బీజేపీ వేరు.. హిందూ మతం వేరు బీజేపీ వేరు.. దేశభక్తి వేరు బజరంగ్ దళ్ వేరు.. బజరంగ్బలి వేరు హిందూత్వం వేరు.. హిందూయిజం వేరు మతం వేరు.. మతోన్మాదం వేరుమతాన్ని అనుసరించడం వేరు..మతం పేరు చెప్పుకొని ఓట్లు అడగడం వేరు
బీజేపీకి ఓటు వేయకపోతే హిందువు కానట్టా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి లేనట్టా? బజరంగ్దళ్ను నిషేధిస్తే బజరంగబలి నోరు నొక్కినట్టా? ఎన్నో ఏండ్లుగా దేశంలో ప్రతి పౌరుడి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలివి. బీజేపీ అంటే హిందూ మతమని, బీజేపీ అంటే దేశమని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులని, బజరంగ్దళ్ అంటే బజరంగ్బలి అని బీజేపీ నాయకులు ప్రజల మెదళ్లలోకి ఎక్కించారు. అమాయకపు ప్రజలు వాటినే నిజమనుకొని ఇన్నేండ్లు భ్రమపడ్డారు. బీజేపీ విసిరిన వలలో చిక్కుకున్నారు.
మోదీ, షా కనుసన్నల్లో అనేక అస్ర్తాలను ఎక్కుపెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి హేమాహేమీలు వచ్చి మతం, దేవుడి పేరిట రాజకీయం చేశారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా బజరంగ్బలిని రాజకీయాల్లోకి లాగారు. బీజేపీ అనుబంధ సంస్థ బజరంగ్దళ్ను దేవుడితో పోల్చారు. బజరంగ్బలి అని పలికే నోళ్లను నొక్కాలని చూస్తున్నారని వక్రీకరించి తన స్థాయిని దిగజార్చుకున్నారు.
మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిందువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారాన్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. బీజేపీకి హిందూ మతానికి సంబంధం లేదని, బజరంగ్దళ్, బజరంగ్బలి వేరని, బీజేపీకి ఓటు వేయకపోయినా దేశభక్తులేనని కర్ణాటక ఓటర్లు నిరూపించారు. దేశానికి దిక్సూచిగా మారి, దేశ ప్రజలకు గమ్యాన్ని సూచించారు.
మోదీ, షా కనుసన్నల్లోనే…
హిందూ మతాన్ని అనుసరించి, ఆరాధించడం హిందూయిజం అయితే… హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని తమ పబ్బాన్ని గడుపుకోవడమే బీజేపీ పాటించే హిందూత్వం. ఈ విషయాన్ని త్వరగానే అర్థం చేసుకున్న కర్ణాటక ఓటర్లు బీజేపీకి బుద్ధి చెప్పారు. హలాల్, హిజాబ్, బజరంగ్దళ్, కేరళ స్టోరీ, టిప్పు సుల్తాన్ తదితర అంశాలను బీజేపీ లేవనెత్తింది. తన దగ్గరున్న అన్ని అస్ర్తాలను ఎక్కుపెట్టింది. వీటితోనే ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ.. తాను సులువుగా గట్టెక్కుతానని భావించింది. దేశ ప్రజలను ఎన్నోసార్లు మభ్యపెట్టిన బీజేపీ… ఈసారి కూడా అదే జరుగుతుందని ఊహించింది. అందుకే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ సర్కార్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలను చేసిం ది. ప్రచారాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉన్న అన్ని దారులను వెతికింది. మఠాల ద్వా రా రాజకీయాలు చేసింది. బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాలను బయటకు తీసింది. మోదీ, షా కనుసన్నల్లో పాశుపతాస్త్రం లాంటి అస్ర్తాలను ఎక్కుపెట్టింది. సాక్షాత్తూ దేశ ప్రధాని రోడ్ల వెంట కేరళ స్టోరీ సినిమాకు ప్రమోషన్ చేశా రు. ఇవన్నీ తమకేమీ పట్టనట్టు కర్ణాటక ఓట ర్లు బీజేపీని తిరస్కరించారు. హలాల్ తమకు కూడు పెట్టదని, హిజాబ్ తమకు గూడు ఇవ్వదని, కేరళ స్టోరీ తమకు జీవనోపాధిని కల్పించదని, బజరంగ్దళ్తో తమకు ఒరిగేదేమీ లేదని ఓటర్లు తేల్చిచెప్పారు.
