తెలంగాణ కల్చరల్ సొసైటీ ఫర్ సింగపూర్ ( టీసీఎస్ఎస్ ) ఆధ్వర్యాన ఆదివారం సింగపూర్ ( Singapoor )లో బోనాల ( Bonalu ) పండుగను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ( Hyderabad )లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజున సింగపూర్ లో కూడా కొన్ని సంవత్సరాలుగా బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఈ బోనాల వేడుకలను స్థానిక సుంగే కేడుట్ లోని అరసకేసరి శివాలయంలో వైభవంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు ( Poturajulu ) , పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా, ఇతరులు సుమారు 800 మంది భక్తులు పాల్గొనడం విశేషం .
మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి ( Durga Devi ) కి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలుగింటి ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. పోతరాజు, పులి వేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీకాంత్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, గూర్ల లక్ష్మీపతిలకు ప్రత్యేక కృతజ్ఞతలు కమిటీ సభ్యులు తెలిపారు. గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, అలేఖ్య దార, గౌరీ శ్రీనివాస్, పద్మ బోనాలు సమర్పించిన వారిలో ఉన్నారు.
గడప రమేశ్ అమ్మవారికి తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకలకు సహకారం అందించిన మకుట డెవలపర్స్ శ్రీకర్ రెడ్డి, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మై హోమ్ సంయుక్ తో పాటు చిలుకూరి చంద్రశేఖర్, డార్విన్ బైసకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా వ్యవహరించిన సంతోష్ వర్మ మాదారపు, సతీష్ పెసరు, శివ ఆవుల, ప్రవీణ్ మామిడాల, రాధికా రెడ్డి నల్లా, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, శశిధర్ రెడ్డి, బొందుగుల రాము, కాసర్ల శ్రీనివాస రావు అందించిన సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, సదానందం అందె తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.