ఎడపల్లి, నవంబర్ 25: బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంతోపాటు మంగళ్పాడ్, కుర్నాపల్లి, ఠాణకాలన్, బాపూనగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, రైతు పెట్టుబడి సాయం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3000, రేషన్కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా, గృహలక్ష్మి పథకం కింద అర్హులకు ఇండ్లు నిర్మించి అందజేస్తామని తెలిపారు. కారుగుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కె.శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్, సర్పంచులు ఆకుల మాధవి, దశరథ్, హన్మాండ్లు, సావిత్రీ రవీందర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, సునీత రవి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, ఎంపీటీసీలు స్రవంతి పోతన్న, మనీషా రెడ్డి, బాబా, వనజా నాగరాజు, రాంరెడ్డి, పద్మ ముత్తన్న, నాయకులు ఎల్లయ్య యాదవ్, న్యావనంది సూభాష్, జనగం మోహన్రెడ్డి, అబ్దుల్ వాహబ్ బారి, మండల ఇన్చార్జి వస్సె, చికెన్ సెంటర్ హైమద్, ఫర్టిలైజర్ హైమద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెంజల్, నవంబర్ 25: ఈనెల 30న నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి కట్టుగా తన గెలుపు కోసం పని చేయాలని బోధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ కోరారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో రెంజల్, ఎడపల్లి మండలాల ప్రధాన నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను మూడోసారి బోధన్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఓటర్లు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మీ రుణం తీర్చుకుంటానని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కార్యకర్తలు సైనికుల్లా పని చేసి, ప్రత్యర్థుల డిపాజిట్ గల్లంతు చేయాలని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవంతో అభివృద్ధిలో బోధన్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శంగా మారుస్తానని అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు వికార్పాషా, ఖలీంబేగ్, రాజు, ఎంపీటీసీలు హైమద్, అసద్బేగ్, రెంజల్ విండో చైర్మన్ మొహినుద్దీన్, మైనార్టీ జిల్లా నాయకులు రఫిక్, ఖదీర్ఖాన్, జిల్లా నాయకులు రాఘవేందర్, బాబునాయక్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.