NRI News | ఎడారి దేశమైన ఒమన్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. దారసైత్లోని శ్రీకృష్ణ ఆలయంలో నర్సన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించారు. యాదగిరిగుట్ట అర్చకుల బృందం ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు కనుల పండువలా సాగగా.. రెండువేల మంది హాజరయ్యారు. ‘ఓం నమో నారసింహాయ’ నామస్మరణతో గల్ఫ్ దేశం మార్మోగింది.
యాదిగిరిగుట్ట ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు నేతృత్వంలో మంగళగిరి నర్సింహామూర్తి అర్చకుల బృందం ఆధ్వర్యంలో తిరుకల్యాణం సాగింది. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్ చేపట్టిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి గురించి ప్రవాసీలకు వివరించి, స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారు. ఆలయ సూపరింటెండెంట్ సురేంధర్రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను గల్ఫ్కు తీసుకువచ్చారు.