(Mahesh Bigala) టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న వాడిన బాష కించపరిచే విధంగా ఉన్నదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఇలాంటి చవకబారు వ్యాఖ్యలకు దిగుతున్నారని, దీనిని బీజేపీ నేతలు చూస్తూ కూర్చోవడం ఆక్షేపణీయమన్నారు.
రాజకీయాల్లో ఉన్న వారి కుటుంబాలను, వారి పిల్లలను రాజకీయాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మహేశ్ బిగాల చెప్పారు. బాడీ షేమింగ్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ విషయంలో కేటీఆర్ కుటుంబానికి తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని మహేశ్ బిగాల డిమాండ్ చేశారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..