నిజాంసాగర్, నవంబర్ 11: ‘మీ నియోజకవర్గ బిడ్డను.. ఆ శీర్వదించి గెలిపించండి..’ అంటూ జుక్కల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే ఓటర్లను అభ్యర్థించారు. జుక్కల్ మండలంలోని సావర్గావ్, వజ్రఖండి, సోపూర్, మథుర తండా, డోన్గావ్, దోస్తపల్లి, బంగారుపల్లి, మైబాపూర్, గుండూరు, జుక్కల్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన ఆయనకు మహిళలు మం గళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు తిలకం పెట్టి మళ్లీ విజయం సాధిస్తారని, నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలుపొందుతారంటూ ఆశీర్వదించారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వలస నాయకులన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలపాలవుతామని అన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికా రం చేపట్టాక పింఛన్ను పెంచిందని, రెండో సారి రెట్టింపు చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వస్తే దశల వారీగా పెంచుతుందని తెలిపారు. రైతుబంధును కూడా దశలవారీగా ఎకరానికి 16వేలకు పెంచి అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే మార్చి నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేశారు. నాగమడుగు మత్తడి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. గడిచిన 65 ఏండ్లలో జరగని అభివృద్ధి పనులు కేవలం పదేండ్లలోనే చేశామని చెప్పారు. విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. నాయకులు నీలూపటేల్, సాయాగౌడ్, శివానంద్, మాధవ్రావ్దేశాయ్, బొల్లి గంగాధర్, పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.