హైదరాబాద్ : ‘వీధి అరుగు- నార్వే’, ‘దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కి పైగా తెలుగు సంస్థల సమన్వయంతో, తెలుగువారందరూ కలిసి జరుపుకునే రెండు రోజుల అంతర్జాతీయ వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ నెల 28న అంతర్జాల వేదికగా ప్రారంభమయ్యే రెండు రోజుల సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మొదటి రోజు భారతదేశ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వీరితో పాటు భారతదేశం నుంచి ప్రముఖ రచయితలు, కవిపండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ఆసక్తికరమైన సాహిత్యోపన్యాసాలు, చర్చలు
చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. అలాగే తెలుగు భాషా వికాసానికి పాటుపడుతున్న పలువురికి అవార్డులు ప్రధానం చేయనున్నారు. అంతేకాదు
తెలుగు సాహిత్య సంస్కృతీప్రియులందరినీ ఎంతగానో అలరించే మరిన్ని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల పరంపరతో మీ ముందుకు రాబోతున్న ఈ ‘తెలుగు భాషా దినోత్సవం 2021’ కార్యక్రమాన్ని వీక్షించి మీ ఆశీస్సులను అందించి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని https://youtu.be/ahjiJ6XvLB8
Facebook Live: https://www.facebook.com/SATELUGUCOMMUNITY ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో విక్షించవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి