స్థానిక సంస్థలు సక్రమంగా పనిచేస్తేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని నమ్మిన సీఎం కేసీఆర్.. వాటి పురోభివృద్ధికి సరికొత్త బాటలు వేశారు. నిధులు, విధులు లేక నీరసించి పోయిన స్థానిక సంస్థలకు దండిగా నిధులు ఇచ్చి జవసత్వాలు కల్పించారు. ఫలితంగా తెలంగాణ పల్లెలు దేశంలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీధి వీధిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, హరిత వనాలతో అలరారుతున్న మన స్థానిక సంస్థలను చూసి మిగతా రాష్ర్టాల ప్రజలు అబ్బుర పడుతున్నారు. ఈ పురోగతి తమకూ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మోడల్ దేశ వ్యాపితం కావాలనే కోరిక బలంగా వినిపిస్తున్నది. జయహో కేసీఆర్ అని దేశం నినదిస్తున్నది. విభజన, విద్వేష, విధ్వంస రాజకీయాలను రూపుమాపేందుకు, దేశంలోని పల్లెల గతిని మార్చేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని భారతజాతి కోరుతున్నది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి ముందడుగు వేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
– బోధన్, సెప్టెంబర్ 15
అపారమైన అనుభవం, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనా దృష్టి, కార్యసాధనలో దీక్షా దక్షతలు కలిగిన కేసీఆర్ను దేశ నాయకుడిగా చూడాలని, సస్యశ్యామల భారతదేశం రూపకల్పనకు కేసీఆర్ నాయకత్వం వహించాలని రాష్ట్రంలోని పల్లెలు మొదలు జిల్లా కేంద్రాల వరకు స్థానిక ప్రతినిధులంతా మద్దతు పలుకుతున్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో స్థానిక సంస్థలు బలోపేతమైన తీరు… స్థానిక సంస్థల పరిధిలో పల్లె ప్రగతి, ప్రకృతి వనాల ఏర్పాటు, పల్లెలు పచ్చదనంతో అలరారుతున్న వైనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా జడ్పీటీసీలు కేసీఆర్ను దేశ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ జై కొడుతున్నారు. తెలంగాణ పల్లెలు మాదిరిగానే దేశమంతా అభివృద్ధి చెందాలంటే,.. కేసీఆర్లాంటి నేత మార్గదర్శకత్వంలోనే సాధ్యమంటున్నారు. భరతమాత ఘోస తీరాలంటే.. దేశాన్ని అంధకారంలోకి నెట్టిన దుష్టశక్తుల పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించాలని వారు అంటున్నారు. ఇది జరగాలంటే కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని, దేశ్ కీ నేతగా కేసీఆర్ను రాష్ట్ర ప్రజలే కాకుండా అనేక రాష్ర్టాల ప్రజలు చూడాలని కోరుకుంటున్నారని జడ్పీటీసీలు అంటున్నారు. కేసీఆర్ను దేశంలోని మేధావులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రంగాల నిపుణులు, అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించాలని ఆహ్వానించడం ఇది దేశానికి ఎంతో శుభ పరిణామమని చెబుతున్నారు. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న మోదీకి తగిన గుణపాఠం చెప్పగల నేర్పు ఒక్క కేసీఆర్కే ఉందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.. ఇందుకు స్థానిక సంస్థల ప్రతినిధులంతా జై కొడుతూ కేసీఆర్ దేశ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.
స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్
మాక్లూర్ : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుతున్నారు. దేశంపై ఆయనకు స్పష్టమైన విజన్ ఉంది. దేశాన్ని ఏ విధంగా నడిపిస్తే ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్న ప్రణాళిక కూడా ఆయన వద్ద ఉంది. భవిష్యత్తు తరాలకు మేలు జరుగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి ఎంతైనా అవసరం ఉంది.
– దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్ జడ్పీ చైర్మన్
కేసీఆర్తోనే దేశంలో మార్పు
నిజాంసాగర్ : ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ సేవలు ఎంతో అవసరం. తెలంగాణను ఎనిమిదేండ్లలో గొప్పగా తీర్చిదిద్దారు. ఇప్పుడు దేశ స్థితిగతులు మార్చే సమయం వచ్చింది. తెలంగాణలోని సంస్కరణలు, సంక్షేమ పథకాలు దేశంలోని పేదలందరికీ అందాలంటే సీఎం కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. పరిపాలనలో మార్పు కోరుకుంటున్న దేశ ప్రజలు కేసీఆర్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు.
-దఫేదార్ శోభారాజు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్
ప్రస్తుతం దేశానికి
కేసీఆర్ నాయకత్వం అత్యంత ఆవశ్యం..కేంద్రంలో ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్లింది. జీఎస్టీ మొదలుకొని అనేక రకాల పన్నులతో సామాన్యుడు చితికిపోయాడు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తూ ప్రజల సంపదను దోచుకునేవారికి ప్రధాని మోదీ తలుపులు బార్లా తెరిచారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని బాగుచేయాలంటే ఉద్యమ నాయకుడు, ప్రజల కష్టాలేమిటో క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేత కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం.. దేశంలో అలుముకున్న చీకటిని పారదోలేందుకే పుట్టాడా అన్నట్లు.. కేసీఆర్ను దేశ ప్రజలు గుర్తించడం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్రం సాధించడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ చేస్తున్న కృషితో.. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. తమకు కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నరనడానికి ఇటీవల దేశవ్యాప్తంగా కేసీఆర్కు లభిస్తున్న మద్దతే నిదర్శనం.. దేశంలోని విపక్షాలను ఒక తాటిపైకి తేవడంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అంతా మద్దతుగా నిలబడతాం..
