ఇందల్వాయి, నవంబర్ 28 : మండలంలోని తిర్మన్పల్లి వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను సోమవారం కలిశారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను త్వరలోనే మంజూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు చింతల దాస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల ఉపాధ్యక్షుడు శెట్టి బిరీశ్, వీడీసీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్, సభ్యులు ధరంపురి గంగాధర్, మల్లేశ్, ఎర్రల సాయన్న, అన్నారం గంగారాం, గొల్ల మోహన్, రమేశ్, దొండ్ల గంగన్న, తెడ్డు గంగన్న, మహేందర్, సాయిరెడ్డి, రవిగౌడ్, ఈర్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.