హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులు ఓటుతోనే సమాధానం చెప్తారని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత సాధికారత కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులకు చేరకుండా బీజేపీ లేఖలు రాసి దాన్ని ఆపించడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. బీజేపీ పార్టీకి ఎన్నికల్లో దళిత సోదరులు ఓటుతో సమాధానం చెప్తారన్నారు. హుజురాబాద్లో గెల్లు గెలువడం ఖాయమన్నారు.