-రజితా యాదవ్, నిజామాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్
కేసీఆర్ నాయకత్వమే దేశానికి కావాలి..
కేసీఆర్ గొప్ప రాజకీయ పరిశీలకుడు.. రాజకీయరంగంంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా దేశాన్ని కష్టజీవుల పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి.. అన్నింటికీ మించి తెలంగాణ సాధన కోసం జాతీయస్థాయిలో అన్ని రాజకీయపార్టీల మద్దతును కూడగట్టిన గొప్ప రాజకీయ నాయకుడు.. ఇటువంటి కేసీఆరే రేపటి దేశప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కడా చూసినా.. కేసీఆర్ దేశ నాయకుడు అవుతున్నాడని సంబురపడుతున్నరు.. తెలంగాణను సాధించి సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ దేశ ప్రధాని అయితే, దేశమే బంగారు దేశంగా మారిపోతుంది. ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న దానికి మా జడ్పీటీసీలంతా సపోర్టుగా ఉన్నాం..
-గిర్దావర్ లక్ష్మీ గంగారెడ్డి, జడ్పీటీసీ, బోధన్
దేశంలో కేసీఆర్కు ఎదురులేదు..
దేశంలో సీఎం కేసీఆర్ హవా ప్రారంభమైంది.. ఇప్పటికే దేశంలోని రైతు నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రవేశాన్ని స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలతో అనేక పథకాలతో సామాన్యుల కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా నాశనమైంది.. ధరల పెరుగుదల, పన్నుల భారంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దేశం బాగుంటేనే.. అన్ని రాష్ట్రాలు బాగుంటాయి. ఇందుకు దేశంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇందుకు ఎవరు నాయకత్వం వహిస్తారా అన్న సందేహం ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ గనుక దేశ రాజకీయాల్లోకి వెళ్లితే.. ఆయనకు దేశ ప్రజలంతా జై కొడుతారు. దేశ్ కీ నేతగా కేసీఆర్ను చూడాలన్నదే మా ఆశ..
-శంకర్ పటేల్, జడ్పీటీసీ, కోటగిరి
దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్కే ఉంద
రుద్రూర్ : దేశంలోని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రం సాధించుకున్నాక తర్వాతే పాలన అంటే ఈ విధంగా ఉండాలని చూపించిన నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో రైతుల కోసం అమలవుతున్న పథకాల్లో కొన్నింటిని అయినా దేశవ్యాప్తంగా అమలు చేస్తే రైతు రాజు కావడం ఖాయం. అదే విధంగా అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాష్ర్టాన్ని సాధించడంలో సఫలీకృతుడైన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్ల్లోకి వస్తున్నారంటే దేశం అభివృద్ధికి నోచుకోవడం ఖాయం. దేశ ప్రజలు మోదీ పాలనతో విసిగిపోయారు. కేసీఆర్ పాలనతో ఈ పరిస్థితి పోతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
-నారోజి గంగారాం, జడ్పీటీసీ, రుద్రూర్
కేసీఆర్తోనే గిరిజనులకు న్యాయం
వర్ని : రాష్ట్రంలోని గిరిజనులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారు. తండాలను పంచాయతీలుగా చేసి పాలనా పగ్గాలు మా చేతికి అందించారు. పంచాయతీలుగా మార్చడమే కాకుండా పుష్కలంగా నిధులు మంజూరు చేస్తూ తండాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇంతటి ముందు చూపు ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని గిరిజనులందరికీ న్యాయం జరుగుతుంది. వెనుకబడిన తండాలు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాట పడతాయి.
-బర్దావల్ హరిదాస్, జడ్పీటీసీ, వర్ని
దేశానికి కేసీఆర్ సేవలు అవసరం..
నవీపేట : ప్రస్తుతం దేశ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ సేవలు అత్యవసరం. రోజురోజుకూ దేశ పరిస్థితి దిగజారిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఒక విజన్ ఉన్న నాయకుడిగా.. రాష్ర్టాన్ని సాధించిన అనుభవం ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ పరిస్థితుల్లో మార్పు వస్తుందని పలు రాష్ర్టాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి త్వరిత గతిన రావాలని కోరుకుంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్న కేసీఆర్ సార్కు ధన్యవాదాలు..
-నీరడి సవితా బుచ్చన్న, జడ్పీటీసీ, నవీపేట
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే
బాన్సువాడ రూరల్ : దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్ద గల నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి. వివిధ ప్రభుత్వ రంగాలు ధ్వంసమవుతున్న తరుణంలో ఆయన సేవలు దేశానికి అవసరం. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే.
-పద్మాగోపాల్రెడ్డి, బాన్సువాడ జడ్పీటీసీ
సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్
బీర్కూర్ : దేశాన్ని కొన్నేండ్లుగా ఏలుతున్న ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకే దేశాన్ని ఏలేందుకు సమర్ధవంతమైన నాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అవసరం. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేదలను విస్మరించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచే విధంగా నిత్యావసర ధరలను పెంచేసింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటిని ప్రైవేటు పరం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ దేశాన్ని రక్షించే సత్తా ప్రస్తుతం సీఎం కేసీఆర్కే ఉన్నది. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ సూచకం.
-తనబుద్ది స్వరూపా శ్రీనివాస్, జడ్పీటీసీ, బీర్కూర్