తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా స్వరాష్ర్టాన్ని సాకారం చేసుకోగలిగాము. కేసీఆర్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు చేపట్టిన కేవలం ఎనిమిదేండ్లలోనే ఆదర్శవంతమైన పాలన, సంక్షేమ పథకాలతో తెలంగాణను భారతదేశానికే ఆదర్శవంతంగా నిలిపారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితితో అవే పథకాలతో దేశానికి తెలంగాణ మాడల్ పాలనను అందించేందుకు సిద్ధమయ్యారు
ఎనిమిదేండ్ల స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నది. దేశంలోనే రైతులను గుండెల్లో పెట్టుకొని భరోసా ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు అనుసరించేలా మన రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచింది. మన పథకాలను ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ర్టాలలో ప్రవేశ పెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు ఆదరణ రావడం, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కేసీఆర్ ను అనుసరించడం కేంద్రంలోని బీజేపీకి రుచించడం లేదు. అధికారం తప్పా..సంక్షేమం ఏ మాత్రం పట్టని కేంద్ర సర్కారు..దేశంలో కేసీఆర్ బలమైన నాయకునిగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. దీంతో తెలంగాణ పై కుట్రలకు తెరలేపింది. దీన్ని గ్రహించిన ఉద్యమసారథి కేసీఆర్ భారతదేశంలో గుణాత్మక పాలన కోసం బీఆర్ఎస్ ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి తెలంగాణలో బీజేపీ చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. అయినప్పటికీ ఇక్కడి తెగువగల సమాజం కేసీఆర్ వెన్నంటి నిలిచింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో తెలంగాణ వేదికగా దేశానికి బీఆర్ఎస్ నేనున్నాననే భరోసాను ఇవ్వనున్నది.
లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు బీజేపీ పాలనలో సత్కారాలు జరుగుతున్నాయి. సంపన్నులు కోట్లల్లో పన్ను రాయితీలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. అదే సమయంలో తెలంగాణలోమాత్రం అధికారం కోసం వారిపై కపట ప్రేమ ను ప్రదర్శిస్తున్నారు. వారి ఇండ్లల్లో తేనీరు సేవించటం, భోజనాల పేరు తో అందమైన నాటకాలాడుతున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కేంద్ర సంస్థ అయిన ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) రికార్డులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాలై న ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో ఈ దాడులు మరి ంత అధికంగా ఉన్నాయంటే వారి పాలన ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దళితుల గౌరవానికి, అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయని కేంద్ర బీజేపీ ప్రభుత్వం వారి ఉన్నతికి ఎలాంటి పథకాలు కూడా చేపట్ట లేకపోయింది.. పైగా ఇటీవల బిల్కిస్ బానో హత్య కేసులో నిందితు లను విడుదల చేయడంతోపాటు వారిని సన్మానించడంలో బీజేపీ ఆంతర్యాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది.
ఓ వైపు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని అనేక మంది తెలంగాణకు వలస వస్తున్నారు. పొట్టపోసుకోవడానికి వస్తున్న వారికి తెలంగాణ నేల గుండెలకత్తుకొని భరోసానిస్తున్నది. కరోనా సమయంలోనూ వలస కార్మికుల పట్ల కేంద్రం నిర్ల క్ష్యం వహించింది. ఆకలితో వేలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడిన వారిని తెలంగాణ ప్రభు త్వం చేరదీసి వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్నం పెట్టి ఆదుకొన్నది.
మత విద్వేషాలే ప్రధాన ఎజెండాగా.. తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ పక్కాగా అమలు చేస్తున్నది. ఆరున్నర దశాబ్దాల చెర నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుగులు అందుకుంటున్నది.
ఉద్యమ నాయకుడే రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధి కూడా ఉద్యమ పంథాలోనే సాగుతున్నది. ఎనిమిదేండ్ల స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నది. దేశంలోనే రైతులను గుండెల్లో పెట్టుకొని భరోసా ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు ఎండిన పంటలు, గిట్టుబాటు ధరలు లేక పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భా లు తెలంగాణలో కోకొల్లలు. అలాంటిది తెలంగా ణ రైతాంగానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువు లు నింపి సాగునీరందిస్తున్నది. రెండు కాలాల పంటలతో మోడువారిన తెలంగాణను నేడు పచ్చని తోరణంగా మార్చిన ఘనత కేసీఆర్ది.
కేంద్రం తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల్లోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తున్నది. మొన్న ఒలింపిక్స్ క్రీడల సమయంలో గుజరాత్కు సుమారు120 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణకు కేవలం నాలుగు కోట్లు కేటాయించి అక్కసును చాటుకున్నది. గతంలో రైతు చట్టాల పేరుతో ఆగం జేయజూసి కేసీఆర్ దీక్ష, రైతుల తిరుగుబాటుతో పార్లమెంటు సాక్షిగా ఆ చట్టాలను స్వయంగా ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు. తెలంగాణపై అనేక కుట్రలు చేస్తున్నప్పటికీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ సమాజానికి అండగా నిలుస్తున్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా.. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
ప్రలోభాల రాజకీయాలు చేయడానికి బీజేపీ చేరికల కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణలో రాజకీయ డ్రామాలతో, విద్వేషాలతో బలపడడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ప్రభుత్వాలను కూలుస్తూ.. కక్షపూరితంగా దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం ఆకలి కేకల దేశాన్ని బాగు చేయడం మాని.. బడా కార్పొరేట్ దారులకు కొమ్ముకాస్తుండడం సమాజానికి సిగ్గు చేటు. రాష్ర్టాల హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ పూరిత కుట్రలను కేసీఆర్ తిప్పి కొడుతున్నారు. దేశంలో మానవత్వపు విలువలు పెంచడానికి ఆయన ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం.. ఆకలిబాధలు లేని భారత్ను నిర్మించడానికి ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్తో మరోసారి కదిలారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు ధారాదత్తం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తున్నది. తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేస్తూ గుండె ధైర్యాన్నిస్తున్న గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష.
దేశంలో గుణాత్మక మార్పుకోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట నడవాల్సిన అవసరమున్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రదర్శించిన చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని సబ్బండ వర్గాలు కేసీఆర్తో నడవాలి. తెలంగాణ వేదికగా దేశానికి నాయకత్వం వహించే నాయకుడికి అండగా నిలవాలి. ఈ తెగువ కలిగిన నేల నుంచే.. దేశంలో సుపరిపాలనకు అడుగులు పడుతున్న వేళ మనం మరింత రెట్టింపు ఉత్సాహంతో సాగాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త : దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)
-సంపత్ గడ్డం
78933 03516