ధర్పల్లి : పార్టీ కోసం పని చేస్తూ అనారోగ్య కారణాలతో అసువులు బాసిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. మండలంలోని ఒన్నాజీపేట్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యురాలు దండోల్ల శోభ భర్త నర్సారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. ఉద్యమ నాయకుడైన నర్సారెడ్డి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను ఈగ గంగారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం గ్రామంలోని ఎంకంగారి లింబారెడ్డి, చిన్నారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కేసీఆర్ అన్నివర్గాల ప్రజలతో పాటు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన వారికి అండగా ఉంటున్నారని వెల్లడించారు. అక్కడి నుంచి గ్రామంలో నూతనంగా నిర్మించిన మొటాడిరెడ్డి యువజన సంఘాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ భగవాన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జి.కిష్టారెడ్డి, యానంపల్లి రాజు, వాల్గోట్ చిన్నారెడ్డి, నారాయణ, గంగాధర్, మల్లయ్య, అరుణ్రెడ్డి, సుమన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.