ఎంతో కాలం మభ్యపెట్టలేరు…
బీజేపీ కులం, మతం, ధర్మం, దేవుళ్ల పేరి ట ఎన్నో ఏండ్లు మోసం చేయలేరని తెలిపోయింది. మతాల పేరిట ప్రజల్లో విద్వేషాన్ని నింపి ఎంతో కాలం పబ్బం గడపలేరని స్పష్టం అయింది. అభివృద్ధి, స్థానిక సమస్యలను పట్టించుకోకుండా మతం పేరు చెప్పి గెలవలేరని అర్థమైంది. నిత్యావసర సరకు లు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకొని మభ్యపెట్టలేరని బీజేపీ గుర్తించేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. విద్యావంతు లు, వివేకం ఉన్నవారు, ఆలోచించగలిగేవా రు ఉన్న దగ్గర తమ పప్పులు ఉడకవని బీజేపీకి తెలిసొచ్చింది. తాము చెప్పే అబద్దాలు విద్యావంతులు నమ్మరని తేటతెల్లమైంది.
గతంలో ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీ చతికిల పడ్డ విషయం తెలిసిందే. అమాయకులైన గ్రా మీణులు, నిరక్షరాస్యులను మోసం చేసినట్టు విద్యాధికులను మోసం చేయలేమని బీజేపీకి అవగతమైంది. కులా లు, మతాలు తమకు వద్దని, భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి ఉంటామని కర్ణాటక ఓటర్లు చెప్పకనే చెప్పా రు. ఐదేండ్లపాటు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి, ఎన్నికల ముందు మతం పేరుతో ప్రజలను వెర్రివాళ్లను చేయవచ్చని భావించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పారు.
ఏ దేవుణ్ని మొక్కాలో బీజేపీ చెప్పాలా?
దేశంలో గతంలో హిందూ మతం లేదా? భారత్లో హిందూ మతం కొత్తగా పుట్టుకొచ్చిందా? బీజేపీ వాళ్లే ప్రజలకు పరిచయం చేశారా?. తామే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లమన్నట్టు, తమకే పేటెంట్ హక్కు లు ఉన్నట్టు బీజేపీ వ్యవహార శైలి ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎవరినీ, ఎప్పుడు మొక్కాలో కూడా వారే చెప్ప డం ఏంటో వి డ్డూరం కాకపోతేనూ. ఎలా మొక్కాలి.. ఎవరిని కొలవా లి.. అనేది కూడా ప్రజలకు తెలియదా?.
అభివృద్ధి చేయడం చేతకాని వారు, దేశాన్ని ప్రగతిపథంలో నడపలేని వారు, తాము చేసిన పనులంటూ చెప్పుకోవడానికి ఏమీ లేనివారు ఇటువంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తా రు. తమకు అనుకూలంగా మలుచుకొని అధికారంలోకి రావాలని చూస్తారు.
దేశమంతా మార్పు రావాలి…
కర్ణాటకలో మొదలైన ఈ మార్పు దేశమంతటా రావాలి. దేశం మొత్తం ఇదే ట్రెండ్ రావాలి. మతం పేరిట రాజకీయం చేసేవారిని ప్రజలు తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే ఏ పార్టీనైనా తరిమికొట్టాల్సిందే. మత విద్వేషం, దేవుళ్ల పేరిట చేసే రాజకీయాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని ప్రజలు గ్రహించాలి. అటువంటి రాజకీయాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలుసుకోవాలి. తమ ప్రాంతం, రాష్ట్రం, దేశం, భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడేలా పాలన చేసేవారిని ఎన్నుకోవాలి. తద్వారా నవ భారతాన్ని నిర్మించాలి.
ఇప్పటికైనా బీజేపీ తీరు మారేనా…
దేశంలో గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని నెగ్గుకొచ్చిం ది. తాజాగా జరిగిన కర్ణాటకలోనూ ఇదే పద్ధ తిని అవలంభించింది. అసలుసిసలైన తమ అస్ర్తానికి తిరుగుండదని భావించిన బీజేపీ బొక్కబోర్లాపడ్డది. అన్ని అస్త్రశస్ర్తాలను వాడి నా అనుకున్న ఫలితం మాత్రం బీజేపీకి దక్క లేదు. త్వరలో తెలంగాణ, చత్తీస్గఢ్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టా ల అసెంబ్లీలకు ఎన్నికలు న్నాయి. ఇవి ముగిశాక పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్నాయి. మరి కర్ణాటకలో ఎదురు దెబ్బ తిన్న బీజేపీ ఈ ఎన్నిక ల్లోనైనా తన ప్రచార తీరు ను మార్చుకుంటుందా లేదా పాత పద్ధతిలోనే వ్య వహరిస్తుందా అన్నది చూడాలి.
-మాలోతు సురేష్
98856 79876