సంఘ్ పరివార్ ఫాసిస్టు విద్వేష విష వలయంలో చిక్కుకొని మణిపూర్ దగ్ధమవుతున్నది. ఆదివాసులపై హింస కొనసాగుతున్నది. వందలాది మంది మరణించారు. అయినా ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికలు జరిగినన్ని రోజులు మణిపూర్ మారణహోమాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా స్పందించలేదు. విద్వేషం రెచ్చగొట్టే కేరళ స్టోరీస్ సినిమా గురించి 17 ట్వీట్లు చేసిన ప్రధానికి, విద్వేష మంటల్లో తగలబడి పోతున్న మణిపూర్ హింసను ఆపమని ఒక్క మాట చెప్పడానికి కూడా నోరు రాలేదు. అక్కడి ప్రజలు వేడుకొంటున్నా హింసను ఆపడానికి, శాంతిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు.
రక్షిత అడవులు, వన్యప్రాణుల అభయారణ్యం పేరుతో గిరిజనుల భూమిని లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు కాంగ్పోక్పి జిల్లాలో చేపట్టిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగాయి. ఆ ఘటనలో ఐదుగురు గాయపడటంతో మొదట హింస చెలరేగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న, ఇంఫాల్లోని ప్రభుత్వ భూమిలో చట్ట విరుద్ధంగా నిర్మించారని మూడు చర్చిలను కూల్చివేసింది.
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారమే 113 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.1809 ఇళ్లు కాలిపోయాయి. 170 చర్చీలు ధ్వంసమయ్యాయి. 46,145 మంది ఇండ్లు వదిలి పారిపోయారు. 26,358 మందిని 178 సహాయ శిబిరాలకు తరలించారు. కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. 355 అధికరణ విధించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అ యినా హింస ఆగలేదు. రాష్ట్రంలో మిలిటరీని, అధికార యంత్రాంగాన్ని, వాడుకొని ఆదివాసీ గిరిజనులను అణచివేయాలని అధికార బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్ర జనాభా 35 లక్షలు. ఇంఫాల్ లోయలో జీవించే మెయితీ జాతి రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉంటారు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో వీరిదే ఆధిపత్యం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లకు గాను ఏకంగా 39 సీట్లు వీరే గెలిచారు. వీరు ప్రధానంగా హిందూ మతానుయాయులు.
అలాగే ఇంఫాల్ లోయ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలలో కుకీ, నాగా, జో వంటి 31 ఆదివాసీ తెగలవారు జీవిస్తున్నారు. వీరి జనాభా 40శాతం వరకు ఉంటుంది. వీరిలో కొందరు క్రైస్తవులు. మణిపూర్ భూసంస్కరణల చట్టం ప్ర కారం మెయితీ జాతీయులు కొండ ప్రాంతాల్లో భూము లు కొనడానికి గానీ, నివాసం ఉండడానికి గాని వీల్లేదు. దీనితో ఇంఫాల్ లోయ ప్రాంతంలో మా త్రమే మెయితీలు నివసిస్తున్నారు. జనాభా ఎక్కు వ, భూభాగం తక్కువ. కుకీ, నాగ, జో వంటి ఆదివాసీ తెగలు కొండ ప్రాంతాల్లో ఉంటున్నాయి. వారి జనాభా తక్కువ, భూభాగం ఎక్కువ. ఇది ఆదివాసులకు, మెయితీలకు మధ్య ఘర్షణకు ప్రధాన కారణం.
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గిరిజనులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని హామీనిచ్చింది. దీనికోసం పోరాడుతున్న 31 గిరిజన తెగలతోపాటు కుకీ నేషనల్ ఆర్మీ, జోమీ రివ ల్యూషనరీ ఆర్మీతో కాల్పుల విరమణ ఒప్పందా న్ని కుదుర్చుకున్నది. కానీ ఆ హామీని నెరవేర్చకుండా వారిని మోసం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెయితీల అండతో తిరిగి అధికారంలోకి వచ్చింది. 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన మెయితీలు బీజేపీకి అండగా ఉన్నారు. దీంతో గిరిజనులతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగింది.మణిపూర్ హిం సా కాండకు ఇక్కడే బీజాలు పడ్డాయి.
