Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 25 : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్ సవరణలో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని ఆయన బీఎల్వోలకు పోచారం సూచించారు.
నకిలీ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఓటు హక్కు ఫరిరక్షణ ప్రతీ పౌరుడి భాధ్యత అని పేర్కోన్నారు. ఎస్ఐఆర్ ప్రారంభం సందర్భంగా సర్పంచులు, బీఎల్ వోలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు. తాడ్కోల్, బోర్లం, ఇబ్రహీంపేట్, కోనాపూర్, హన్మాజీపేట్, దేశాయిపేట్ తదితర గ్రామాలలో బీఎల్వీలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.