హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జూమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టీఆర్ఎస్ ఎన్నారై శాఖలతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఎన్నారైల ప్లీనరీని నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). అప్పట్లో ఉద్యమానికి ఊపిరిగా మారిన కేసీఆర్.. రాష్ట్రంలో యువతను, పెద్దవారిని అందర్నీ ఏక తాటిపై నడిపించారని మహేష్ పేర్కొన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమానికి ముఖ్య అతిథులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, గణేష్ బిగాల పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు