హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వరంగల్లో జరిగిన సాఫ్ట్పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర్ రెండు పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, వరంగల్ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో రూ.20లక్షల చెక్ను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నారై రవిచంద్రన్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తలబెట్టిన మంచి కార్యక్రమానికి అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎన్నారైల భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.