బాన్సువాడ, అక్టోబర్ 29 : సమైక్య పాలనలో బానిసవాడగా ఉన్న బాన్సువాడను సీఎం కేసీఆర్ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి మేడగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఐదోస్థానంలో నిలబెట్టారు. రైతు బాంఢాగారంగా, ఎడ్యుకేషన్ హాబ్గా, డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేరాఫ్గా మార్చారు. వీటితోపాటు సాగు, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించి ప్రజల మన్ననలు పొందారు. స్పీకర్ పోచారాన్ని లక్ష్మీ పుత్రుడిగా భావించే సీఎం కేసీఆర్.. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇచ్చారు. దీంతో తొమ్మిదేండ్లలోనే రూ. 10వేల కోట్లతో నియోజక వర్గ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో పేదలకు 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిచారు. గృహ సముదాయాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం, కరెంటు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు.
నియోజకవర్గంలో రూ.300 కోట్లతో చెరువులను పునరుద్ధరించారు. రూ.150 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించారు. రూ.106 కోట్లతో చందూర్, చింతకుంట ఎత్తిపోతలతోపాటు రూ.200 కోట్లతో సిద్దాపూర్ జలాశయయం నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. మంజీరాపై రూ. 175 కోట్లతో చెక్ డ్యాములు, మరో రూ.150 కోట్లతో కొత్తగా ఎత్తిపోతల నిర్మాణం చేపట్టారు. సుమారు 31 గురుకుల పాఠశాలు, కళాశాలలు, వసతిగృహాలు, రెసిడెన్సియల్ పాఠశాలను నెలకొల్పారు.
బాన్సువాడ పట్టణాన్ని నగరాలకు దీటుగా అభివృద్ధి చేశారు. రూ.40 కోట్లతో ప్రధాన రహదారి, రూ.3 కోట్లతో మున్సిపల్ భవనం, రూ. కోటీ యాభై లక్షలతో అంబేద్కర్ భవనం, రూ. కోటీ యాబై లక్షలతో రెవెన్యూ కార్యాలయాలు, రూ. రెండు కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ మినీస్టేడియం, రూ. 4కోట్లతో మల్టీజనరేషన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కు, రూ. రెండు కోట్లతో సమీకృత మార్కెట్ను నిర్మించారు. రూ.7 కోట్లతో మినీ ట్యాంక్బండ్ నిర్మించారు.
బాన్సువాడ మండలంలో రూ.90 కోట్లతో 225కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయించారు. 43వేల మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఉచిత కరెంటు కోసంఏటా రూ.170 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.150 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథ పథకానికి రూ.2000 కోట్లు ఖర్చు చేసి 60,797 గృహాలకు తాగునీరు అందిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అందించారు. బాలింతలకు కేసీఆర్ కిట్ ద్వారా రూ.120 కోట్లు కేటాయించారు. మత్స్యకారులకు రూ.100 కోట్లతో చేప పిల్లలను పంపిణీ చేశారు. రూ.300 కోట్లతో గొల్ల కుర్మలకు రాయితీపై జీవాలను అందించారు. రైతుబంధు పథకం ద్వారా అన్నదాతకు రూ.600 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించారు.
బాన్సువాడలో నాణ్యమైన వైద్యం అందించేందుకు రూ.20 కోట్లతో వంద పడకల మాతాశిశు దవాఖానతోపాటు రెండు బస్తీ దవాఖానలు నిరిచారు. రూ.కోటితో బ్లడ్ బ్యాంక్, ఎన్ఐసీయూ కేంద్రంతోపాటు కోటగిరి, వర్ని దవాఖాలను అప్గ్రేడ్ చేసేందుకు రూ. 20.25 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో రూ.1000 కోట్లతో రహదారులు, రూ.400
కోట్లతో కమ్యూనిటీ హాల్స్
నిర్మించారు.