ఆదివాసీ గిరిజనులలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నందున వారికి వ్యతిరేకంగా సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున విద్వేష ప్రచారం చేస్తున్నది.1951ని ప్రాతిపదికగా తీసుకుని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) నిర్వహించాలని, అడవి నుంచి ఆదివాసీలను గెంటేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. క్రైస్తవంలోకి మారిన వారి రిజర్వేషన్, అటవి హక్కులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనుల మధ్య చి చ్చు రేపాలని చూశారు. చివరికి మెయితీలకు, గిరిజన తెగలకు ఉన్న వైరుధ్యాలకు మతం రంగు జోడించి మంటలు రాజేశారు.
మణిపూర్లో 2023 ఫిబ్రవరి లో ఎన్నికైన బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాం త నివాసాల నుంచి అక్రమ వలసదారుల తొలగింపు పేరుతో ఆదివాసులను అడవుల్లో నుంచి గెంటేసే ప్రయత్నాలను ప్రారంభించింది. మయన్మార్ వలసదారులు 1970 ల నుంచి మణిపూర్లో స్థిరపడ్డారని, అవి చట్టవిరుద్ధమైన వలసలని సంఘ్ పరివార్ ఒక ముద్రవేసింది. దాన్ని ఒక సాకుగా చూపుతూ, గిరిజనులను వారి భూ ముల నుంచి వెళ్లగొట్టాలని కోరుతున్నది. సంఘ్ ప్రభావంతో మెయితీలు అదే డిమాండ్ చేస్తున్నా రు. ఫిబ్రవరి 2023లో బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను ఆక్రమణదారులుగా ప్రకటించింది. చురచంద్పూర్, కాంగ్పోక్పి, తెంగ్ నౌపాల్ జిల్లాల్లో తొలగింపు డ్రైవ్ను ప్రారంభించింది.
ఏప్రిల్ 2023న గౌహతి హైకోర్టు మెయితీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి కేంద్ర గిరిజన శాఖ, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాయి. ఈ పరిణామం ఆదివాసులలో గుబులు రేపింది. మెయితీలు కొండ ప్రాంతాలలో భూమిని కొనుగోలు చేస్తారని కుకీలు భయపడ్డారు.
హైకోర్టు తీర్పును నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్యూ ఎం) మే 3న చురచంద్పూర్ జిల్లాలో 60వేల మందితో గిరిజన సంఘీభావ ర్యాలి నిర్వహిం చింది. ఈ సందర్భంగా చురచంద్పురా, కక్చింగ్, కాంచీపూర్, సోయిబమ్ లైకై, తెనుగోపాల్, లాం గోల్, మోరెహ్లలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ సమయంలో ఎక్కువగా ఇంఫాల్ లో యలో గిరిజనుల ఇండ్లు, ప్రార్థనా స్థలాలు (చర్చీలు) ఇతర ఆస్తులు దగ్ధం చేయబడ్డాయి. మే 3 నుంచి హింస విస్తరిస్తూ పోతున్నది.
నేడు మణిపూర్ తగలబడుతున్నది. రేపు మరో రాష్ట్రం కావచ్చు, ఒక్కొ క్క రాష్ర్టాన్ని, లక్ష్యంగా చేసుకొని మతోన్మాదులు దాడి చేస్తున్నారు. మ ణిపూర్లో ఆదివాసీ గిరిజనులు, మైనారిటీలపై జరుగుతున్న దమనకాండను ఆపాలని, శాంతిని నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పౌరసమాజం ఒత్తిడి తీసుకురావాలి.
-ఎండీ అబ్బాస్
94900 98032