వేల్పూర్, అక్టోబర్ 11 : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ ప్రేమ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో వేల కోట్ల నిధులతో ప్రజలకు శాశ్వతంగా ప్రయోజనాన్ని అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించానని మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్లో బుధవారం తనను కలవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తనను రెండు సార్లు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం కేసీఆర్ మొదటి సారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, రెండోసారి ఆర్ అండ్ బీ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.
నియోజకవర్గంలోఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి అవసరమైన దానికి మించే అభివృద్ధి అందించిన విషయం ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. సాగు నీటి రంగంలో పునర్జీవం పథకం ద్వారా 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలను తెచ్చి ఎస్సారెస్పీలో పోసుకోవడంతో పాటు ప్రాజెక్టు పరిధిలో రైతులకు, బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాల్లోని లక్ష్మీ కెనాల్, గుత్ప, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి, తదితర ఎత్తిపోతల పథకాలకు నీటికి కొదవ లేకుండా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఎస్సారెస్పీకి దూరంగా ఉండే భీమ్గల్, మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్యాకేజీ- 21తో కాళేశ్వరం జలాలను తెచ్చి కప్పల వాగులో పారించుకోవడం తనకు ఎనలేని ఆనందాన్ని అందించిందన్నారు.
ఇదంతా కేసీఆర్ సహకారంతో సాధ్యం చేశానని, ఇంత చేసిన తనను ప్రజలు తప్పకుండా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వచ్చే కొంతమంది తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారికి నియోజకవర్గ ప్రజలే సమాధానం చెబు తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఓట్ల కోసం వారు ఎన్ని కుయుక్తులు పన్నినా నియోజకవర్గ ప్రజలు తనపై చూపే ప్రేమను దూరం చేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం శ్రీరామరక్ష అయితే బాల్కొండ ప్రజల ఆశీర్వాదమే తనకు శ్రీరామరక్ష అన్నారు.
బాల్కొండ, ఏర్గట్ల, మెండోరా మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన పలు కులసంఘాల కమిటీ సభ్యులు, రైతులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అన్ని విధాలా అభివృద్ధి చేసి అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు అని నినదించారు. నియోజకవర్గం నలుమూలాల నుంచి తనకు మద్ద తు తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలకు, రైతులకు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండ ల కన్వీనర్లు శేఖర్రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పూర్ణానందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగుడి జన చైతన్యయాత్రను
సారే కావాలి.. కారే రావాలంటూ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లింగాపూర్ తండాకు చెందిన దివ్యాంగుడు డి.మహేశ్ కేసీఆర్ సర్కార్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్పై జనచైతన్య యాత్రను చేపట్టాడు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ చేరుకున్న మహేశ్.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మహేశ్ను అభినందించారు.