Indian-origin shot dead in US | అమెరికాలో దారుణం జరిగింది. పందెంలో గెలిచిన డబ్బులు కొట్టేయడానికి ప్రవాస భారతీయుడిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఇందుకోసం క్యాసినో నుంచి 80 కిలోమీటర్లు ఫాలో అయి ఇంటికి వెళ్లి మరీ చంపడం విషాదం. కౌంటీ ప్రాసిక్యూటర్ యోలాండా సికోన్, ప్లెయిన్స్ బోరో పోలీస్ చీఫ్ ఫ్రెడ్ టవెనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాకు చెందిన అరవపల్లి శ్రీరంగ (54) ( Sree Ranga Aravapalli ) అమెరికాలోని న్యూయార్క్ ప్లెయిన్స్బరోలో స్థిరపడ్డారు. హైదరాబాద్కు చెందిన ఆరెక్స్ ల్యాబొరేటరీ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన ఇంటికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్సెల్వేనియాకు వెళ్లిన శ్రీరంగ..పార్క్ క్యాసినో ఆడి దాదాపు 7.4 లక్షలు ( 10వేల అమెరికన్ డాలర్లు ) గెలుచుకున్నాడు.
ఇది గమనించిన ఓ దుండుగుడు శ్రీరంగను ఫాలో అయ్యాడు. అతని కారు వెనుక అనుసరిస్తూ అతని ఇంటికి వెళ్లాడు. శ్రీరంగ ఇంట్లోకి వెళ్లగానే బ్యాక్డోర్ పగులగొట్టుకుని ఇంటి లోపలికి వెళ్లాడు. డబ్బుల కోసం శ్రీరంగతో జరిగిన ఘర్షణలో అతనిపై కాల్పులు జరిపి దుండగుడు పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీరంగ ఇంటికి వచ్చిన పోలీసులు.. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే ఆయన మృతిచెందాడు. నిందితుడిని జెకై రీడ్ జాన్గా స్థానిక పోలీసులు గుర్తించారు. అతన్ని పెన్సెల్వేనియాలో అరెస్టు చేసి న్యూజెర్సీ పోలీసులకు అప్పగించారు.
ఏపీకి చెందిన అరవపల్లి శ్రీరంగ న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాడు. 2014 నుంచి ఆరెక్స్ ల్యాబ్లో పనిచేస్తున్నారు. ఈ కంపెనీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లోనే ఉంది. తయారీ మాత్రమే న్యూజెర్సీలో ఉంది. శ్రీరంగ.. ఎజ్మైండ్స్, ఈపేరోల్ కంపెనీలకు కూడా సీఈవోగా పనిచేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gold Rate | వచ్చే దీపావళికి తులం బంగారం ధర రూ.52-53 వేలు?!
పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం..
Adani to Cleartrip | క్లియర్ట్రిప్లో అదానీ వాటా కొనుగోలు?!