న్యరాసులతో, పచ్చని పైర్లతో తెలంగాణ తల్లికి ఆకుపచ్చ తోరణమైంది. రైతు బాగుంటేనే దేశం బా గుంటుంది. సమాజానికి బువ్వ పెట్టే రైతన్నను కాపాడుకోవడమే కాదు…నేను రై తును అని గర్వంగా చెప్పుకునేలా ఉద్యమ నేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో కర్షక శక్తికి అండగా నిలుస్తున్నారు.
కేసీఆర్ ఉద్యమ పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. కేసీఆర్ నిర్ణయా లు గొప్ప సంస్కరణలతో కూడుకొని భవిష్యత్తుకు మార్గం సుగమం చేసేలా ఉం టాయి. ఆయన తీసుకునే నిర్ణయమేదైనా సంపూర్ణ సమగ్రతతో కూడుకున్నదై ఉం టుంది. కేసీఆర్ రాజకీయంగా ఎంత చా ణక్యతతో వ్యవహరిస్తారో, పోరాటంలో నూ అంతటి పటిమను ప్రదర్శిస్తారు. నా లుగున్నర కోట్ల ప్రజల కలల ఆకాంక్షను సాకారం చేసిన కార్యోణ్ముకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
నాడు తెలంగాణ కోసం సుమారు 14 ఏండ్లు అలుపెరగని పోరాటంతో ఢిల్లీ మె డలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ నుం చి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ పార్లమెంట్ సాక్షిగా పోరు సాగించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వివిధ పార్టీల మద్దతును కూడగట్టడంలో కేసీఆర్ విజయం సాధించారు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వా మ్యం చేయడంతో పాటు.. ప్రపంచ వ్యా ప్తంగా తెలంగాణ ఉద్యమ అవసరాన్ని తెలియజేశారు. అనేక పరిణామాల తర్వా త తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ఆయ న అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలతో తెలంగాణలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించారు. సుపరిపాలనలో అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగా అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సాగునీటి కోసం మిషన్ కాకతీయతో చెరువులు తవ్వించి భూగర్బజలాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరానికి 10 వేల చొప్పున అందిస్తున్నారు. రైతు బీమా కింద 5 లక్షలు పరిహారం అం దించి అండగా నిలుస్తున్నారు.
వరి కొనుగొలులో కేంద్రం తెలంగాణ రాష్ర్టాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిం ది. కానీ కేంద్రం కుట్రను గమనించిన సీ ఎం కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఢిల్లీ దిగిరాక తప్పలేదు. ఆనాడు కేసీఆర్ ఆమరణ ని రాహార దీక్ష రాష్ట్ర సాధన ను మలుపు తిప్పి రాష్ర్టా న్ని సాధిస్తే … ఇందిరా పార్కు వద్ద సీఎం కేసీఆర్ చేపట్టిన మహాధర్నా దేశ రైతన్నల జీవితాలను మ లుపు తిప్పింది.
భవిష్యత్తులో దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ ఓ మహాశక్తిలా మారి ప్రపం చ దేశాల సరసన భారతదేశాన్ని నిలుపుతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సబ్బండ వర్గాల రక్షణ కోసం కృషి చేస్తూనే.. ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగింది. మన రాష్ట్రం త్వరలోనే నెంబర్వన్గా ఎదగడానికి కేసీఆర్ అడుగుజాడ ల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ది.
ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే డ్రామాలతో ప్రజలను, రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందుల పాలు చేయాలని కేంద్ర సర్కారు చూస్తున్నది. ఇప్పటికే అనే క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నాయి. రోజు రోజుకు కేసీఆర్ను అనుసరించే, జతకట్టే రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతున్నది. అంటే ఉద్యమ నాయకు డు కేసీఆర్ ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవాలి. రైతులను మరోసారి ఇబ్బందిపాలు చేసేలా పెంచిన యూరియా ధరల పై పోరుకు ఉద్యమ నాయకుడు సిద్ధ్దమయ్యారు. రైతును రాజు ను చేయడమే లక్ష్యంగా ఎంత కష్టమైనా రైతు సంక్షేమంతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఉద్యమ రథసారథి కేసీఆర్ తీసుకున్న కర్షకుల రక్షణ పోరులో ..మనం మళ్లీ జతకట్టి నడవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త : విద్యార్థి ఉద్యమ నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516