ఖలీల్వాడి, మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూపేణా రూ.20వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యిందని ఆరోపించారు. గతంలో ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు.
ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు మొదలయ్యాయని, రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, కార్యదర్శి ఎనుగందుల మురళి, మీర్ మజాజ్అలీ, ప్రభాకర్రెడ్డి, దండు శేఖర్, సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.